Top Stories

dummy

political-news-img

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. మహిళా స్మగ్లర్ అరెస్ట్

హైదరాబాద్‌ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్ ఆందోళనకర స్థాయికి చేరింది. తరచూ ఈ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 17) ఉదయం విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా ఒక మహిళా స్మగ్లర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు శంషాబాద్ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆమె వెంట ఉన్న లగేజీ బ్యాగులలో రహస్యంగా దాచిన డ్రగ్స్ బయటపడ్డాయి. ప్రాథమిక పరీక్షలలో ఆమె వద్ద అభించినది హైడ్రోపోనిక్ గంజాయి అని తేలింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్ లో కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితురాలిని విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తరలించారు. ఇటీవలి కాలంలో బ్యాంకాక్, దుబాయ్ వంటి నగరాల నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా పెరిగినట్లు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలను మరింత కఠినతరం చేశారు.

Publish Date: Apr 17, 2026 11:52AM

political-news-img

రెండేళ్లలో 5వేల ఆలయాల నిర్మాణం.. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం

శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు గురువారం (ఏప్రిల్ 16) సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామనీ, ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజ కవర్గంలోనూ పాతిక నుంచి 30 ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్న ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలన్నారు. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని చెప్పిన ఆయన ఈ మాస్టర్ ప్లాన్ ల ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దేవాలయాల్లో పవిత్రతో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్న చంద్రబాబు.. అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగు పరచాలని చెప్పారు. ఇందుకోసం టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Publish Date: Apr 17, 2026 11:39AM

political-news-img

థాయ్‌లాండ్‌ సాంగ్‌క్రాన్ ఉత్సవాల్లో విషాదం.. 191 మంది మృతి

థాయ్‌లాండ్‌లో అత్యంత వైభవంగా జరిగే సాంగ్‌క్రాన్ ఉత్సవాలు ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద 'నీటియుద్ధంగా గుర్తింపు పొందిన ఈ వేడుకల ప్రారంభంలోనే భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. కేవలం మొదటి మూడు రోజుల్లోనే వివిధ రోడ్డు ప్రమాదాల్లో 191 మంది మరణించారు. ఏటా ఏప్రిల్ నెల మధ్యలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే సాంగ్ క్రాన్ ఉత్సవం భారీ ప్రాణనష్టంతో విషాదంగా మారింది. థాయ్ లాండ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నీళ్లతో ఒకరినొకరు తడుపుకుంటూ పండుగ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది ఈ ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలలో 191 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. సాంగ్ క్రాన్ ఉత్సవాల ప్రారంభం రోజునే రోడ్డు ప్రమాదాలలో 51 మంది మరణించారు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలుపుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, అదీ మద్యం సేవించి వాహనాలు నడపడం, అలాగే శిరస్త్రాణాలు ధరించకపోవడం కారణంగా ప్రమాదాలలో మృతుల సంఖ్య భారీగా పెరిగిిందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ సాంగ్ క్రాన్ వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరగడం అన్నది ఏటా సర్వసాధారణమే అయినా, ఈ ఏడాది ప్రమాదాల సంఖ్యా, మృతుల సంఖ్యా కూడా ఆందోళనకర స్థాయికి పెరిగిందంటున్నారు. ఏప్రిల్ నెల మధ్యలో ఆరంభమై వారం రోజుల పాటు జరిగే సాంగ్ క్రాన్ పండుగ కాలాన్ని అధికారులు సెవెన్ డేంజరస్ డేస్ గా చెబుతుంటారు. ఈ పండుగ రోజులలో బ్యాంకాక్ వంటి నగరాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు తరలివెడతారు. ఆ కారణంగా రోడ్లన్నీ కక్కిరిసిపోతాయి. ఆ కారణంగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.

Publish Date: Apr 17, 2026 11:25AM

political-news-img

అనకాపల్లి జిల్లాలో వారి ఎనర్జీస్ భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ సంస్థ అయిన వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అనకాపల్లి జిల్లాలో 8 వేల 175 కోట్ల రూపాయలతో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కంపెనీ రెడీ అయ్యింది. ఇందు కోసం ఆ కంపెనీకి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ లభ్యమయ్యాయి. దీంతో త్వరలో ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని వారి ఎనర్జీ స్టోరేష్ సిస్టమ్ నిర్ణయించింది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ సుమారు 16 గిగావాట్ అవర్ ( సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ ప్లాంట్‌లో కేవలం బ్యాటరీ ప్యాక్‌లు మాత్రమే కాకుండా, సెల్ తయారీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు అవసరమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయనుంది. ఈ భారీ పరిశ్రమ స్థాపన ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు మొదటి దశను వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని వారీ ఎనర్జీస్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వారీ ఎనర్జీస్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గుజరాత్ , అమెరికాలోని టెక్సాస్‌లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉన్న ఈ సంస్థ, తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి అవసరమైన బ్యాటరీ నిల్వ వ్యవస్థలను దేశీయంగానే అందించే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 20 గిగావాట్ అవర్ వరకు పెంచాలని వారీ ఎనర్జీస్ సంస్థ భావిస్తోంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారీలో ఈ కేంద్రం దేశంలోనే కీలక భూమిక పోషించనుందని చెబుతున్నారు.

Publish Date: Apr 17, 2026 11:07AM

political-news-img

సింగపూర్ వెళ్లే మంత్రుల బృందానికి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా త్వరలో ఒక మంత్రుల బృందాన్ని సింగపూర్ పర్యటనకు పంపించనున్నారు. అలా సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో అమరావతి అభివృద్ధికి సింగపూర్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందన్న పరిశీలన, అధ్యయనానికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో ఏపీకి ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే కాకుండా, నూతన పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా పెట్టుబడులను సాధించాలని ఆయనీ సందర్భంగా మంత్రులకు సూచించారు. గతంలో రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన చంద్రబాబు.. మళ్ళీ అదే స్ఫూర్తితో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సాంకేతికత మరియు ఆర్థిక సహకారంపై అక్కడి పారిశ్రామిక వేత్తతలు, ప్రభుత్వ ప్రముఖులతో చర్చించాలని మంత్రుల బృందాన్ని ఆదేశించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర పట్టణాభివృద్ధి, నూతన టెక్నాలజీ రంగాలలో సింగపూర్ సాధించిన విజయాలను పరిశీలించాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఏపీలో అందుబాటులో ఉన్న వనరులు, ప్రభుత్వ రాయితీలను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. మంత్రుల పర్యటన కేవలం అధ్యయనానికే పరిమితం కాకుండా, స్పష్టమైన ఒప్పందాలకు మార్గం సుగమం చేసేలా ఉండాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నిర్మాణానికి సింగపూర్ సంస్థలు ఎంతో ఆసక్తి చూపినప్పటికీ, గత ఐదేళ్లలో ఆ ప్రక్రియలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ఆ ప్రాజెక్టులకు జీవం పోయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రుల బృందం సింగపూర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సమర్పించే నివేదిక ఆధారంగా రాజధాని పనులలో మరింత వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Publish Date: Apr 17, 2026 10:34AM

political-news-img

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

పశ్చిమ ఆసియా సంక్షోభంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొంతకాలంగా సరిహద్దుల్లో కొనసాగుతున్న భీకర దాడులకు అడ్డుకట్ట వేస్తూ.. పది రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ లు అంగీకరించాయనీ, అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం గురువారం (ఏప్రిల్ 16) నుంచే అమల్లోకి వచ్చిందనీ ట్రంప్ తెలిపారు. ఈ కీలక పరిణామంపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్‌లతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల కాలం తర్వాత అమెరికా చొరవతో ఇరు దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరపడం విశేషం. ఈ ఒప్పందానికి ముందు వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యవేక్షణలో ఇజ్రాయెల్, లెబనాన్ దౌత్యవేత్తలు ముఖాముఖి చర్చలు జరిపారు. 1980 దశకం తర్వాత ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే తొలిసారి. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, ఇరాన్ జోక్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా అమెరికా ఈ దౌత్యం నెరిపింది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ వైమానిక, క్షిపణి దాడుల కారణంగా లెబనాన్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. హెజ్బొల్లా స్థావరాల సాకుతో ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో లెబనాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన దాడులను ఆపివేయాల్సి ఉండగా, హెజ్బొల్లా కూడా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. మరోవైపు.. దక్షిణ లెబనాన్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి తరపున విధులు నిర్వహిస్తున్న భారత సైనికుల భద్రతపై ఈ ఒప్పందం ప్రభావం చూపనుంది. ప్రస్తుతం అక్కడ 642 మంది భారత శాంతి భద్రతా సైనికులు సేవలందిస్తున్నారు. యుద్ధం తీవ్రతరమైతే వీరి రక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున, భారత్ కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ట్రంప్ చొరవను అభినందించారు. ఈ ఒప్పందం శాశ్వత శాంతికి నాంది కావాలని ఆకాంక్షించారు. ఈ పది రోజుల కాల్పుల విరమణ సమయాన్ని ఉపయోగించుకుని ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఈ సమయంలో హెజ్బొల్లా నుంచి ఎలాంటి దాడులు జరగకపోతే, ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని ట్రంప్ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇరాన్ నుంచి ఈ ఒప్పందంపై ఇంత వరకూ ఎటువంటి స్పందనా రాలేదు.

Publish Date: Apr 17, 2026 10:12AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img