ఫోటోగ్రాఫర్ల తీరుపై విరుచుకుపడ్డ జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న కామెంట్స్
- పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ బోల్డ్ రియాక్షన్ - ఫోటోల యాంగిల్స్ గురించి షాకింగ్ విషయాలు - అలాంటి ఫోటోలు తీసి మళ్ళీ కామెంట్స్ చేస్తారా? అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటో షూట్లతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ, తాజాగా పాపరాజీల (సినిమా ఫోటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత విషయాలు, తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే తనకు చాలా కోపం వస్తుందని ఆమె కుండబద్ధలు కొట్టింది. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ జిమ్ కి వెళ్ళినా, ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినా పాపరాజీలు వారిని వదలకుండా వెంటాడుతుంటారు. ఈ క్రమంలో జాన్వీ ధరించే దుస్తులపై తరచూ విమర్శలు వస్తుంటాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. పాపరాజీలు ఫోటోలు తీసే విధానాన్ని తప్పుబట్టింది. "నేను ఎంతో కష్టపడి ఫోటో షూట్స్ చేస్తాను, అక్కడ నా లుక్ బాగుంటుంది. కానీ పాపరాజీలు కొన్నిసార్లు అసౌకర్యంగా ఉండే యాంగిల్స్ నుండి ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు 'ఈమె హాట్గా లేదు, అందంగా లేదు' అని కామెంట్స్ చేయడం చూస్తే చాలా బాధగా, కోపంగా అనిపిస్తుంది" అని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా మహిళా నటీమణుల విషయంలో కెమెరా యాంగిల్స్ మార్చి, క్లిక్ బైట్ కోసం అసభ్యకరంగా కనిపించేలా ఫోటోలు తీయడం సరైన పద్ధతి కాదని జాన్వీ అభిప్రాయపడింది. "నేను ఏం ధరించాలి అనేది నా ఇష్టం. కానీ నేను కంఫర్ట్గా లేని సమయంలో వింత వింత యాంగిల్స్ నుండి ఫోటోలు తీసి, మళ్ళీ వాటిపై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు" అని ఆమె గట్టిగా స్పందించింది. గతంలో పాపరాజీలతో స్నేహపూర్వకంగా ఉండే జాన్వీ, ఇప్పుడు ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాది బాలీవుడ్లో ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతోందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె తన ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపై పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అప్డేట్స్ చూస్తుంటే, ఇందులో జాన్వీ ఒక పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, వారిని కేవలం ఆబ్జెక్టిఫై చేయకూడదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు ఇలాంటివి సాధారణమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, తనపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవడంలో జాన్వీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'పెద్ది' సినిమా షూటింగ్తో బిజీగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. టాలీవుడ్లో ఈ మూవీ కనుక హిట్ అయితే, జాన్వీ ఇక్కడ టాప్ హీరోయిన్ల సరసన చేరడం ఖాయం. హిందీలో కూడా కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తన సినిమాలతో పాటు ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్తో జాన్వీ ఎప్పుడూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది.
Apr 06, 2026
Peddi: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మూవీ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి గ్లింప్స్ వరకు ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా రీసెంట్గా విడుదలైన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె(Raghu Kunche) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, ఏఆర్ రెహమాన్ సంగీతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. 90s నాటి రెహమాన్ కనిపిస్తున్నారు.. పెద్ది నుంచి విడుదలైన చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం గురించి రఘు కుంచె మాట్లాడుతూ.. "ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట 'చికిరి చికిరి'. ప్రతి రోజూ వింటున్నాను. చాలా కాలం తర్వాత రెహమాన్ గారు మళ్ళీ తన వింటేజ్ స్టైల్ను చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆయన సాంగ్స్ చాలా సింపుల్ గా, మెలోడియస్ గా ఉండేవి. ఆ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాక కొంచెం కాంప్లికేటెడ్ మ్యూజిక్ వైపు వెళ్లారు. కానీ 'పెద్ది' చిత్రంతో మళ్ళీ తన మార్కు 90ల నాటి వింటేజ్ రెహమాన్ను గుర్తుచేస్తున్నారు. ఆ పాటల్లోని ఫ్లేవర్ చాలా ఫ్రెష్గా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రెహమాన్ నుంచి తనకు కావాల్సిన అవుట్పుట్ను అద్భుతంగా రాబట్టుకున్నారు" అని ప్రశంసించారు. మట్టి వాసన ఉన్న కథలు ఎప్పుడూ స్పెషలే.. ప్రస్తుతం ప్రేక్షకులు రూటెడ్ కథలకు, అంటే మట్టి వాసన ఉన్న విలేజ్ సబ్జెక్టులకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని రఘు కుంచె అభిప్రాయపడ్డారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే కథలు కేవలం పాత జ్ఞాపకాలనే కాకుండా, కొత్త తరానికి ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమిళంలో మారి సెల్వరాజ్, వెట్రిమారన్ వంటి దర్శకులు ఇలాంటి కథలతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇప్పుడు మన తెలుగులో కూడా అలాంటి ప్రయత్నాలు జరగడం శుభపరిణామమని అన్నారు. 'పెద్ది' కూడా అలాంటి ఒక పవర్ఫుల్ రూటెడ్ సబ్జెక్ట్ అని ఆయన పేర్కొన్నారు. పహిల్వాన్ లుక్ అదిరిపోయింది.. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. గ్లింప్స్లో చరణ్ ధరించిన గోచి కట్టు, ఆయన మాసివ్ బాడీ లాంగ్వేజ్ను చూసి అంతా షాక్ అవుతున్నారు. దీనిపై రఘు కుంచె స్పందిస్తూ.. "అది నిజమైన పహిల్వాన్ లుక్. చరణ్ పడ్డ కష్టం ఆ స్క్రీన్పై కనిపిస్తోంది. నిజానికి ఆ కుస్తీ ఫైట్లు చేస్తున్నప్పుడు ఆయనకు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయని విన్నాను. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా అంత రిస్క్ తీసుకుని రియలిస్టిక్గా చేయడం గొప్ప విషయం." అని చరణ్ డెడికేషన్ను కొనియాడారు. నటనలో కష్టం.. సౌకర్యాల మధ్యే అసలైన సవాల్.. పూర్వం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో ఆర్క్ లైట్ల కింద నటించడం ఎంతో కష్టంగా ఉండేదని, ఇప్పటి హీరోలకు క్యారవాన్లు వంటి సౌకర్యాలు ఉన్నా.. క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయడంలో అదే కష్టం ఉంటుందని రఘు కుంచె వివరించారు. రామ్ చరణ్ తన ఇమేజ్ను పక్కన పెట్టి ఒక పల్లెటూరి మల్లయోధుడిగా మారడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు. మొత్తానికి 'పెద్ది' చిత్రం రామ్ చరణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, బుచ్చిబాబు సానా మేకింగ్ మరియు రెహమాన్ సంగీతం సినిమాను మరో లెవల్కు తీసుకెళ్తాయని రఘు కుంచె నమ్మకం వ్యక్తం చేశారు. మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రఘు కుంచె ఫుల్ ఇంటర్వ్యూ & మరిన్ని ఆసక్తికర సినీ విశేషాల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Apr 01, 2026
Tollywood Trending Today: మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. చరణ్ ఫ్యాన్స్ కి షాక్!
1. పెద్ది రిలీజ్ డేట్పై గందరగోళం: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రావడం కష్టమే అంటున్నారు. రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ లో నిర్మాత SKN కూడా.. 'పెద్ది' జూన్ 26న విడుదలవుతుందంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. అదంతా తూచ్ అంటూ SKN మళ్ళీ వీడియో రిలీజ్ చేసినప్పటికీ.. పెద్ది పోస్ట్ పోన్ న్యూస్ కి మాత్రం బ్రేకులు పడట్లేదు. 2. అల్లు అర్జున్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్: ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'AA22' నుంచి ఒక పవర్-ప్యాక్డ్ వీడియో గ్లింప్స్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మూవీ టీమ్ కేవలం టైటిల్ పోస్టర్తోనే సరిపెట్టే అవకాశం ఉందట. వీడియో కంటెంట్ కోసం ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. అయితే బన్నీ బర్త్ డేకి రిలీజ్ చేయబోయే పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం. 3. అక్టోబర్ నుంచి దేవర-2: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ‘దేవర-2’ కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవగా, ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతోందట. తారక్ డేట్స్ కన్ఫర్మ్ కావడంతో అక్టోబర్ మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. 4. ‘వారణాసి’ షూటింగ్ అప్డేట్: మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మహేష్ తన భాగాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. షూటింగ్తో పాటు టెక్నికల్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. కీరవాణి త్వరలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభించనున్నారు. రాజమౌళి పక్కా ప్లానింగ్తో ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. 5. మాఫియా డాన్గా చిరంజీవి: 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న 'Mega 158' ప్రాజెక్టుకు సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్లో చిరంజీవి 'మాఫియా డాన్'గా కనిపిస్తారని, ఆ సమయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది. 6. అనుష్క శెట్టి విశ్వరూపం: బాహుబలి తర్వాత అనుష్క శెట్టి మరో భారీ విజువల్ వండర్ 'కథనార్'తో అలరించడానికి సిద్ధమైంది. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మాయా ప్రపంచాన్ని చూపిస్తూ ట్రైలర్ అద్భుతంగా సాగింది. 19వ శతాబ్దపు కేరళ నేపథ్యంలో.. దట్టమైన అడవులు, ప్రాచీన ఆలయాల మధ్య సాగే ఈ కథలో విజువల్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి. ఇక ట్రైలర్లో అనుష్క తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో మరోసారి మ్యాజిక్ చేసింది. 7. జయలలిత భవనం సీజ్: హైదరాబాద్లో ఉన్న తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో జె.జయలలిత పేరుతో భవనం ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి పేరుకుపోవటంతో.. జయలలితకు సంబంధించిన వ్యక్తులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాజాగా అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. 8. సల్మాన్ ఖాన్ సరసన నయనతార: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్టులోకి లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బ్లాక్బస్టర్ 'జవాన్'తో నార్త్ ఆడియన్స్ను కూడా మెప్పించిన నయనతార.. సల్మాన్ ఖాన్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఈ యాక్షన్ డ్రామా 2027 ఈద్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది. 9. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్: "అవకాశాల్లేక ఈగలు తోలుకుంటున్నాను" అంటూ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలోని 'గురుతుందా' సాంగ్ లాంచ్ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈగలు తోలుకుంటున్న తన దగ్గరకు సాయి రాజేష్ వచ్చి, ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగారని మెలోడీ బ్రహ్మ అన్నారు. 10. నాగార్జునకు జోడిగా ఐశ్వర్య రాజేష్: కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇదే వీరి కాంబినేషన్ లో మొదటి సినిమా కావడం విశేషం. తమిళ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Mar 31, 2026
Peddi: లుక్ వెనక ఉన్న అసలు రహస్యం ఇదే.. ఈ ఫుడ్ తింటే మీకు కూడా పక్కా
-పహిల్వాన్ లుక్ తో ఆల్ రికార్డ్స్ బద్దలు -అసలు పెద్దికి బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ఎలా వచ్చింది! -చేసిన వ్యాయామాలు ఏంటి! -తీసుకున్న ఫుడ్ -మరి పెద్ది రహ్యసం ఏంటో చూద్దాం స్టిల్ మెగాఫ్యాన్స్ తో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకుల మస్తిష్కాలు రోజువారి దినచర్యలో బిజీగా ఉన్నాయి. అదే టైంలో వాళ్ల మస్తిష్కాల్లో పెద్ది(Peddi)బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ కూడా కదలాడుతూనే ఉంది. అదేనండి.. కండలు తిరిగిన దేహంతో ఇటీవల రిలీజైన పెద్ది పహిల్వాన్ లుక్. పెద్దిని ఒక రేంజ్ లో ఎలివేషన్ చేసిన సదరు లుక్ ఇప్పుడు సోషల్ మీడియాని ప్రశాంతంగా ఉండనివ్వని పరిస్థితి. చరణ్ కి బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ఎలా సాధ్యమైంది! ఎలాంటి ఆహరం తీసుకున్నాడు! ఎలాంటి నియమాలు, వ్యాయామాలు చేసాడు! అని గూగుల్ తల్లితో పాటు తమకి తెలిసిన వాళ్ళందరిని కనుక్కోవడం స్టార్ట్ చేసారు. మరి ఈ విషయంలో మీరు కష్టపడకుండానే మాకు అందిన సమాచారం ప్రకారం పహిల్వాన్ గురించి కొన్ని విశేషాలు తెలియచేస్తున్నాం. సాధారణంగా కండలు పెంచాలంటే మాంసాహారం తప్పనిసరి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. మోస్ట్ లీ ఆ విధంగా చేసే వాళ్ళే ఉంటారు. కానీ చరణ్ ఈ విధమైన నాన్ వెజ్ ఐటం జోలికి వెళ్ళలేదు. కనీసం ఎగ్ ని కూడా ముట్టుకోలేదు. కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటి ప్రకృతి సిద్ధమైన ఫుడ్ తోనే బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ని సొంతం చేసుకున్నాడు. అదే విధంగా గత ఎనిమిది నెలలుగా ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే కఠినమైన వ్యాయామాలతో పాటు వ్యక్తిగతట్రైనర్ పర్యవేక్షణలో మరిన్ని వ్యాయామాలు చేసాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కూడా ఆధ్యాత్మిక నియమాలని పాటిస్తూనే వ్యాయామాలు చేసాడు. వాటిల్లో 'ముగ్ధార్' అనే సాంప్రదాయ వ్యాయామ పరికరాన్ని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. బరువైన చెక్కతో తయారైన ముగ్ధార్' ని పాతకాలంలో యోధులు, పహిల్వాన్లు, మల్లయోధులు తమ శారీరక దారుఢ్యం, బలం, కండరాల పుష్టి కోసం చేతితో తిప్పుతూ వ్యాయామం చేసేవారు. గద ఆకారాన్ని పోలి ఉంటుంది. టీజర్లో చరణ్ గదను తిప్పుతూ పోరాట సన్నివేశాల్లో కనిపించడం ఈ శిక్షణకి నిదర్శనమని కూడా చెప్పవచ్చు. Also read: UStaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ పై అలీ కీలక వ్యాఖ్యలు చరణ్ ఇటీవల పెద్ది షూట్ లో గాయాలపాలవ్వడంతో పెద్ది వాయిదా అనే న్యూస్ నెటిజన్స్ అత్యధిక ఓట్లతో వాయిదా అనేది నమ్మశక్యంగానే ఉంది. కానీ మూవీ లవర్స్, ఫ్యాన్స్ మాత్రం ఏప్రిల్ 30 న పెద్ది ఆగమనం ఫిక్స్ అంటున్నారు. మరి వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదనే కోరుకుందాం.
Mar 31, 2026
Peddi Release Date: రామ్ చరణ్ 'పెద్ది' మళ్ళీ వాయిదా.. మెగా ఫ్యాన్స్కు సారీ చెప్పిన నిర్మాత!
పెద్ది రిలీజ్ డేట్పై గందరగోళం ఏప్రిల్ 30నే వస్తుందా లేదా జూన్లో వస్తుందా? క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). గ్లోబల్ స్టార్గా ఎదిగిన చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి మార్చి 27న విడుదల కావాల్సిన పెద్ది, ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా కష్టమే అంటున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి పోస్ట్ పోన్ న్యూస్ ఊపందుకున్నాయి. పెద్ది కొత్త విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ రకంగా ఈ చర్చకు కారణమైన నిర్మాత ఎస్కేఎన్ (SKN) తాజాగా ఈ విషయంలో స్పందిస్తూ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్ లో ఎస్కేఎన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 26న విడుదలవుతుందని అందుకే తమ సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకుంటున్నామని ప్రకటించారు. మెగా కాంపౌండ్ కి దగ్గరగా ఉండే నిర్మాత నోటి నుంచి ఈ మాట రావడంతో, 'పెద్ది' విడుదల ఏప్రిల్ 30 నుండి జూన్కు వాయిదా పడిందని అందరూ ఫిక్స్ అయిపోయారు.ఈ న్యూస్ వైరల్ కావడంతో మెగా అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్కేఎన్ ఒక వీడియోను విడుదల చేస్తూ అసలు విషయం వివరించారు. ఈవెంట్లో ఎస్కేఎన్ తో సాయి రాజేష్ మాట్లాడుతూ.. 'పెద్ది' జూన్ 26న రానుందని సోషల్ మీడియాలో ట్వీట్లు కనిపిస్తున్నాయని, ఆ టీం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు మన సినిమా డేట్ అనౌన్స్ చేయొద్దు అని చెప్పారట. అయితే ఆ సమయంలో అక్కడ సౌండ్ డిస్టబెన్స్ వల్ల వల్ల సాయి రాజేష్ మాటలను ఎస్కేఎన్ తప్పుగా అర్థం చేసుకున్నారట. 'పెద్ది' మేకర్స్ అప్పటికే డేట్ను అధికారికంగా ప్రకటించేశారని పొరబడిన ఎస్కేఎన్, స్టేజి మీద ఆ విషయాన్ని చెప్పేశారు. తన వల్ల జరిగిన ఈ చిన్న మిస్ కమ్యూనికేషన్కు ఆయన చింతిస్తూ, "పెద్ది లాంటి పెద్ద సినిమా అప్డేట్స్ ఆ ప్రొడక్షన్ హౌస్ నుండే రావాలి. నేను పొరపాటున ఆ డేట్ చెప్పినందుకు క్షమించండి" అన్నారు. దీంతో పెద్ది వాయిదాపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రారా' సాంగ్స్ చార్ట్బస్టర్స్ గా నిలిచాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ ఉంది. ఏప్రిల్ 30నే వస్తుందా లేదా ఎస్కేఎన్ చెప్పినట్లు జూన్లో వస్తుందా అన్నది 'పెద్ది'ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Also Read: మెగా సర్ప్రైజ్.. మాఫియా డాన్గా చిరంజీవి! https://x.com/SKNonline/status/2038650185690341758
Mar 31, 2026
Ram Charan: రామ్ చరణ్ సినిమా కోసం 'ధురంధర్' టెక్నీషియన్!
RC17 కోసం సుకుమార్ సంచలన నిర్ణయం దేవి శ్రీ ప్రసాద్ ప్లేస్ లో 'ధురంధర్' మ్యూజిక్ డైరెక్టర్! గత కొంతకాలంగా ఇండియా వైడ్ గా 'ధురంధర్'(Dhurandhar) పేరు మారుమోగిపోతోంది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన 'ధురంధర్' దాదాపు రూ.1400 కోట్లతో సంచలనం సృష్టించగా, దానికి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన 'ధురంధర్-2' అంతకుమించిన వసూళ్లతో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 'ధురంధర్' అద్భుత విజయంలో శాశ్వత్ సచ్దేవ్(Shashwat Sachdev) అందించిన సంగీతం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. అలాంటి శాశ్వత్ సచ్దేవ్ త్వరలో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఆయన రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. 'రంగస్థలం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా #RC17పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుంటాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలన్నీ చార్ట్బస్టర్లే. అయితే, ఈసారి సుకుమార్ ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. #RC17 కోసం బాలీవుడ్ సెన్సేషన్ శాశ్వత్ సచ్దేవ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎవరు ఈ శాశ్వత్ సచ్దేవ్? శాశ్వత్ సచ్దేవ్ గతంలో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇటీవల విడుదలైన 'ధురంధర్ 2' సినిమాలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లింది. ఈయన మ్యూజిక్ స్టైల్ చాలా యూనిక్గా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండటంతో సుకుమార్ ఈయన్ని ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట. సుకుమార్ సినిమాల్లో మ్యూజిక్ కి పెద్ద పీట ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేసిన గత సినిమాలు 'పుష్ప-1', 'పుష్ప-2' పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించగా, అందులో మ్యూజిక్ ఎంతటి హైలైట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు #RC17 కోసం అంతకుమించి అనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అందుకే శాశ్వత్ సచ్దేవ్ ని రంగంలోకి దింపుతున్నారట. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షూటింగ్ అప్డేట్ ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. ఆ తర్వాత వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే సుకుమార్ దుబాయ్లో ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ శాశ్వత్ సచ్దేవ్ ఈ ప్రాజెక్ట్లోకి వస్తే, రామ్ చరణ్ సినిమాకు ఒక సరికొత్త సౌండ్ వినడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ మార్క్ టేకింగ్ కు ఈ ధురంధర్ మ్యూజిక్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే అని చెప్పవచ్చు.
Mar 30, 2026బాక్సాఫీస్ రేసులో పెద్ది, స్వయంభూ.. అసలు ఏప్రిల్లో ఈ రెండూ రిలీజ్ అవుతాయా?
- 'స్వయంభూ', 'పెద్ది' సినిమాల రిలీజ్పై ఉత్కంఠ - ఏప్రిల్లో రిలీజ్ అయ్యే సినిమా షెడ్యూల్స్లో మార్పు - సస్పెన్స్లో క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ డేట్స్. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వేసవి సందడి మొదలైంది. మార్చి ముగిసి ఏప్రిల్ నెలలోకి అడుగుపెడుతున్న తరుణంలో, సినీ ప్రేమికులందరూ కొత్త సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ నెలలో థియేటర్లలోకి రావాల్సిన రెండు భారీ చిత్రాల విడుదల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్వయంభూ', అలాగే రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రాల రిలీజ్ డేట్లపై ప్రస్తుతం ఒక రకమైన సస్పెన్స్ కొనసాగుతోంది. చారిత్రక నేపథ్యంలో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'స్వయంభూ'. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్గా భావిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా మేకర్స్ ఒక కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ పోస్టర్లో 'సమ్మర్ రిలీజ్' అని మాత్రమే పేర్కొన్నారు తప్ప, కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 10న వస్తుందని అందరూ భావించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడంతో ఆ తేదీన సినిమా వచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 30కి షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు 'పెద్ది' సినిమా విడుదలపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్లో ఏప్రిల్ 30న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ తాజా టాక్ ప్రకారం, ఈ సినిమా ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, రెండు పాటల షూటింగ్ కూడా పెండింగ్లో ఉందని తెలుస్తోంది. అవుట్పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఏప్రిల్ 30న 'స్వయంభూ' ఫిక్స్ అయితే, 'పెద్ది' రేసు నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన వారాల్లో మరికొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో 'బైకర్', 'రాకాస' వంటి చిన్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇక రెండో వారంలో అడివి శేష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'డెకాయిట్' ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడో వారంలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్', 'తిమ్మరాజుపల్లి టీవీ' వంటి విభిన్న చిత్రాలు లైన్లో ఉన్నాయి. నెల చివరి వారంలో మాత్రం ఏ సినిమా నిలుస్తుందనేది ప్రస్తుతానికి మిస్టరీగానే మారింది. నిఖిల్ తన గత చిత్రం 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా, రామ్చరణ్ పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరి సినిమాలపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ రెండు చిత్రాల అప్డేట్స్ కోసం అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సమ్మర్ సీజన్లో ఏ సినిమా విజేతగా నిలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Mar 30, 2026.webp)
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’లో అదిరిపోయే ట్విస్ట్.. అసలు కథ ఇదే!
‘పెద్ది’ క్రేజీ అప్డేట్ మెగా పవర్ స్టార్ డ్యూయల్ రోల్ తండ్రి కొడుకులుగా చరణ్ బుచ్చిబాబు ప్లాన్ మామూలుగా లేదుగా! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). ఇటీవల విడుదలైన గ్లింప్స్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన గెటప్స్లో కనిపిస్తారని తెలియడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ తండ్రి మరియు కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. ఒక పాత్ర 1980ల నాటి పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో సాగే పహిల్వాన్ కాగా, రెండో పాత్ర ప్రస్తుత కాలానికి సంబంధించిన యువకుడిగా ఉంటుందని సమాచారం. గతంలో చరణ్ 'మగధీర', 'నాయక్' వంటి చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ చేసి మెప్పించాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా 'ఉప్పెన' చిత్రంతోనే తనలోని ఎమోషనల్ రైటింగ్ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు 'పెద్ది' చిత్రంలో కూడా తండ్రి-కొడుకుల మధ్య ఉండే ఒక బలమైన సెంటిమెంట్ను, క్రీడల నేపథ్యంలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర మట్టి వాసన ఉట్టిపడేలా సాగే ఈ కథలో, ఒక పాత్ర ఊర మాస్ గెటప్లో ఉంటుందని.. చరణ్ బాడీ లాంగ్వేజ్, మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడనే వార్త బయటకు రాగానే మెగా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే చరణ్ నుండి మాస్ జాతర గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ ఒక పవర్ఫుల్ రోల్లో మెరవనున్నాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mar 29, 2026
Peddi: ధురంధర్ మేకర్స్ చేతుల్లోకి పెద్ది.. పుష్ప రికార్డులు అవుట్!
రామ్ చరణ్ 'పెద్ది'కి బాలీవుడ్ జాక్పాట్ 'పెద్ది' హిందీ వెర్షన్ డీల్ క్లోజ్! రికార్డు ధరకు దక్కించుకున్న జియో స్టూడియోస్ పహిల్వాన్గా రామ్ చరణ్ విశ్వరూపం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'పెద్ది' చిత్ర గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. "పెద్ది పహిల్వాన్" పేరుతో వచ్చిన ఈ వీడియోలో చరణ్ రగ్డ్ లుక్, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ క్రేజ్ను గమనించిన బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల 'ధురంధర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన జియో స్టూడియోస్ రంగంలోకి దిగడంతో 'పెద్ది' సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాలీవుడ్ మార్కెట్లో 'పెద్ది' హవా! 'RRR' సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్కు నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జియో స్టూడియోస్ ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకుంది. దీనివల్ల నార్త్ ఇండియాలో ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దొరకడమే కాకుండా, ప్రమోషన్లు కూడా అత్యున్నత స్థాయిలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గ్లింప్స్ చూసిన హిందీ ఆడియన్స్, చరణ్ మాస్ లుక్కు ఫిదా అవుతున్నారు. ఇది బాక్సాఫీస్ వద్ద మరో 'పుష్ప' రేంజ్ మ్యాజిక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బుచ్చిబాబు మార్క్ మాస్ ఎంటర్టైనర్! 'ఉప్పెన' సినిమాతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా, ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో సాగే ఈ కథలో రామ్ చరణ్ ఒక పల్లెటూరి పహిల్వాన్గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు కూడా చెప్పబోతున్నాడు. స్పోర్ట్స్, ఎమోషన్ కలగలిసిన ఈ సినిమా చరణ్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అగ్ర నటీనటుల కలయిక! ఈ భారీ ప్రాజెక్టులో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే కన్నడ సెన్సేషన్ శివ రాజ్కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 30, 2026న 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. సరిగ్గా మే డే కి ముందు వస్తున్న ఈ చిత్రం సమ్మర్ బాక్సాఫీస్ వద్ద మెగా విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ పహిల్వాన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
Mar 29, 2026Peddi: పెద్దిలో లగాన్, దంగల్ రేంజ్లో ఆడియన్స్ని థ్రిల్ చేసే ఎలిమెంట్.. అదే ట్విస్ట్!
- బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ - 'పెద్ది'లో రామ్ చరణ్ కుస్తీ పోరాటం.. - మెగా పవర్స్టార్ నట విశ్వరూపం - స్పోర్ట్స్ డ్రామాలో కొత్త ట్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు ఈ సినిమా కేవలం క్రికెట్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా అని అందరూ భావించారు. కానీ, మేకర్స్ తాజాగా వదిలిన అప్డేట్ చూస్తుంటే దర్శకుడు బుచ్చిబాబు ఒక రేంజ్ లో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో క్రికెట్తో పాటు ‘కుస్తీ’ (Wrestling) ఎలిమెంట్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. కేవలం ఆట మాత్రమే కాదు, ఆ ఆట వెనుక ఉన్న భావోద్వేగాలను కూడా అద్భుతంగా ఆవిష్కరించ బోతున్నారు. తాజాగా విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ అనే చిన్న వీడియో గ్లింప్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. "కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట" అంటూ వినిపిస్తున్న డైలాగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అంటే, కథానాయకుడు క్రికెట్లో సత్తా చాటినప్పటికీ, పరిస్థితుల దృష్ట్యా కుస్తీ బరిలోకి దిగాల్సి వస్తుందనే పాయింట్ను ఈ వీడియో హింట్ చేస్తోంది. ఒకే సినిమాలో రెండు విభిన్నమైన క్రీడలను జోడించి, కమర్షియల్ ఎలిమెంట్స్తో బుచ్చిబాబు ఒక వండర్ క్రియేట్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది. గతంలో క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘లగాన్’, కుస్తీ నేపథ్యంలో వచ్చిన ‘దంగల్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రెండింటి కలయికతో ‘పెద్ది’ రాబోతుండటంతో, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్ చరణ్ తన కెరీర్లో ఇంతవరకు ఇలాంటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాలో నటించలేదు. అందుకే చరణ్ మేకోవర్, ఫిజిక్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండటం మరో విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ మరియు పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ బ్యాటింగ్ స్టైల్ చూసి మురిసిపోయిన అభిమానులు, ఇప్పుడు ‘పహిల్వాన్’ గెటప్లో ఆయన్ని చూడటానికి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న ఈ మూవీ రామ్ చరణ్ ఇమేజ్ను మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. టెక్నికల్ పరంగా కూడా టాప్ క్లాస్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ముఖ్యంగా ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. మరికొద్ది రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయనే వార్త మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది.
Mar 28, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



