Read more!

English | Telugu

నా రూటే సెపరేటు అంటున్న శ్రావణ భార్గవి!

శ్రావణ భార్గవి పేరు అందరికీ పరిచయమే. బాలకృష్ణ నటించిన 'సింహా' మూవీలో "సింహమంటి చిన్నోడే" సాంగ్ పాడి తన కెరీర్ ని స్టార్ట్ చేసింది భార్గవి. తర్వాత మహేష్ బాబు 'ఖలేజా', అల్లు అర్జున్ 'బద్రీనాథ్', రామ్ 'కందిరీగ' నాగార్జున 'రాజన్న', జూనియర్ ఎన్టీఆర్ 'దమ్ము', శేఖ‌ర్ క‌మ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', నాని 'ఎంసీఏ', ప్ర‌భాస్‌ 'రెబల్' మూవీస్ లో హిట్ సాంగ్స్ పాడి తనని తానూ ప్రూవ్ చేసేసుకుంది. 2018 లో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ఓ పాట పాడింది శ్రావణ భార్గవి. ఇక  ఆ తర్వాత ఆమె మూవీస్ లో సాంగ్స్ ఏమీ పాడలేదు. డబ్బింగ్ విషయానికి వస్తే  ‘గబ్బర్ సింగ్’ లో శ్రుతి హాసన్ కు, ‘ఈగ’ లో సమంతకి వాయిస్ ఇచ్చింది.  ఇక ఇటీవలి కాలంలో  శ్రావణ భార్గవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. 

తన భర్తతో విడాకులు విషయం అంటూ కొద్ది రోజులు, తర్వాత అన్నమ్మయ్య రచించిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను శృంగారభరితంగా మార్చి వీడియో చేసిందంటూ అపవాదులు ఆమె చుట్టూ తిరిగాయి. అన్నమయ్య కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి ఆమెని  తిరుపతిలో అడుగుపెట్టనివ్వం అంటూ హెచ్చరించారు కూడా. ఈ విషయం మీద శ్రావణభార్గవి కూడా తన వెర్షన్ లో జవాబు ఇచ్చేసింది.  

ఈ వార్తలతో ఇటీవలి కాలంలో శ్రావణ భార్గవి క్రేజ్ చాలా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక మూవీ సాంగ్ తో దుమ్ము రేపడానికి నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చింది శ్రావణ భార్గవి. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీలో ‘ఆఫత్’ అనే అద్భుతమైన సాంగ్ పాడి అందరినీ కట్టిపడేసింది తన గాత్రంతో. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.