English | Telugu

Keedaa Cola Day 1 Collections: కీడా కోలా వరల్డ్ వైడ్  ఫస్ట్ డే కలెక్షన్స్

క్యాలండర్ లో ప్రత్యేకంగా ముద్రించకపోయినా కూడా సినిమా ప్రేమికులకి ప్రతి శుక్రవారం ఒక పండగ రోజే. ఈ శుక్రవారం కూడా కీడా కోలా అనే మూవీ రూపంలో సినీ ప్రేమికులకి పండగ వచ్చింది .దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ ల దగ్గర సందడి వాతావరణం నెలకొని ఉంది.మరి కీడా కోలా మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తన తొలి చిత్రం పెళ్లి చూపులతో ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కీడా కోలా మూవీ నిన్న వరల్డ్ వ్యాప్తంగా విడుదల అయ్యి 5.65
కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించడంతో పాటు నైజాం లో 90 లక్షలు,ఆంధ్రలో 50 లక్షలు, కర్ణాటక ,రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ ల్లో 1 .45 కోట్లు ఇలా మొత్తం 2 .85 కోట్లు షేర్ ని సాధించింది.
కీడా కోలా మూవీ అశేష ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకుపోతుంది. నాయుడుగా నటించిన తరుణ్ భాస్కర్ ,అతని తమ్ముడుగా నటించిన జీవన్ కుమార్, బ్రహ్మానందం, చైతన్య రావు తదితరుల చక్కని నటనతో పాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వ ప్రతిభ కూడా కూడా కీడా కోలా మూవీ ఘన విజయం సాధించడానికి కారణమయ్యింది .

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.