English | Telugu

బాలయ్యతో మిరపకాయ్ లేడి

ఇటీవలకాలంలో పెద్ద హీరోలు నటించే చిత్రంలో మినిమం ఇద్దరు ముగురు హీరోయిన్లుండడం సర్వసాధారణమైపోయింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్స్ ఇంకా ఖరారు కాలేదు. మరో రెండు వారాల్లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో "హీరోయిన్స్" అంటూ పలువురి పేర్లు తెరమీదకొస్తున్నాయి. వాటిలో ఇప్పుడు దీక్షాసేథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మెయిన్ హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసే అవకాశముందనే ఊహాగానాలు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అసలే మొదటి హీరోయిన్ ఇంకా కాకుండానే, రెండవ హీరోయిన్, మూడవ హీరోయిన్ అంటూ బాలయ్య సినిమాకు హీరోయిన్స్ ను వెతుకుతున్నారు.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చి ఘన విజయం సాధించిన "సింహా"లో నటించిన నయనతార. ఆ తర్వాత బాపు దర్శకత్వం "శ్రీరామరాజ్యం"లోనూ సీతగా నటించి మన్ననలు పొందింది. ముచ్చటగా మూడోసారి మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ నయనతార నో చెప్తే మొదటి హీరోయిన్ గా టబు లేదా సమీరా రెడ్డి ల పేరు వినిపిస్తున్నాయి. మరి వీరందరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ హీరోయిన్స్ ఎవరన్నది త్వరలోనే తెలియనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.