ఏపీపై కేంద్రం సీరియస్.. బూతుల కొడాలి.. ఇ ఇద్దరూ కలిశారు..భారత్ భళా.. టాప్ న్యూస్@7PM

Publish Date:Nov 27, 2021

Advertisement

ఏపీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వం మరోసారి సీరియస్ అయింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానిక సమాధానం ఇవ్వలేదు. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని ఏపీని కేంద్రం ఆదేశించింది. ప్రధాని కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శికి విడివిడిగా కేంద్ర గణాంకాలు, ప్రణాళికా మంత్రిత్వ శాఖ లేఖలు పంపింది
--
ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తెస్తున్నారని తప్పుబట్టారు. దేశంలో ఇంతలా అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ తప్ప మరొకటి లేదన్నారు. ఆర్థిక విధ్వంసంపై ప్రధాని, ఆర్బీఐ బ్యాంక్‌లకు లేఖలు రాస్తానని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అప్పులు ఇచ్చి ప్రజలను బలిపశువులు చేయొద్దని సూచించారు. 
------
అనంతపురంలో జిల్లా సమీక్ష సమావేశం ఎంపీ గోరంట్ల మాధవ్ వర్సెస్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నట్లుగా సాగింది. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదని ఎంపీ గోరంట్ల ఆరోపించారు. తిండికి తిప్పరాజు పనికి పోతురాజు అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితిని తప్పుబట్టారు. అయిపోయిన పెళ్లికి పయ్యావుల కేశవ్ మేళం వాయించినట్టుందని మాధవ్ ఎద్దేశాచేశారు. మాధవ్ వ్యాఖ్యలపై పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదలపై చర్చ జరుగుతుంటే తనపై వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యంతో పయ్యావుల కేశవ్ శాంతించారు.
-----
అనంతపురం జిల్లాలోని వ్యవసాయ అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడతూ అధికారులు ఎవరూ కూడా పంటల ఈ- క్రాపింగ్ చేయడం లేదన్నారు. ఈ- క్రాపింగ్‌లో ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఉందని  ప్రశ్నించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం లేదన్నారు. పంటలు సాగుచేసిన విస్తీర్ణం కూడా సరిగా నమోదు చేయడం లేదని రాంచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. 
----
మంత్రి కొడాలి నానికి బూతులు తప్ప ఏమీ తెలియదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. మనిషిగా మారడానికి కొడాలి నాని ప్రయత్నించాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్లపై సాష్టాంగపడే కొడాలి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. తనను విమర్శించే అర్హత కొడాలి నానికి లేదని హెచ్చరించారు. ‘‘ఓడినా, గెలిచినా.. నేను నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉంటా. నీలా ఊరకుక్కలా పార్టీల వెంట పరిగెత్తి గెలిచి.. బూతుల మంత్రి, బుద్ధిలేనివాడని పేరు తెచ్చుకోలే అని వర్గ రామయ్య అన్నారు. 
-----
వరి కొనకపోతే ప్రదాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ఉరివేయడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద వరి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనకపోతే కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఈ రాత్రి ధర్నాచౌక్‌లోనే నిద్రిస్తామని ప్రకటించారు. రైతుల మృతికి సీఎం కేసీఆర్‌ కారణమని దుయ్యబట్టారు. వరి కుప్పలపైనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని తప్పుబట్టారు.
-----
టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీలుగా నిలుచున్న భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ ఎక్కడైనా, ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అని సీఎం కేసీఆర్‌ను కరీంనగర్ మాజీ మేయర్, కార్పొరేటర్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల సమస్యలపై ఎప్పుడైనా భాను ప్రసాద్ మాట్లాడాడా అని ఆయన నిలదీశారు. 24 గంటల్లోనే కలెక్టర్ వెంకట్రామా రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఉద్యమకారులను పక్కబెట్టడం ఏంటన్నారు. డబ్బుల సంచులతో వచ్చి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
------
ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీని ప్రభావం ఇప్పుడు క్రీడారంగంపైనా పడింది. జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ కూడా కొత్త వేరియంట్ ప్రభావంతో నిలిచిపోయింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో అనేక ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తుండడంతో టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చేసింది. 
---
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  సభ్యుల సంక్షేమమే తమకు పరమావధి అని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి స్పష్టం చేశారు. 'మా' సభ్యుల ఆరోగ్యం, వైద్య చికిత్సల కోసం తాము పని ప్రారంభించామని, హైదరాబాదు నగరంలోని ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సౌజన్యంతో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, బిల్లుల్లో రాయితీలు లభిస్తాయని వివరించారు.
--
న్యూజీలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్సులో భారత్ కు 49 పరుగుల కీలక ఆధిక్యత లభించింది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు 1, అశ్విన్ కు 3 వికెట్లు లభించాయి. పేసర్ ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. 
---

By
en-us Political News

  
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.