మునిసిపల్ ఎన్నికలకు సై అంటున్న యువత!!

Publish Date:Dec 28, 2019

Advertisement

సంగారెడ్డి జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సందడి మొదలైంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి నేతలు గెలుపుపై ఎవరికివారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టిడిపి, వామపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో యువత పోటీకి ఎక్కువగా ఉత్సాహం చూపుతోంది. అన్ని పార్టీల నేతలు కొత్త ముఖాలను బరిలోకి దించాలని యోచిస్తున్నాయి. 

జిల్లాలో గతంలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జోగిపేట పురపాలక సంఘాలతో పాటు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్ పూర్, బొల్లారం, తెల్లాపూర్ మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. పరిధిల విలీనం వార్డుల విభజన వంటి సమస్యలూ కోర్టు పరిధిలో ఉన్నందున జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు బ్రేక్ పడింది. మిగిలిన ఏడు పురపాలకల్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. కానీ అందరి దృష్టీ పటాన్ చెరువు నియోజక వర్గం పైనే పడింది ఇక్కడ మేజర్ పంచాయతీలు ఈసారి మునిసిపాలిటీలుగా మారాయి. దీంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు చాలా మంది ఔత్సాహికులు సయ్యంటూ సవాలు విసురుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరువు నియోజక వర్గం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో వుంటుంది. ఈ ప్రాంతమంతా దాదాపుగా హైదరాబాద్ లో కలిసినట్టే ఉంటుంది. చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పటాన్ చెరువు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. భూములు కూడా కోట్లలో ధర పలుకుతాయి. ఈ ప్రాంతమంతా హైదరాబాద్ వాతావరణమే కనిపిస్తుంది. ఇక గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలగా మారి హోదా పెరిగింది. దీంతో అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది. అదే సమయంలో గ్రామ స్థాయి నేతలంతా పట్టణ స్థాయి నేతలుగా ప్రమోట్ అయ్యారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. 

ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కనిపిస్తుంది. బిజెపి కూడా అన్ని చోట్లా పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీలను ఢీకొని క్యాడర్ మాత్రం కమలనాథులకు లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన మహిపాల్, మూడు మునిసిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ కావడం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ లు పార్టీ అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికీ మునిసిపల్ ఎన్నికలు చలికాలంలో వేడి పుట్టిస్తున్నాయి.

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.
భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది.
చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది
హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.
రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్.
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.