
Peddi: 'పెద్ది' స్పెషల్ సాంగ్.. మృణాల్ ఠాకూర్ అవుట్.. మిస్ ఇండియా ఇన్!
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టులలో ఒకటి 'పెద్ది'(Peddi). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. చివరి నిమిషంలో తప్పుకున్న మృణాల్? ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ముందుగా క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. 'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్, ఈ స్పెషల్ సాంగ్లో నటిస్తే సినిమాకు అదనపు ఆకర్షణ వస్తుందని మేకర్స్ భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం కాల్ షీట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల మృణాల్ ఈ ప్రాజెక్ట్ నుండి చివరి నిమిషంలో తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎంట్రీ ఇస్తున్న మిస్ ఇండియా! 'పెద్ది' స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ప్లేస్లో మిస్ ఇండియా 2020 విజేత మానస వారణాసి(Manasa Varanasi) పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ అందాల భామ, గ్లోబల్ వేదికలపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా కూడా 'దేవకీ నందన వాసుదేవ', 'కపుల్ ఫ్రెండ్లీ' వంటి సినిమాల్లో నటించింది. మానస వారణాసి అయితే ఈ సాంగ్కు కొత్తదనం వస్తుందని, పైగా మెగా పవర్స్టార్ పక్కన ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మానస వారణాసి ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ మాస్ డ్యాన్స్కు తోడు మిస్ ఇండియా గ్లామర్ తోడైతే థియేటర్లలో రచ్చ ఖాయమని చెప్పవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే, మానస వారణాసికి టాలీవుడ్లో ఇది టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశముంది. ‘పెద్ది’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తవగా, ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని, ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటుందని అంటున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Apr 08, 2026
Janhvi Kapoor: బుర్రని వాడాలి కదా!.. సంబంధం లేని వ్యక్తులు తగిలారు
-జాన్వీ కపూర్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ -సంబంధం లేని వ్యక్తులు ఎవరు -అమ్మ బతికి ఉన్నపుడు జాలి చూపించలేదు -అసలు ఆ విషయంలో బుర్రనే వాడలేదు అచ్చాయమ్మాగా పెద్ది(Peddi)తో కలిసి సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి శ్రీదేవి(Sridevi)తనయ జాన్వీ కపూర్(Janhvi Kapoor)సిద్దమవుతుంది. దేవరలో విలేజ్ గర్ల్ గా రెబల్ బాడీ లాంగ్వేజ్, హావభావాలతో ఎన్టీఆర్(NTR)ని ఊపిరి సలపని ఉక్కపోతకి గురి చేసిన జాన్వీ మళ్ళీ విలేజ్ గర్ల్ గానే పెద్దిని ఏం చెయ్యబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. అభిమానులైతే ఆ విషయంలో నో కాంప్రమైజ్ అని ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది కదా,అచ్చాయమ్మా కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందర్నీ జాన్వీ మాటలు షాక్ కి గురి చేస్తున్నాయి. నెటిజన్స్ ది అదే సిట్యువేషన్. మరి జాన్వీ మాటలని చూద్దాం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతు నేను తల్లిపై ఆధారపడిన కూతుర్ని. సొంత నిర్ణయాలు తీసుకునేందుకు నా మెదడులోని సామర్ధ్యాన్ని ఉపయోగించే దానిని కాదు. అందుకే ప్రతి విషయానికి అమ్మపైనే ఆధారపడ్డాను. అలాంటిది అమ్మ మరణంతో నా నిర్ణయాలు నేనే తీసుకోవాలనే పరిస్థితులని సృష్టించింది. దాంతో కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ముఖ్యంగా నా లైఫ్ లోకి సంబంధం లేని వ్యక్తులని రానిచ్చాను. ఇక నుంచి అలా చెయ్యను. అమ్మ విషయంలో ఇప్పుడు జాలి చూపిస్తున్నంత వాళ్లంతా ఆమె బతికి ఉన్నపుడు జాలి చూపించే వారు కాదు. తన వ్యక్తిగత జీవితం గురించి చాలా మాటలు అనేవారు. అవన్నీ అమ్మని ఎంతగానో బాధపెట్టేవి. ఆ రోజు నేను ఆ బాధని అర్ధం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఆ బాధని అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది. Also read: Ntr: ఎన్టీఆర్తో మాత్రమే నా బాధలని చెప్పుకుంటానంటున్న హీరోయిన్ జాన్వీ రీసెంట్ గా తన పిక్స్ ని అసభ్యకరమైన రీతిలో షూట్ చేసే ఫొటోగ్రాఫర్ల తీరుపై మండి పడుతు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పెద్ది తర్వాత ఇంకా ఏ చిత్రానికి జాన్వీ కమిట్ కాలేదు. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ 'రాకా' లో ఒకే అయ్యిందనే న్యూస్ చాలా రోజుల నుంచి స్వతంత్రంగానే చక్కర్లు కొడుతుంది.
Apr 08, 2026
Peddi: మళ్ళీ మారిన పెద్ది రిలీజ్ డేట్.. షాకిచ్చిన అయ్యగారు!
మెగా ఫ్యాన్స్ కి మరో షాక్! పెద్ది రిలీజ్ డేట్ మళ్ళీ మారిందా? లెనిన్ రిలీజ్ డేట్ తో మళ్ళీ మొదటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. అక్కడి నుంచి మళ్ళీ జూన్ 26కి వాయిదా పడినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది. అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదట ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఏప్రిల్ 30న 'పెద్ది' ఉండటంతో తమ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా 'పెద్ది' కొత్త విడుదల తేదీగా ప్రచారం జరుగుతున్న జూన్ 26పై 'లెనిన్' కర్చీఫ్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే జూన్ 26న లెనిన్ ని విడుదల చేయనున్నట్లు తెలిపిన మేకర్స్.. నేడు(ఏప్రిల్ 8) అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేశారు. అదే తేదీకి తమ సినిమాని తీసుకొస్తున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను వదిలారు. గతంలో 'పెద్ది' కోసమే తమ సినిమాని వాయిదా వేసినట్లు 'లెనిన్' టీమ్ ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు పెద్దికి పోటీగా విడుదల చేసే అవకాశంలేదు. జూన్ 26న పెద్ది రావట్లేదనే సమాచారంతోనే ఆ తేదీపై లెనిన్ టీమ్ కర్చీఫ్ వేసి ఉంటుంది. దీంతో 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ పై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది. అయితే 'పెద్ది' మూవీ జూన్ 26 కంటే ముందే వచ్చే అవకాశముందని తెలుస్తోంది. జూన్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. Also Read: ఇతను హీరో ఏంటి అన్నారు.. ఇప్పుడు పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాడు! https://x.com/SitharaEnts/status/2041720204477059264
Apr 08, 2026
Ram charan: అశ్వద్ధామగా రామ్ చరణ్.. ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ చర్చలు!
-పెద్దితో బిజీగా ఉన్న రామ్ చరణ్ -ధురంధర్ 2 డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడా! -అశ్వద్ధామ వెనక ఉన్న కథ ఏంటి రూమర్ పేరుపై కూడా గుళ్లో అర్చన చేసే రోజు వస్తుందని ఎవరైనా ఉహించి ఉంటారా!. మసీదు, చర్చిల్లో సైతం అదే గౌరవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ధురంధర్ 2 (Aditya Dhar) డైరెక్టర్ ఆదిత్య ధర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కాంబోలో మూవీ తెరకెక్కబోతుందనేదే రూమర్ .. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఆదిత్య ధర్ డ్రీం ప్రాజెక్ట్స్ లో 'ఇమ్మోర్టల్ అశ్వద్ధామ'(immortal ashwatthama)ఒకటి. నిజానికి ధురంధర్ 2 కంటే ముందే స్టార్ట్ అవ్వాల్సిన మూవీ. అంటే తన సెకండ్ మూవీగా రావాల్సింది. అగ్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి ముందుకొచ్చినా, కారణాలు తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ప్లేస్ లోకి ధురంధర్ వచ్చేసింది. ఇప్పుడు ఆదిత్య ధర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఇమ్మోర్టల్ అశ్వద్ధామని తెరకెక్కించాలని రామ్ చరణ్ టైటిల్ రోల్ లో చేయబోతున్నట్టుగా రూమర్. మరి వింటు ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా! మరి ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఆదిత్య ధర్ ఇమ్మోర్టల్ అశ్వద్ధామని ప్రకటించినప్పుడే రామ్ చరణ్ హీరో అనే పుకారు వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ని ఆకట్టుకున్నాడు. Also Read: ott: ఓటీటీలో 7 హై ఓల్టేజ్ రొమాంటిక్ చిత్రాలు.. ఒంటరిగా మాత్రమే చూడండి కానీ రెండో చిత్రానికే ఆదిత్య ధర్ తో బడ్జెట్ విషయంలో రిస్క్ చేయడం ఎందుకని నిర్మాతలు ఆలోచించారనే న్యూస్ వినపడింది. కానీ ఆ వార్తలో నిజం లేదు. ఎందుకంటే ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2 నిర్మించింది కూడా జియో స్టూడియోస్ నే. ఏది ఏమైనా ఫస్ట్ టైం ఒక రూమర్ అరుదైన గౌరవానికి అర్హత సాధించింది. ప్రెజెంట్ రామ్ చరణ్ అయితే పెద్దికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ ఇంకా కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.
Apr 07, 2026
Peddi: సమ్మర్ రేసు నుంచి తప్పుకున్న పెద్ది.. రిలీజ్ వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా?
మెగా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ 'పెద్ది' రిలీజ్ డేట్పై మళ్ళీ మొదలైన సస్పెన్స్! కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ 'పెద్ది'(Peddi). ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు మెగా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఏప్రిల్ నెలలో కూడా 'పెద్ది' రావడం కష్టమే అనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, 'పెద్ది' మూవీ ఏప్రిల్ రేసు నుంచి తప్పుకుని జూన్ నెలకు వెళ్లే ఆలోచనలో ఉందట. రీసెంట్గా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఇటీవల ఒక మూవీ ప్రమోషన్స్ సమయంలో చరణ్ మాట్లాడుతూ.. "టైంకి వస్తుందని చెప్పండ్రా" అని సరదాగా అన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జూన్ 26న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్కెఎన్ కూడా 'పెద్ది' జూన్ 26కి వాయిదా పడిందనే విషయాన్ని హింట్ ఇచ్చారు. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం, ప్రమోషన్స్ కి తగినంత సమయం లేకపోవడం వంటి కారణాలతో 'పెద్ది' విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాపై ఇంతటి హైప్ ఉండటానికి ప్రధాన కారణం ఇందులోని భారీ తారాగణం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రా రా' వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ను అలరిస్తున్నాయి. చరణ్ ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా ఒక రగ్గడ్ లుక్లో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'రంగస్థలం' తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇదని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
Apr 07, 2026ఫోటోగ్రాఫర్ల తీరుపై విరుచుకుపడ్డ జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న కామెంట్స్
- పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ బోల్డ్ రియాక్షన్ - ఫోటోల యాంగిల్స్ గురించి షాకింగ్ విషయాలు - అలాంటి ఫోటోలు తీసి మళ్ళీ కామెంట్స్ చేస్తారా? అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటో షూట్లతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ, తాజాగా పాపరాజీల (సినిమా ఫోటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత విషయాలు, తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే తనకు చాలా కోపం వస్తుందని ఆమె కుండబద్ధలు కొట్టింది. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ జిమ్ కి వెళ్ళినా, ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినా పాపరాజీలు వారిని వదలకుండా వెంటాడుతుంటారు. ఈ క్రమంలో జాన్వీ ధరించే దుస్తులపై తరచూ విమర్శలు వస్తుంటాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. పాపరాజీలు ఫోటోలు తీసే విధానాన్ని తప్పుబట్టింది. "నేను ఎంతో కష్టపడి ఫోటో షూట్స్ చేస్తాను, అక్కడ నా లుక్ బాగుంటుంది. కానీ పాపరాజీలు కొన్నిసార్లు అసౌకర్యంగా ఉండే యాంగిల్స్ నుండి ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు 'ఈమె హాట్గా లేదు, అందంగా లేదు' అని కామెంట్స్ చేయడం చూస్తే చాలా బాధగా, కోపంగా అనిపిస్తుంది" అని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా మహిళా నటీమణుల విషయంలో కెమెరా యాంగిల్స్ మార్చి, క్లిక్ బైట్ కోసం అసభ్యకరంగా కనిపించేలా ఫోటోలు తీయడం సరైన పద్ధతి కాదని జాన్వీ అభిప్రాయపడింది. "నేను ఏం ధరించాలి అనేది నా ఇష్టం. కానీ నేను కంఫర్ట్గా లేని సమయంలో వింత వింత యాంగిల్స్ నుండి ఫోటోలు తీసి, మళ్ళీ వాటిపై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు" అని ఆమె గట్టిగా స్పందించింది. గతంలో పాపరాజీలతో స్నేహపూర్వకంగా ఉండే జాన్వీ, ఇప్పుడు ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాది బాలీవుడ్లో ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతోందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె తన ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపై పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అప్డేట్స్ చూస్తుంటే, ఇందులో జాన్వీ ఒక పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, వారిని కేవలం ఆబ్జెక్టిఫై చేయకూడదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు ఇలాంటివి సాధారణమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, తనపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవడంలో జాన్వీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'పెద్ది' సినిమా షూటింగ్తో బిజీగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. టాలీవుడ్లో ఈ మూవీ కనుక హిట్ అయితే, జాన్వీ ఇక్కడ టాప్ హీరోయిన్ల సరసన చేరడం ఖాయం. హిందీలో కూడా కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తన సినిమాలతో పాటు ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్తో జాన్వీ ఎప్పుడూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది.
Apr 06, 2026
Peddi: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మూవీ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి గ్లింప్స్ వరకు ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా రీసెంట్గా విడుదలైన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె(Raghu Kunche) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, ఏఆర్ రెహమాన్ సంగీతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. 90s నాటి రెహమాన్ కనిపిస్తున్నారు.. పెద్ది నుంచి విడుదలైన చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం గురించి రఘు కుంచె మాట్లాడుతూ.. "ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట 'చికిరి చికిరి'. ప్రతి రోజూ వింటున్నాను. చాలా కాలం తర్వాత రెహమాన్ గారు మళ్ళీ తన వింటేజ్ స్టైల్ను చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆయన సాంగ్స్ చాలా సింపుల్ గా, మెలోడియస్ గా ఉండేవి. ఆ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాక కొంచెం కాంప్లికేటెడ్ మ్యూజిక్ వైపు వెళ్లారు. కానీ 'పెద్ది' చిత్రంతో మళ్ళీ తన మార్కు 90ల నాటి వింటేజ్ రెహమాన్ను గుర్తుచేస్తున్నారు. ఆ పాటల్లోని ఫ్లేవర్ చాలా ఫ్రెష్గా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రెహమాన్ నుంచి తనకు కావాల్సిన అవుట్పుట్ను అద్భుతంగా రాబట్టుకున్నారు" అని ప్రశంసించారు. మట్టి వాసన ఉన్న కథలు ఎప్పుడూ స్పెషలే.. ప్రస్తుతం ప్రేక్షకులు రూటెడ్ కథలకు, అంటే మట్టి వాసన ఉన్న విలేజ్ సబ్జెక్టులకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని రఘు కుంచె అభిప్రాయపడ్డారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే కథలు కేవలం పాత జ్ఞాపకాలనే కాకుండా, కొత్త తరానికి ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమిళంలో మారి సెల్వరాజ్, వెట్రిమారన్ వంటి దర్శకులు ఇలాంటి కథలతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇప్పుడు మన తెలుగులో కూడా అలాంటి ప్రయత్నాలు జరగడం శుభపరిణామమని అన్నారు. 'పెద్ది' కూడా అలాంటి ఒక పవర్ఫుల్ రూటెడ్ సబ్జెక్ట్ అని ఆయన పేర్కొన్నారు. పహిల్వాన్ లుక్ అదిరిపోయింది.. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. గ్లింప్స్లో చరణ్ ధరించిన గోచి కట్టు, ఆయన మాసివ్ బాడీ లాంగ్వేజ్ను చూసి అంతా షాక్ అవుతున్నారు. దీనిపై రఘు కుంచె స్పందిస్తూ.. "అది నిజమైన పహిల్వాన్ లుక్. చరణ్ పడ్డ కష్టం ఆ స్క్రీన్పై కనిపిస్తోంది. నిజానికి ఆ కుస్తీ ఫైట్లు చేస్తున్నప్పుడు ఆయనకు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయని విన్నాను. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా అంత రిస్క్ తీసుకుని రియలిస్టిక్గా చేయడం గొప్ప విషయం." అని చరణ్ డెడికేషన్ను కొనియాడారు. నటనలో కష్టం.. సౌకర్యాల మధ్యే అసలైన సవాల్.. పూర్వం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో ఆర్క్ లైట్ల కింద నటించడం ఎంతో కష్టంగా ఉండేదని, ఇప్పటి హీరోలకు క్యారవాన్లు వంటి సౌకర్యాలు ఉన్నా.. క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయడంలో అదే కష్టం ఉంటుందని రఘు కుంచె వివరించారు. రామ్ చరణ్ తన ఇమేజ్ను పక్కన పెట్టి ఒక పల్లెటూరి మల్లయోధుడిగా మారడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు. మొత్తానికి 'పెద్ది' చిత్రం రామ్ చరణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, బుచ్చిబాబు సానా మేకింగ్ మరియు రెహమాన్ సంగీతం సినిమాను మరో లెవల్కు తీసుకెళ్తాయని రఘు కుంచె నమ్మకం వ్యక్తం చేశారు. మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రఘు కుంచె ఫుల్ ఇంటర్వ్యూ & మరిన్ని ఆసక్తికర సినీ విశేషాల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
Apr 01, 2026
Tollywood Trending Today: మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. చరణ్ ఫ్యాన్స్ కి షాక్!
1. పెద్ది రిలీజ్ డేట్పై గందరగోళం: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రావడం కష్టమే అంటున్నారు. రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ లో నిర్మాత SKN కూడా.. 'పెద్ది' జూన్ 26న విడుదలవుతుందంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. అదంతా తూచ్ అంటూ SKN మళ్ళీ వీడియో రిలీజ్ చేసినప్పటికీ.. పెద్ది పోస్ట్ పోన్ న్యూస్ కి మాత్రం బ్రేకులు పడట్లేదు. 2. అల్లు అర్జున్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్: ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'AA22' నుంచి ఒక పవర్-ప్యాక్డ్ వీడియో గ్లింప్స్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మూవీ టీమ్ కేవలం టైటిల్ పోస్టర్తోనే సరిపెట్టే అవకాశం ఉందట. వీడియో కంటెంట్ కోసం ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. అయితే బన్నీ బర్త్ డేకి రిలీజ్ చేయబోయే పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం. 3. అక్టోబర్ నుంచి దేవర-2: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ‘దేవర-2’ కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవగా, ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతోందట. తారక్ డేట్స్ కన్ఫర్మ్ కావడంతో అక్టోబర్ మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. 4. ‘వారణాసి’ షూటింగ్ అప్డేట్: మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మహేష్ తన భాగాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. షూటింగ్తో పాటు టెక్నికల్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. కీరవాణి త్వరలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభించనున్నారు. రాజమౌళి పక్కా ప్లానింగ్తో ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. 5. మాఫియా డాన్గా చిరంజీవి: 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న 'Mega 158' ప్రాజెక్టుకు సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్లో చిరంజీవి 'మాఫియా డాన్'గా కనిపిస్తారని, ఆ సమయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది. 6. అనుష్క శెట్టి విశ్వరూపం: బాహుబలి తర్వాత అనుష్క శెట్టి మరో భారీ విజువల్ వండర్ 'కథనార్'తో అలరించడానికి సిద్ధమైంది. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మాయా ప్రపంచాన్ని చూపిస్తూ ట్రైలర్ అద్భుతంగా సాగింది. 19వ శతాబ్దపు కేరళ నేపథ్యంలో.. దట్టమైన అడవులు, ప్రాచీన ఆలయాల మధ్య సాగే ఈ కథలో విజువల్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి. ఇక ట్రైలర్లో అనుష్క తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో మరోసారి మ్యాజిక్ చేసింది. 7. జయలలిత భవనం సీజ్: హైదరాబాద్లో ఉన్న తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో జె.జయలలిత పేరుతో భవనం ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి పేరుకుపోవటంతో.. జయలలితకు సంబంధించిన వ్యక్తులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాజాగా అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. 8. సల్మాన్ ఖాన్ సరసన నయనతార: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్టులోకి లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బ్లాక్బస్టర్ 'జవాన్'తో నార్త్ ఆడియన్స్ను కూడా మెప్పించిన నయనతార.. సల్మాన్ ఖాన్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఈ యాక్షన్ డ్రామా 2027 ఈద్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది. 9. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్: "అవకాశాల్లేక ఈగలు తోలుకుంటున్నాను" అంటూ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలోని 'గురుతుందా' సాంగ్ లాంచ్ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈగలు తోలుకుంటున్న తన దగ్గరకు సాయి రాజేష్ వచ్చి, ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగారని మెలోడీ బ్రహ్మ అన్నారు. 10. నాగార్జునకు జోడిగా ఐశ్వర్య రాజేష్: కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇదే వీరి కాంబినేషన్ లో మొదటి సినిమా కావడం విశేషం. తమిళ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Mar 31, 2026
Peddi: లుక్ వెనక ఉన్న అసలు రహస్యం ఇదే.. ఈ ఫుడ్ తింటే మీకు కూడా పక్కా
-పహిల్వాన్ లుక్ తో ఆల్ రికార్డ్స్ బద్దలు -అసలు పెద్దికి బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ఎలా వచ్చింది! -చేసిన వ్యాయామాలు ఏంటి! -తీసుకున్న ఫుడ్ -మరి పెద్ది రహ్యసం ఏంటో చూద్దాం స్టిల్ మెగాఫ్యాన్స్ తో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకుల మస్తిష్కాలు రోజువారి దినచర్యలో బిజీగా ఉన్నాయి. అదే టైంలో వాళ్ల మస్తిష్కాల్లో పెద్ది(Peddi)బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ కూడా కదలాడుతూనే ఉంది. అదేనండి.. కండలు తిరిగిన దేహంతో ఇటీవల రిలీజైన పెద్ది పహిల్వాన్ లుక్. పెద్దిని ఒక రేంజ్ లో ఎలివేషన్ చేసిన సదరు లుక్ ఇప్పుడు సోషల్ మీడియాని ప్రశాంతంగా ఉండనివ్వని పరిస్థితి. చరణ్ కి బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ఎలా సాధ్యమైంది! ఎలాంటి ఆహరం తీసుకున్నాడు! ఎలాంటి నియమాలు, వ్యాయామాలు చేసాడు! అని గూగుల్ తల్లితో పాటు తమకి తెలిసిన వాళ్ళందరిని కనుక్కోవడం స్టార్ట్ చేసారు. మరి ఈ విషయంలో మీరు కష్టపడకుండానే మాకు అందిన సమాచారం ప్రకారం పహిల్వాన్ గురించి కొన్ని విశేషాలు తెలియచేస్తున్నాం. సాధారణంగా కండలు పెంచాలంటే మాంసాహారం తప్పనిసరి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. మోస్ట్ లీ ఆ విధంగా చేసే వాళ్ళే ఉంటారు. కానీ చరణ్ ఈ విధమైన నాన్ వెజ్ ఐటం జోలికి వెళ్ళలేదు. కనీసం ఎగ్ ని కూడా ముట్టుకోలేదు. కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటి ప్రకృతి సిద్ధమైన ఫుడ్ తోనే బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ని సొంతం చేసుకున్నాడు. అదే విధంగా గత ఎనిమిది నెలలుగా ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే కఠినమైన వ్యాయామాలతో పాటు వ్యక్తిగతట్రైనర్ పర్యవేక్షణలో మరిన్ని వ్యాయామాలు చేసాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కూడా ఆధ్యాత్మిక నియమాలని పాటిస్తూనే వ్యాయామాలు చేసాడు. వాటిల్లో 'ముగ్ధార్' అనే సాంప్రదాయ వ్యాయామ పరికరాన్ని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. బరువైన చెక్కతో తయారైన ముగ్ధార్' ని పాతకాలంలో యోధులు, పహిల్వాన్లు, మల్లయోధులు తమ శారీరక దారుఢ్యం, బలం, కండరాల పుష్టి కోసం చేతితో తిప్పుతూ వ్యాయామం చేసేవారు. గద ఆకారాన్ని పోలి ఉంటుంది. టీజర్లో చరణ్ గదను తిప్పుతూ పోరాట సన్నివేశాల్లో కనిపించడం ఈ శిక్షణకి నిదర్శనమని కూడా చెప్పవచ్చు. Also read: UStaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ పై అలీ కీలక వ్యాఖ్యలు చరణ్ ఇటీవల పెద్ది షూట్ లో గాయాలపాలవ్వడంతో పెద్ది వాయిదా అనే న్యూస్ నెటిజన్స్ అత్యధిక ఓట్లతో వాయిదా అనేది నమ్మశక్యంగానే ఉంది. కానీ మూవీ లవర్స్, ఫ్యాన్స్ మాత్రం ఏప్రిల్ 30 న పెద్ది ఆగమనం ఫిక్స్ అంటున్నారు. మరి వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదనే కోరుకుందాం.
Mar 31, 2026
Peddi Release Date: రామ్ చరణ్ 'పెద్ది' మళ్ళీ వాయిదా.. మెగా ఫ్యాన్స్కు సారీ చెప్పిన నిర్మాత!
పెద్ది రిలీజ్ డేట్పై గందరగోళం ఏప్రిల్ 30నే వస్తుందా లేదా జూన్లో వస్తుందా? క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). గ్లోబల్ స్టార్గా ఎదిగిన చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి మార్చి 27న విడుదల కావాల్సిన పెద్ది, ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా కష్టమే అంటున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి పోస్ట్ పోన్ న్యూస్ ఊపందుకున్నాయి. పెద్ది కొత్త విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ రకంగా ఈ చర్చకు కారణమైన నిర్మాత ఎస్కేఎన్ (SKN) తాజాగా ఈ విషయంలో స్పందిస్తూ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్ లో ఎస్కేఎన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 26న విడుదలవుతుందని అందుకే తమ సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకుంటున్నామని ప్రకటించారు. మెగా కాంపౌండ్ కి దగ్గరగా ఉండే నిర్మాత నోటి నుంచి ఈ మాట రావడంతో, 'పెద్ది' విడుదల ఏప్రిల్ 30 నుండి జూన్కు వాయిదా పడిందని అందరూ ఫిక్స్ అయిపోయారు.ఈ న్యూస్ వైరల్ కావడంతో మెగా అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్కేఎన్ ఒక వీడియోను విడుదల చేస్తూ అసలు విషయం వివరించారు. ఈవెంట్లో ఎస్కేఎన్ తో సాయి రాజేష్ మాట్లాడుతూ.. 'పెద్ది' జూన్ 26న రానుందని సోషల్ మీడియాలో ట్వీట్లు కనిపిస్తున్నాయని, ఆ టీం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు మన సినిమా డేట్ అనౌన్స్ చేయొద్దు అని చెప్పారట. అయితే ఆ సమయంలో అక్కడ సౌండ్ డిస్టబెన్స్ వల్ల వల్ల సాయి రాజేష్ మాటలను ఎస్కేఎన్ తప్పుగా అర్థం చేసుకున్నారట. 'పెద్ది' మేకర్స్ అప్పటికే డేట్ను అధికారికంగా ప్రకటించేశారని పొరబడిన ఎస్కేఎన్, స్టేజి మీద ఆ విషయాన్ని చెప్పేశారు. తన వల్ల జరిగిన ఈ చిన్న మిస్ కమ్యూనికేషన్కు ఆయన చింతిస్తూ, "పెద్ది లాంటి పెద్ద సినిమా అప్డేట్స్ ఆ ప్రొడక్షన్ హౌస్ నుండే రావాలి. నేను పొరపాటున ఆ డేట్ చెప్పినందుకు క్షమించండి" అన్నారు. దీంతో పెద్ది వాయిదాపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రారా' సాంగ్స్ చార్ట్బస్టర్స్ గా నిలిచాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ ఉంది. ఏప్రిల్ 30నే వస్తుందా లేదా ఎస్కేఎన్ చెప్పినట్లు జూన్లో వస్తుందా అన్నది 'పెద్ది'ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Also Read: మెగా సర్ప్రైజ్.. మాఫియా డాన్గా చిరంజీవి! https://x.com/SKNonline/status/2038650185690341758
Mar 31, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



