రామ్-లింగుస్వామి మూవీలో అక్షర గౌడ
on Jul 31, 2021
ఎనర్జిటిక్ హీరో రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.‘RAPO19’అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో కృతి శెట్టితో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది.
రామ్-లింగుస్వామి మూవీలో అక్షర గౌడ నటిస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ సందర్భంగా అక్షర గౌడకు స్వాగతం తెలుపుతూ మూవీ టీమ్ శనివారం ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలలో అక్షర గౌడ నటించింది. తెలుగులో నాగార్జున హీరోగా నటించిన 'మన్మథుడు-2' సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాలు చేస్తున్న ఈ భామ.. ఇప్పుడు రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న బైలింగువల్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిత్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also Read