మనోజ్ 'అహం బ్రహ్మాస్మి'లో అల్లరి నరేష్!!
on Aug 3, 2021
మంచు మనోజ్ కొంత విరామం తర్వాత చేస్తున్న సినిమా 'అహం బ్రహ్మాస్మి'. ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించిన మనోజ్.. 'అహం బ్రహ్మస్మి'తో నిర్మాతగానూ మారుతున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అల్లరి నరేష్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
'అహం బ్రహ్మాస్మి' మెగా మేనల్లుడు సాయి తేజ్ అతిథి పాత్రలో నటిస్తారని ఇంతకుముందు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ అతిథి పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర నిడివి స్వల్పమే అయినా.. కథను మలుపు తిప్పే పాత్ర అని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగు రీసెంట్ గా మొదలైంది. త్వరలోనే ఈ షూటింగులో నరేష్ జాయిన్ కానున్నాడని సమాచారం.
మరో వైపు ఈవీవీ బ్యానర్ పై ఓ కామెడీ వెబ్ సిరీస్ చేయడానికి అల్లరి నరేష్, ఆయన సోదరుడు ఆర్యన్ రాజేష్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నాంది సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన నరేష్.. ఇక నుండి వరుస సినిమాలు, సిరీస్ లతో అలరించానున్నారట.