English | Telugu

రాజమండ్రిలో రాజబాబు విగ్రహం

అలనాటి మేటి హాస్యనటుడు, మనసున్న మనిషి రాజబాబు చనిపోయి ఏప్రెల్ 9 వ తేదీకి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాజబాబు జన్మించిన రాజమండ్రి నగరంలో, రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించాలని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు మురళీ మోహన్ తీర్మానించారు. అందుకు అవసరమైన ధనాన్ని కూడా మురళీ మోహన్ తానే స్వయంగా సమకూరుస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు 75 మంది సినీహాస్య నటీనటులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న రాజబాబు కుమారులు భారతదేశానికి రానున్నారు. రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించటం చాలా ముదావహమని సినీ పరిశ్రమ "మా" అసోసియేషన్ ని ప్రశంసిస్తోంది.

ఈ కార్యక్రమం జరగటం తమకు చాలా ఆనందంగా ఉందని రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్, బాబి తమ ఆనందాన్ని తెలియజేశారు. ఏప్రెల్ 9 వ తేదీన, ఆలస్యంగానైనా రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహప్రతిష్ట జరపటం సినీపరిశ్రమ ఆయనకు ఇచ్చే ఘననివాళిగా భావించవచ్చు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.