English | Telugu

అన్నదమ్ముల మధ్య యుద్ధం.. గెలుపెవరిది..?

సౌత్ లో అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు లోకేష్ కనగరాజ్. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఆడియన్స్ లో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. అందునా 'ఖైదీ'లో కార్తి పోషించిన ఢిల్లీ పాత్రకి, 'విక్రమ్' క్లైమాక్స్ లో సూర్య సందడి చేసిన రోలెక్స్ పాత్రకి విపరీతమైన అభిమానులున్నారు. అలాంటిది ఈ ఇద్దరు తలబడితే ఎలా ఉంటుంది?. త్వరలోనే అది సాధ్యం కాబోతుంది.

లోకేష్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'కూలీ' ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం. దీని తర్వాత 'ఖైదీ-2' చేయనున్నాడు లోకేష్. ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ అన్నట్టుగా ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది.

నిజ జీవితంలో సూర్య, కార్తి అన్నదమ్ములు అనే విషయం తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరు స్క్రీన్ పై ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపెడితే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఇప్పటికే రోలెక్స్ గా సూర్య, ఢిల్లీగా కార్తి ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మరి ఇద్దరి పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.