గడప గడపకూ ఫ్లాప్..ఇక మంత్రుల బస్సుయాత్ర

Publish Date:May 19, 2022

Advertisement

ఎలాగైనా సరే ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల ‘సత్ఫలితా’లను వారికి వివరించాలని జగన్ డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం వైసీపీ అధినేత గడప గడపకూ అంటూ ప్రజాప్రతినిథులను జనంలోకి వెళ్లమని విస్పష్ట ఆదేశాలు జారీ చేసినా వారు ఖాతరు చేయకపోవడం.. వెళ్లిన కొద్ది మందీ కూడా ప్రజాగ్రహ జ్వాలలకు జడిసి కార్యక్రమాన్ని ‘మమ’ అనిపిస్తూ చాప చుట్టేయడంతో ఆ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

దీంతో ఇలా లాభం లేదనుకున్నారో ఏమో.. ఇప్పుడు సామాజిక న్యాయ యాత్ర అంటూ మంత్రుల బస్సు యాత్రకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు బస్సులలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులను జనంలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు బస్సులలో నాలుగు రోజుల పాటు ఈ ‘ సామాజిక న్యాయ యాత్ర’ సాగనుంది. పదవులలో బలహీన వర్గాలకే పెద్ద పీట వేశామని చాటుకోవడంతో పాటు సంక్షేమ పథకాల ప్రచారం కూడా ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.   గడప గడపకు తిరిగిన ప్రజాప్రతినిథులు ప్రజల ప్రశ్నల శర పరంపరను తట్టు కోలేక ఉక్కిరి బిక్కిరై.. వెనుదిరుగుతుంటే.. ఏం చేయాలో దిక్కుతోచని జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గడప గడపకూ వెళ్లాల్సిందే అని ఆదేశించారు. ఆ ఆదేశాలను మెజారిటీ ప్రజా ప్రతినిథులు బేఖాతరు చేయడమే కాకుండా జనంలోకి వెళ్లడానికి ససేమిరా అంటుండటంతో..   ప్రజల వద్దకు నేరుగా వెళ్లడం కంటే మంత్రులను బస్సుల్లో పంపితే వారు జనానికి దూరంగా,  బస్సులపై నుంచే మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించిన పథకాల గురించి వివరించే అవకాశం లభిస్తుందన్నది జగన్ యోచన చేశారని పార్టీ వర్గాల కథనం.

 సామాజిక న్యాయ యాత్ర పేర జగన్ తలపెట్టిన ఈ మంత్రుల బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు నాలుగు బస్సులలో పాల్గొంటారు. ఈ బస్సు యాత్ర రూట్‌ మ్యా్‌పపై   ప్రభు త్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మా న ప్రసాదరావులు సమీక్ష జరిపి ఖరారు చేశారు.  శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపట్టి.. బహిరంగ సభలు నిర్వహిస్తారు. 

26న శ్రీకాకుళం  27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బస్సుయాత్ర, బహిరంగ సభలు జరుగుతాయి.   ఈ నెల 10 జగన్ ప్రతిష్టాత్మకంగా భావించి ఈ నెల10 నుంచి ప్రారంభించిన గడపగడపకూ కార్యక్రమంలో  మంత్రులు, ప్రజాప్రతినిధులపై జనం నిరసనలతో తిరగబడిన నేపథ్యంలో   ప్రత్యామ్నాయంగా బస్సు యాత్రను తెరపైకి తెచ్చారు.

దానిని కూడా సెలక్టివ్ గా కేవలం నాలుగు నియోజకవర్గాలకే పరిమితం చేయడం ప్రభుత్వం ప్రజాగ్రహానికి ఎంతగా బెదరిపోతున్నదో చెప్పడానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. మొత్తం మీద నాలుగు నియోజకవర్గాలతోనే బస్సు యాత్రను ముగించాలన్ననిర్ణయమే.. మిగిలిన నియోజకవర్గాలలో జనాల ఆగ్రహాన్ని ఫేస్ చేయడం మంత్రులకైనా సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయని ప్రబుత్వం భావించడమేనన్న విశ్లేషణలకు పరిశీలకులు పదును పెట్టారు.   నాలుగు నియోజకవర్గాలకే పరిమితమైన ఈ బస్సు యాత్రలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బలహీనవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం, అందుతున్న పథకాలను మంత్రులు ప్రజలకు  వివరిస్తారు.  బస్సులపై నుంచి ప్రసంగాలతో ప్రజాగ్రహజ్వాలలకు దూరంగా ఉండొచ్చన్నది జగన్ ప్లాన్ అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

By
en-us Political News

  
తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బబీజేపీ, బీఆర్ఎస్ లు ఇప్పుడు ఆ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
మాజీ మంత్రి తాడికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టకి రాజీనామా చేసిన తాడికొండ రాజయ్య తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.
భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది.
చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది
హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.
రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్.
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.