కాంగ్రెస్ జోరు తగ్గిందా?.. రేవంత్ దూకుడు ఆగిందా?.. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?

Publish Date:Aug 14, 2022

Advertisement

ఉన్న అవకాశాలను కూడా చేజార్చుకోవడం కాంగ్రెస్ కు అలవాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ కు నిజంగా మునుగోడు ఉన ఎన్నిక కలిసి వచ్చిన అవకాశమనే చెప్పాలి. అయితే అంతర్గత విభేదాలతో ఆ అవకాశాన్ని చేజార్చుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందా అంటే ఔననే చెప్పాలి.

మునుగోడు ఉప ఎన్నిక వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ కే కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే.. పార్టీలో అంతర్గత విభేదాలకూ చెక్ పడుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతమైందన్న వాదనకూ బలం చేకూరుతుంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన నాటి నుంచీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యవహారాలతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారన్న సంకేతాలూ ఉన్నాయి. అయినా కూడా కాంగ్రెస్ ఆయనపై చర్య తీసుకునే సాహసం చేయలేదు. పైపెచ్చు చివరి నిముషం వరకూ బుజ్జగింపుల పర్వం కొనసాగించి.. అనవసరమైన ప్రాధాన్యత పెంచింది.

దానిని అలుసుగా తీసుకునే ఆయన, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ పై విమర్శలతో చెలరేగిపోయారు. రాజగోపాలరెడ్డి, వెంకటరెడ్డి ద్వయం విమర్శలను దీటుగా ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ సీనియర్లు ఏ మాత్రం చొరవ తీసుకోలేదు. అదేదో పార్టీకి సంబంధించి విషయం కాదన్నట్లుగా, రేవంత్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారమన్నట్లుగా మౌనం వహించారు.  పైపెచ్చు రేవంత్ దూకుడు వల్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి దూరమయ్యారంటూ   నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఆ ఫిర్యాదు మేరకే హై కమాండ్ రేవంత్ దూకుడుకు కళ్లెం వేసే చర్యలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

అందుకే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బేషరతు క్షమాపణ చెప్పారని అంటున్నారు. అంతే కాకుండా కరోనా అంటూ మునుగోడులో కీలక సమయంలో ప్రచారానికీ దూరం అయ్యారని అంటున్నారు. పాదయాత్రలో పాల్గొనకపోవడం, తన సహజశైలిలో బీజేపీ, తెరాసలపై విమర్శల దాడి చేయడంలోనూ కూడా వాడి తగ్గించారని పరిశీలకులు   విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా మునుగోడు ప్రచారం విషయంలో వెనక్కు తగ్గమని హైకమాండ్ నుంచి రేవంత్ కు  ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.  ఇందుకు ఉదాహరణగా రాజగోపాల్ రెడ్డి ని  బుజ్జగించే బాధ్యతను .. అదే జిల్లాకు చెందిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడాన్నిప్రస్తావిస్తున్నారు.

అలాగే ఉపఎన్నిక బాధ్యతలను నల్గొండ జిల్లా కు చెందిన సీనియర్లకే అప్పగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. జల్లా కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలు ఉంటాయన్న బూచిన చూపి మునుగోడు విషయంలో రేవంత్ ను దూరం పెట్టే వ్యూహానికి కాంగ్రెస్ సీనియర్లు తెరలేపినట్లు చెబుతున్నారు.  మునుగోడు ఉపఎన్నికకోసం   మధుయాష్కీ నేతృత్వంలో కమిటీ వేయడం వెనుక కారణం ఇదేనని చెబుతున్నారు.  

By
en-us Political News

  
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
జగన్ ధైర్యంగా జనంలోకి వచ్చి ఐదేళ్లయ్యింది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర తరువాత ఆయన జనం ముఖం చూడటం మానేశారు. తన అధికారాన్ని ప్రత్యర్థులు, వ్యతిరేకులపై కక్ష సాధించుకోవడానికీ, సంక్షేమ పథకాల పేర లబ్ధిదారులకు అరకొరగా సొమ్ముల పందేరానికి అప్పుల వేటకీ పరిమితమైపోయారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మార్చి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు
మేమంతా సిద్ధం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. బుధవారం (మార్చి 27)న ఆయన తన ఎన్నికల ప్రచార బస్సు యాత్రకు ఇడుపుల పాయ నుంచి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఇడుపులు పాయలో జగన్ ను తల్లి విజయమ్మ ఆశీర్వదించారు.
చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎంత బుకాయించినా నిజం నోటి వెంట తన్నుకు రాక తప్పదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలోనూ అదే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ కేటీఆర్ తన నోటి వెంటే చెప్పేశారు. వెంటనే నాలుక కరుచుకుని ఏమో నాకు తెలియదు అంటూ సర్దుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.