English | Telugu

రాజమండ్రిలో రాజబాబు విగ్రహం

అలనాటి మేటి హాస్యనటుడు, మనసున్న మనిషి రాజబాబు చనిపోయి ఏప్రెల్ 9 వ తేదీకి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాజబాబు జన్మించిన రాజమండ్రి నగరంలో, రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించాలని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు మురళీ మోహన్ తీర్మానించారు. అందుకు అవసరమైన ధనాన్ని కూడా మురళీ మోహన్ తానే స్వయంగా సమకూరుస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు 75 మంది సినీహాస్య నటీనటులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న రాజబాబు కుమారులు భారతదేశానికి రానున్నారు. రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించటం చాలా ముదావహమని సినీ పరిశ్రమ "మా" అసోసియేషన్ ని ప్రశంసిస్తోంది.

ఈ కార్యక్రమం జరగటం తమకు చాలా ఆనందంగా ఉందని రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్, బాబి తమ ఆనందాన్ని తెలియజేశారు. ఏప్రెల్ 9 వ తేదీన, ఆలస్యంగానైనా రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహప్రతిష్ట జరపటం సినీపరిశ్రమ ఆయనకు ఇచ్చే ఘననివాళిగా భావించవచ్చు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.