English | Telugu

Eto Vellipoyindhi Manasu : శ్రీలత పెట్టిన పరీక్షల్లో వాళ్ళిద్దరు బయటపడ్డారా.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -57  లో.. సీతాకాంత్ , రామలక్ష్మి ఇద్దరు గుమ్మం దగ్గరికి రాగానే.. శ్రీలత చూసి శ్రీవల్లిని పిలుస్తుంది. ఆ తర్వాత తనకి హారతి ఇవ్వమని శ్రీలత అనగానే.. అందరు షాక్ అవుతారు. నిన్నటి వరకు పుట్టెడు కోపంగా ఉన్న అత్తయ్య ఇప్పుడేంటి ఇలా మారిపోయిందని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నువ్వు అంటే నాకు కోపం లేదు కానీ మీ నాన్న చేసిన మోసాన్ని మాత్రం క్షమించలేనంటూ రామలక్ష్మితో ప్రేమ గా ఉన్నట్టు నటిస్తుంది శ్రీలత.

అడవి శేష్ సింగల్ అని ఎవరు చెప్పారు...అతను మల్టిపుల్

చెఫ్ మంత్ర సీజన్ 3 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ ఇద్దరూ వచ్చారు. రాగానే నిహారిక శేష్ మీద ఒక రెండు లైన్స్ చెప్పింది "ఎయిట్ తర్వాత వస్తుంది నైన్ ...మా శేష్ సింగల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్" అనేసరికి రాహుల్ రవీంద్రన్ అసలు విషయం బయటపెట్టేసాడు. "శేష్ సింగల్ అని ఎవరు చెప్పారు. శేష్ యాక్చ్యువల్లి మల్టిపుల్..." అని చెప్పేసరికి శేష్ షాకైపోయాడు. ఇంతలో యాదమ్మ రాజు అక్కడికి వచ్చాడు ఒక కెమెరా పట్టుకుని. యాదమ్మ రాజును చూసాక ఎవడీడు అని శేష్ అడిగాడు "నా పేరు జూ పార్క్ రాజు" అని చెప్పాడు. "జూ పార్క్ ఏంట్రా" అని నిహారికా అడిగింది.

Krishna Mukunda Murari: భర్త కోసం భార్య కన్నీటి పర్యంతం.. భవాని అన్ని తెలుసుకోనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 428 లో.. శ్రీనివాస్ దగ్గరికి ముకుంద కోపంగా వస్తుంది. వచ్చేసేవా? మురారిని విడిపించేశావా? తప్పు చేశావ్ ముకుంద అని శ్రీనివాస్ కోపంగా అనగానే.‌. తప్పు చేసింది నువ్వు నాన్న అని ముకుంద అంటుంది. అసలు నీకు మానవత్వం ఉందా? మురారిని అంత దారుణంగా కొట్టిస్తావా అని ముకుంద అనగానే.. ఈ ఒక్క రాత్రి నువ్వు కళ్ళు మూసుకుంటే తెల్లారేసరికి మురారి కళ్ళుమూసేవాడని శ్రీనివాస్ అంటాడు. ఆపు నాన్న .. ఇంకొక మాట మాట్లాడితే కన్నతండ్రివి అని కూడా చూడనని ముకుంద అనగానే.. నేను నీ కన్నతండ్రినే అమ్మ, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసినవాడిని నేనెలా వదిలేస్తానని శ్రీనివాస్ అనగానే.. నేను చెప్పానా అని ముకుంద అంటుంది. 

Eto Vellipoindhi Manasu: వాళ్ళ శోభనం గదిలో బ్లూటూత్ పెట్టిన మాణిక్యం.. అంతా తెలిసిపోయిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 56 లో.. మాణిక్యం పూలగంపతో ఇంటికొచ్చి తన భార్య సుజాతకి రూమ్ అంతా డెకరేట్ చేయమని చెప్పగా.. ఎందుకని తను అడుగుతుంది. వాళ్ళిద్దరికి శోభనమని మాణిక్యం అనగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. నాన్న ఇవన్నీ ఎందుకు..నేను మానసికంగా స్థిరంగా లేనని రామలక్ష్మి అంటుంది. అలా ఎప్పుడంటారో తెలుసా అమ్మ.. ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నప్పుడే మానసికంగా స్థిరంగా లేరని అంటారు.. అంటే మీరు నిజంగా పెళ్ళి చేసుకోలేదా.. నటిస్తున్నారా అని మాణిక్యం అంటాడు‌.