ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కథానాయికల్లో రాశీ ఖన్నా ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళం.. ఇలా మూడు భాషల్లో అరడజనుకి పైగా చిత్రాలు చేస్తోంది రాశి. అలాగే హిందీలో ఓ వెబ్ - సిరీస్ లో కూడా నటిస్తోంది ఈ ఉత్తరాది సోయగం.
ఇదిలా ఉంటే.. ఈ అక్టోబర్ మాసం రాశీ ఖన్నాకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో రాశి నటించిన రెండు ఆసక్తికరమైన చిత్రాలు జనం ముందుకు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందిన మలయాళ చిత్రం `భ్రమమ్` అక్టోబర్ 7న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుండగా.. తమిళ సినిమా `అరణ్మనై 3` అక్టోబర్ 14న థియేటర్స్ లోకి రానుంది. మరి.. వారం వ్యవధిలో వస్తున్న ఈ చిత్రాలతో రాశీ ఖన్నా ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
కాగా, `భ్రమమ్`లో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించగా రవి కె. చంద్రన్ దర్శకత్వం వహించారు. ఇక `అరణ్మనై 3` విషయానికి వస్తే ఆర్య హీరోగా నటించిన ఈ సినిమాకి సుందర్.సి దర్శకుడు.