ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించాలని ఉంది
on Oct 12, 2021
లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించాలని ఉందని హీరోయిన్ అదితీరావు హైదరి తెలిపింది. ఆమె నటించిన 'మహా సముద్రం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మహా సముద్రం'. ఇందులో అదితీరావు హైదరి, అనూ ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అదితీ మీడియా మాట్లాడుతూ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ గురించి తన మనసులో మాట బయట పెట్టింది. మీరు ఎవరి బయోపిక్ లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని అడగగా.. దానికి ఆమె 'లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించాలని ఉందని.. భారతరత్న అందుకున్న మొట్టమొదటి సంగీత కళాకారిణి సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించాలనేది తన కల' అని అదితీ తెలిపింది.
మరి, ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించాలనుకుంటున్న అదితీ కల నెరవేరుతుందో లేదో చూడాలి.
Also Read