English | Telugu

Jayam serial : బాక్సింగ్ లో రుద్రని చంపడానికి వీరు ప్లాన్.. మార్టిన్ గెలుస్తాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -95 లో......రుద్రతో పోటీ పడడానికి పారు మలేషియా నుండి ఒక ఛాంపియన్ ని రప్పిస్తుంది. అతను రాగానే రుద్ర తో పోటీ అని తెలుస్తుంది. తనతో పోటీ అంటే కచ్చితంగా ఓడిపోతాను.. నేను పోటీ పడను అని మాలేషియా నుండి వచ్చిన మార్టిన్ అంటాడు. నువ్వు గెలిస్తే పాతిక లక్షలు ఇస్తాను.. నీకు ఏదైనా అయితే నీ ఫ్యామిలీకి కోటి ఇస్తానని పారు అనగానే మార్టిన్ ఒప్పుకుంటాడు.

రుద్ర ప్రాక్టీస్ చేస్తుంటే మార్టిన్ భయపడుతాడు. అప్పుడే వీరు తన దగ్గరికి వస్తాడు. ఏంటి రుద్రని చూసి బయపడుతున్నావా అని మార్టిన్ ని అడుగుతాడు. నువ్వు రుద్రని బాక్సింగ్ లో చంపెయ్.. నీకు రెండు కోట్లు ఇస్తానని చెప్తాడు. దాంతో మార్టిన్ సరే అంటాడు. పోటీకి మార్టిన్ ఇంకా రుద్ర సిద్ధం అవుతారు. అప్పుడే పారు ఎంట్రీ ఇచ్చి.. ఈ పోటీలో ఓడిపోతే ఇక ఎప్పుడు బాక్సింగ్ ఆడనని ఆ అగ్రిమెంట్ పై సంతకం చెయ్యమని పారు మెలిక పెడుతుంది. దాంతో అందరు సంతకం పెట్టకని రుద్రకి చెప్తారు. రుద్ర సర్ మీరు సంతకం చెయ్యండి అని గంగ చెప్తుంది. రుద్ర సంతకం చేస్తాడు. పోటీ మొదలవుతుంది.

మొదటి రౌండ్ కి మార్టిన్ ని రుద్ర చిత్తు చేస్తాడు. దాంతో వీరు, పారు డిస్సపాయింట్ అవుతారు. పారు బయటకు వెళ్తుంటే తన వెనకాలే వీరు వెళ్లి ఆ మార్టిన్ కి.. మీ తమ్ముడు బానుని చంపింది ఎవరో నాకు తెలుసని రుద్రకు చెప్పు.. ఓడిపోతే చెప్తానని అబద్ధం చెప్పించండి అని పారుకి వీరు సలహా ఇస్తాడు. దాంతో మార్టిన్ దగ్గరికి పారు వెళ్లి.. రుద్రని ఇలా బ్లాక్ మెయిల్ చెయ్ అని చెప్తుంది. ఆ తర్వాత రుద్ర, మార్టిన్ రెండో రౌండ్ లో పోటీ పడుతుంటే మీ తమ్ముడిని చంపింది ఎవరో నాకు తెలుసు.. నువ్వు ఓడిపోతే చెప్తానని రుద్రని మార్టిన్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో మార్టిన్ కొట్టిన కూడా రుద్ర సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.