మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ
on Sep 21, 2021
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆర్థికంగా అండగా నిలిచి.. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు.
ఎన్టీఆర్ స్థాపించిన 'బసవతారకం' క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా బాలకృష్ణ అనేకమంది క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే ఒక చిన్న పాప క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం హాస్పిటల్ లో చేరింది. మణిశ్రీ చికిత్స కోసం రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో రూ.1.80 లక్షలు డబ్బులు సేకరించారు. అయితే మణిశ్రీ ఆపరేషన్ కోసం ఇంకా రూ.5.20 లక్షలు తక్కువయ్యాయి. దీంతో మణిశ్రీ తల్లిదండ్రులు బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ని కలిసి.. తమ ఆర్ధిక పరిస్థితిని వివరించారు.
దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్ళగా.. ఆయన వెంటనే స్పందించి పాప ఆపరేషన్ కు కట్టాల్సిన రూ.5.20 లక్షలు మాఫీ చేయించారు. అంతేకాదు చిన్నారికి మెరుగైన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి చెప్పారు. దీంతో బాలకృష్ణపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read