మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో మిగతా టాలీవుడ్ స్టార్స్ తో పోల్చితే విక్టరీ వెంకటేష్ ముందుంటాడు. ఇప్పటికే కమల్ హాసన్, మహేష్ బాబు, రామ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య వంటి ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. ఇప్పుడు రవితేజతో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
'కొత్త బంగారు లోకం' లాంటి సూపర్ హిట్ మూవీతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల.. రెండో సినిమాగా వెంకటేష్, మహేష్ లతో తీసిన మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత 'ముకుంద', 'బ్రహ్మోత్సవం', 'నారప్ప' సినిమాలు తెరకెక్కించిన శ్రీకాంత్.. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, రవితేజలను దృష్టిలో పెట్టుకొని ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కి ఇప్పటికే వెంకటేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. త్వరలోనే రవితేజకు కూడా శ్రీకాంత్ కథ వినిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
కాగా ఇటీవల 'ఎఫ్-3' సినిమాలో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'కబీ ఈద్ కబీ దివాలీ' మూవీలో కీలక పోషిస్తున్నాడు. రవితేజ విషయానికొస్తే త్వరలో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఆయన.. 'రావణాసుర', 'ధమాకా', 'టైగర్ నాగేశ్వరరావు' వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.