English | Telugu

రాజమండ్రిలో రాజబాబు విగ్రహం

అలనాటి మేటి హాస్యనటుడు, మనసున్న మనిషి రాజబాబు చనిపోయి ఏప్రెల్ 9 వ తేదీకి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాజబాబు జన్మించిన రాజమండ్రి నగరంలో, రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించాలని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు మురళీ మోహన్ తీర్మానించారు. అందుకు అవసరమైన ధనాన్ని కూడా మురళీ మోహన్ తానే స్వయంగా సమకూరుస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు 75 మంది సినీహాస్య నటీనటులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న రాజబాబు కుమారులు భారతదేశానికి రానున్నారు. రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించటం చాలా ముదావహమని సినీ పరిశ్రమ "మా" అసోసియేషన్ ని ప్రశంసిస్తోంది.

ఈ కార్యక్రమం జరగటం తమకు చాలా ఆనందంగా ఉందని రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్, బాబి తమ ఆనందాన్ని తెలియజేశారు. ఏప్రెల్ 9 వ తేదీన, ఆలస్యంగానైనా రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహప్రతిష్ట జరపటం సినీపరిశ్రమ ఆయనకు ఇచ్చే ఘననివాళిగా భావించవచ్చు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.