Read more!

English | Telugu

ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న సామెతను నిజం చేసావ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2  విన్నర్ కౌశల్ మంద గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. నటుడుగా తెలుగు అభిమానులకు కౌశల్ సుపరిచితమే. అలా బిగ్‌బాస్ సెకండ్  సీజన్ విన్నర్ అయ్యేసరికి కౌశల్ ఫాలోయింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కౌశల్ ఆర్మీ పేరుతో సైన్యం కూడా తయారయ్యింది. కొంతమంది ఫ్యాన్స్ ఒక గ్రూప్‌గా ఉండి అతనికి క్రేజ్ తీసుకొచ్చారు అంటే ఆయన సత్తా ఏమిటో అర్ధమయ్యింది. అలాంటి కౌశల్ తన కో బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.

" నా ప్రియమైన  బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్..వరల్డ్ వైడ్ గా ఫేమస్ ఐన స్టార్స్ తో కలిసి ఆస్కార్ అవార్డ్స్ వేదిక మీద మెరవడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. బిగ్ బాస్ టైటిల్ గెలిచేసాక ఇంకా వాళ్ళు ఏమీ చేయరులే అనుకునే వారికి మీ విజయం ఒక గుణపాఠం. వాళ్ళు అక్కడితో ఆగిపోరు అనుకున్నది చేసి చూపిస్తారు అని నిరూపించారు. తెలుగులో ఒక సామెత ఉంది " కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని" దాన్ని ఈరోజు మీరు నిజం చేసి చూపించారు. నీకు ఇంత మంచి గుర్తింపు రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నీ సొంతం కావాళ్ళని ఇలాగే మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని కోరుకుంటున్నా" అని తన మనసులో ఉన్న ఫీలింగ్ రాసుకున్నాడు.

కౌశల్ బిగ్ బాస్ తర్వాత బీబీ జోడీలో అభినయశ్రీతో కలిసిడాన్స్ పెర్ఫార్మెన్సులు చేసాడు. ఇక   రాహుల్ సిప్లిగూంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్. అలాంటి రాహుల్ ఈరోజున సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’ పాడి ఆస్కార్ కోసం హిస్టరీ క్రియేట్ చేయడంలో ఒక భాగమయ్యాడు. ఇలా ఇప్పుడు రాహుల్ ఒక సెలబ్రిటీ ఐపోయాడు. గల్లీ స్థాయి నుంచి ఆస్కార్ వేదిక వరకు వెళ్లడం అంటే అంతా ఈజీ కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంది. ఇప్పుడు రాహుల్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చిందని అతని పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అతని ఫ్రెండ్స్ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.