ఓటీటీ బాటలో కృతి మరో చిత్రం!
on Sep 25, 2021
ఓటీటీ వేదికగా అలరించిన హిందీ చిత్రాల్లో `మిమి` ఒకటి. కృతి సనన్ టైటిల్ రోల్ లో నటించిన ఈ కామెడీ డ్రామా.. జూలై 26న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది. `మిమి`లో సరోగెట్ మదర్ గా కృతి అభినయం వీక్షకులను ఎంతగానో అలరించింది. కట్ చేస్తే.. కృతి సనన్ నటించిన మరో బాలీవుడ్ మూవీ కూడా ఓటీటీ బాటలో వెళుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. `బరేలీ కీ బర్ఫీ` తరువాత రాజ్ కుమార్ రావ్ తో కలిసి కృతి నటించిన సినిమా `హమ్ దో హమారే దో`. ఓ పెళ్ళైన జంట.. వృద్ధ దంపతులను తల్లిదండ్రులుగా దత్తత తీసుకున్నాక జరిగే పరిణామాల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. పరేష్ రావెల్, రత్నా పాటక్ షా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమ్ కానుందని సమాచారం. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ రానుంది. మరి.. కృతి ఖాతాలో ఓటీటీ వేదికగా మరో విజయం సొంతమవుతుందేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం కృతి సనన్ చేతిలో `ఆదిపురుష్`, `బచ్చన్ పాండే`, `బేడియా` చిత్రాలున్నాయి. వీటిలో `ఆదిపురుష్` చిత్రీకరణ దశలో ఉండగా.. మిగిలిన రెండు సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకున్నాయి. 2022లో ఈ చిత్రత్రయాలు జనం ముందుకు రాబోతున్నాయి.
Also Read