యశ్ను క్షమించమని కోరిన ఆమిర్.. రీజన్ ఏంటో తెలుసా?
on Nov 24, 2021
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'లాల్సింగ్ చడ్ఢా' 2022 ఏప్రిల్ 14న విడుదల కానున్నది. టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ క్లాసిక్, ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ 'ఫారెస్ట్ గంప్'కు ఇది అఫిషియల్ రీమేక్. కొవిడ్ మహమ్మారితో పాటు ఇతర కారణాల వల్ల లాల్సింగ్ చడ్ఢా విడుదలతో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీని వల్ల యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'కేజీఎఫ్: చాప్టర్ 2'తో అనివార్యంగా పోటీ ఎదురవుతోంది.
విజువల్ ఎఫెక్ట్స్ వల్ల రిలీజ్ విషయంలో జాప్యం జరిగిందని ఆమిర్ చెప్పాడు. "విజువల్ ఎఫెక్ట్స్ను హడావుడిగా చేయడం నాకిష్టం లేదు. క్వాలిటీతో ఆ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే మూవీ రిలీజ్ను ఏప్రిల్కు పోస్ట్పోన్ చేశాం" అని ఆయన తెలిపాడు.
'కేజీఎఫ్ 2'తో క్లాష్ అవుతున్న విషయంపై స్పందిస్తూ, "మరొకరి ప్లేస్లోకి నేను ఎంటర్ అవుతున్నాననే అభిప్రాయం కలిగించడాన్ని నేను ద్వేషిస్తాను. కానీ నేను తొలిసారి సిక్కుగా నటిస్తున్నందువల్ల బైశాఖి రోజు (ఏప్రిల్ 14) 'లాల్ సింగ్ చడ్ఢా'ను రిలీజ్ చేయడం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆ తేదీని ఎంచుకున్నాం. రిలీజ్ డేట్ను ఫైనలైజ్ చేసేముందు 'కేజీఎఫ్ 2' ప్రొడ్యూసర్ (విజయ్ కిరంగదూర్), డైరెక్టర్ (ప్రశాంత్ నీల్), హీరో (యష్)లకు అపాలజీస్ చెప్పాను. నా పరిస్థితి ఏమిటో వివరిస్తూ వారికి రాశాను. లాక్డౌన్ వల్ల నిర్మాతలందరికీ ఎలాంటి కష్టాలు వచ్చాయో వారికి చెప్పాను. నా సినిమాకు బైశాఖి విడుదల కరెక్టుగా ఉంటుందని కూడా వివరించాను. వారు నా దృష్టికోణాన్ని అర్థం చేసుకున్నారు. అదేరోజు తమ సినిమా విడుదల ఉన్నప్పటికీ నన్ను ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పారు. వారి మంచితనం నా గుండెలకు హత్తుకుపోయింది. నిజానికి, నా ప్లాన్కు సపోర్ట్ చేసిన యష్తో మనసారా చాలా సేపు మాట్లాడాను" అని చెప్పుకొచ్చాడు ఆమిర్.
అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన 'లాల్సింగ్ చడ్ఢా'లో కరీనా కపూర్ హీరోయిన్గా నటించగా, నాగచౌతన్య, మోనా సింగ్ కీలక పాత్రలు చేశారు.
Also Read