పూర్ణ హీరోయిన్గా రవిబాబు వరుసగా మూడు సినిమాలు ఎందుకు చేశాడు?
on Nov 7, 2021
నటుడు రవిబాబు 'అల్లరి'తో డైరెక్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కొన్ని కామెడీ సినిమాలు, కొన్ని థ్రిల్లర్స్ డైరెక్ట్ చేశారు. పూర్ణ హీరోయిన్గా ఆయన వరుసగా మూడు సినిమాలు.. 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' డైరెక్ట్ చేశారు. దీంతో రవిబాబు, పూర్ణ మధ్య ఏదో నడుస్తుందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే తాను పనిచేసిన ఏ నటితోనూ ఏ ఒక్కరోజు కూడా షూటింగ్ ప్యాకప్ చెప్పాక కాల్ చేసి మాట్లాడ్డం అనేది జరగలేదని ఒకసారి రవిబాబు తేల్చి చెప్పారు. పూర్ణతోటే కాదు, భూమికతోనూ ఆయన మూడు సినిమాలు.. 'అనసూయ', 'అమరావతి', 'లడ్డుబాబు'.. తీశారు.
ఆ విషయమే ప్రస్తావిస్తూ, "నేను భూమికతో మూడు సినిమాలు చేశాను. తర్వాత పూర్ణతో మూడు సినిమాలు చేశాను. నేనో రూల్ పెట్టుకున్నా. షూటింగ్కు పేకప్ చెప్పాక ఏ రోజూ నేను నా సినిమాలో చేసిన ఏ హీరోయిన్కూ కాల్ చెయ్యలేదు. అంతే కాదు, ఆ టైమ్లో హీరో హీరోయిన్ల నుంచి కానీ, నా అసిస్టెంట్ దగ్గర నుంచి కానీ ఫోన్లు వస్తే రిసీవ్ చేసుకోను. ఈ రూల్ను నేను మొదట్నుంచీ పాటిస్తూ వస్తున్నా. నా లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. నేనలాంటి వాడ్నయితే, ఆ హీరోయిన్లు నాతో రెండో సినిమా చెయ్యరు కదా" అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రవిబాబు.
తను ప్రొఫెషనల్ ఎథిక్స్, రిలేషన్స్ పాటిస్తూ వస్తున్నవాడ్ని కాబట్టి హీరోయిన్లు తనపై ఆసక్తి చూపరని ఆయన అన్నారు. "నేను టాలెంట్ను చూస్తానే కానీ, గ్లామర్ను చూడను. పూర్ణతో నేను మూడు సినిమాలు చేశానంటే, కేవలం ఆమె అభినయాన్ని దృష్టిలో పెట్టుకొనే" అని స్పష్టం చేశారు రవిబాబు.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే డాన్స్ షో ఢీకి జడ్జిగా వ్యవహరిస్తూ, ఆడియెన్స్ను అలరిస్తూ వస్తున్నారు పూర్ణ.
Also Read