మనోజ్ `అహం బ్రహ్మాస్మి`లో `పెదరాయుడు` జోడీ!
on Oct 19, 2021
వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలిచే యువ కథానాయకుల్లో మంచు మనోజ్ ఒకరు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో.. `అహం బ్రహ్మాస్మి` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎం.ఎం. ఆర్ట్స్ పతాకంపై మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు మనోజ్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మనోజ్ కి తల్లిగా సీనియర్ యాక్ట్రస్ భాను ప్రియ నటించనుందని సమాచారం. అంతేకాదు.. ద్వితీయార్ధంలో ప్రవేశించే ఈ పాత్ర సినిమాకి చాలా కీలకంగా ఉంటుందట. మరీముఖ్యంగా.. మనోజ్, భాను ప్రియ మధ్య సాగే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని అంటున్నారు. త్వరలోనే `అహం బ్రహ్మాస్మి`లో భాను ప్రియ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. `పెదరాయుడు`లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి జోడీగా నటించి అలరించిన భాను ప్రియ.. ఇప్పుడు మోహన్ బాబు తనయుడైన మనోజ్ కి తల్లి పాత్రలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.