కాంగ్రెస్ కు తృణమూల్ మరో ఝలక్ .. రాహుల్ టార్గెట్ గా పీకే స్కెచ్

Publish Date:Nov 28, 2021

Advertisement

జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి పడగొట్టి ఆ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? కమలదళం కలలుకన్న కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్య సాధనకు, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నడుం బిగించారా? అంటే  రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. 

పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  కాంగ్రెస్ పార్టీలో చేరి, స్వయంగా తానే రాజకీయ చక్రం తిప్పాలని ఆశించారు. అందుకోసం  ప్రయత్నించారు. అయితే, ఎందుకనో  ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఇక అక్కడి నుంచి ఆయన మళ్ళీ మరోసారి మమతతో జట్టు కట్టి, కాంగ్రెస్ మీద కక్షకట్టారా అన్నట్లుగా, రాష్ట్రాలవారీగా, కాంగ్రెస్ జెండాను పీకేసీ ఆ స్థానంలో తృణమూల్ జెండాను ఎగరేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందుగా ఈశాన్య రాష్ట్ర్లపై కన్నేసిన పీకే, కొంత వరకు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొందరు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ గూటికి చేరుతున్నారు.  ఇప్పటికే మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సుష్మితా దేవ్, గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్‌హో ఫ‌లేరో, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇంకా ఇతర కీలక నేతలు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ తీర్ధం పుచ్చుకున్నారు. 

అంతేకాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆవిష్కరించే ఆలోచనకు అంకురార్పణ అన్నట్లుగా మేఘాలయలో ప్రతిపక్షపీఠం నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి, ఆ స్థానాన్ని తృణమూల్ ఆక్రమించుకుంది. గమ్మత్తు ఏమంటే, రెండేళ్ళ క్రితం జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీనే చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని తమ వైపుకు తిప్పుకున్న తృణమూల్, వృద్ధ కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను సొంత చేసుకుంది.మమతా బెనర్జీ ఉత్తర ప్రదేశ్, మేఘాలయ, గోవా, త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో తృణమూల్ జెండాని ఇప్పటికే నిలబెట్టారు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యన్మాయంగా తృణమూల్ సారధ్యంలో మమతా బెనర్జీ నాయకత్వంలో కూటమిని ఏర్పటు చేసేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ముందుగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధనే భావన తుడిచేసేందుకు, ఆయన కాంగ్రెస్ పార్టీని నైతికంగా బలహీన పరిచే వ్యూహంతో అడుగులు వేస్తున్నారని అంటున్నారు. 

ఇదే క్రమమలో తృణమూల్ కాంగ్రెస్ తాజాగా వృద్ధ కాంగ్రెస్ కు మరో ఝలక్ ఇచ్చింది. పార్లమెంట్’లోనూ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేసింది. సోమవారం (నవంబర్ 29) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఏర్పాటు చేసిన సమావేశానికి తృణమూల్ హాజరు కాదని ఆ పార్టీ నాయకులు  స్పష్టం చేశారు. విపక్షాల సమావేశానికి రావాలని  రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తృణమూల్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే కాంగ్రెస్ సారధ్యంలో జరిగే విపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరవటం లేదని టీఎంసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.అంతే కాదు, కాంగ్రెస్ పార్టీని తృణమూల్ నేత అవహేళన చేశారు.కాంగ్రెస్ పార్టీలోనే సరైన సయోధ్యత లేదని,ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని ఎద్దేవా చేశారు .

మరో వంక కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విపక్ష్ల పార్టీల ఉమ్మడి సమావేశం జరుగతున్న సమయంలోనే,  మమతా బెనర్జీ ఢిల్లీ నివాసంలో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. కాగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ అదిపత్య పోరు, చివరకు బీజేపీకి మేలు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని, అలాగే, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు మమతా బెనర్జీ సాగిస్తున్న ప్రయత్నం ఫలిస్తే, కాంగ్రెస్ కనుమరుగైపోయినా పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయద జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.