English | Telugu

త్రిషను వదిలేసి కొత్తది మొదలెట్టిన రాజు

త్రిష ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ, నిర్మిస్తున్న చిత్రం "రమ్". ఈ సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్న త్రిషకు నిరాశే మిగిలింది. ఈ చిత్ర షూటింగ్ గతకొంత కాలంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తిగా పక్కకిపెట్టినట్లు తెలిసింది. రాజు ప్రస్తుతం కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. "జపం" అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా విజయ్ కార్తీక్ అనే కొత్తబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి రాజు తన "రమ్" సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.