Read more!

English | Telugu

తల్లి కాబోతున్న బుల్లితెర పాపుల‌ర్ నటి!

 

బుల్లితెర నటి చైత్ర రాయ్ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పలు సీరియల్స్‌లో హీరోయిన్ గా నటించి తెలుగువారికి దగ్గరైంది చైత్ర. 'అష్టా చమ్మా' సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీలో సైతం ఆఫర్లు దక్కించుకుంది. అయితే సడెన్‌గా ఆమె తెలుగు సీరియల్స్‌లో నటించడం మానేసి, ఇండ‌స్ట్రీలోని అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఒకప్పుడు 'ఒకరికి ఒకరు', 'మనసున మనసై', 'దటీజ్ మహాలక్ష్మీ' ఇలా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేది చైత్ర. 

'అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు' సీరియల్‌లో నటిస్తోన్న సమయంలో ఆమె వ్యక్తిగత కారణాల వలన బయటకి వచ్చేసింది. కొంత గ్యాప్ తీసుకుంటున్నానని ప్రకటించింది. అలా చాలా కాలంగా సీరియళ్ల‌కు దూరంగా ఉంటోన్న చైత్ర ఇప్పుడొక గుడ్ న్యూస్ చెప్పింది. తన జీవితంలో కొత్త దశ ప్రారంభం కానుందని చెబుతూ ఎమోషనల్ అయింది. 

తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెబుతూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ''త్వరలోనే బేబీ చైత్ర ప్రసన్న రాబోతుంది.. నా భర్త ప్రసన్నతో కలిసి ఈ విషయాన్ని షేర్ చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.. మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి. మా జీవితాల్లో కొత్త చాప్ట‌ర్‌కు ప్రిపేర్ అవుతున్నాం. నా లైఫ్‌లో అత్యంత అంద‌మైన ద‌శ‌ను అనుభ‌విస్తున్నా'' అంటూ రాసుకొచ్చింది. చైత్ర రాయ్ షేర్ చేసిన బేబీ బంప్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.