కాంగ్రెస్ కు తృణమూల్ మరో ఝలక్ .. రాహుల్ టార్గెట్ గా పీకే స్కెచ్

Publish Date:Nov 28, 2021

Advertisement

జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి పడగొట్టి ఆ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? కమలదళం కలలుకన్న కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్య సాధనకు, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నడుం బిగించారా? అంటే  రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. 

పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  కాంగ్రెస్ పార్టీలో చేరి, స్వయంగా తానే రాజకీయ చక్రం తిప్పాలని ఆశించారు. అందుకోసం  ప్రయత్నించారు. అయితే, ఎందుకనో  ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఇక అక్కడి నుంచి ఆయన మళ్ళీ మరోసారి మమతతో జట్టు కట్టి, కాంగ్రెస్ మీద కక్షకట్టారా అన్నట్లుగా, రాష్ట్రాలవారీగా, కాంగ్రెస్ జెండాను పీకేసీ ఆ స్థానంలో తృణమూల్ జెండాను ఎగరేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందుగా ఈశాన్య రాష్ట్ర్లపై కన్నేసిన పీకే, కొంత వరకు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొందరు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ గూటికి చేరుతున్నారు.  ఇప్పటికే మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సుష్మితా దేవ్, గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్‌హో ఫ‌లేరో, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇంకా ఇతర కీలక నేతలు కాంగ్రెస్ ను వదిలి తృణమూల్ తీర్ధం పుచ్చుకున్నారు. 

అంతేకాదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆవిష్కరించే ఆలోచనకు అంకురార్పణ అన్నట్లుగా మేఘాలయలో ప్రతిపక్షపీఠం నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి, ఆ స్థానాన్ని తృణమూల్ ఆక్రమించుకుంది. గమ్మత్తు ఏమంటే, రెండేళ్ళ క్రితం జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీనే చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని తమ వైపుకు తిప్పుకున్న తృణమూల్, వృద్ధ కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను సొంత చేసుకుంది.మమతా బెనర్జీ ఉత్తర ప్రదేశ్, మేఘాలయ, గోవా, త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో తృణమూల్ జెండాని ఇప్పటికే నిలబెట్టారు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యన్మాయంగా తృణమూల్ సారధ్యంలో మమతా బెనర్జీ నాయకత్వంలో కూటమిని ఏర్పటు చేసేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ముందుగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధనే భావన తుడిచేసేందుకు, ఆయన కాంగ్రెస్ పార్టీని నైతికంగా బలహీన పరిచే వ్యూహంతో అడుగులు వేస్తున్నారని అంటున్నారు. 

ఇదే క్రమమలో తృణమూల్ కాంగ్రెస్ తాజాగా వృద్ధ కాంగ్రెస్ కు మరో ఝలక్ ఇచ్చింది. పార్లమెంట్’లోనూ కాంగ్రెస్ తో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేసింది. సోమవారం (నవంబర్ 29) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఏర్పాటు చేసిన సమావేశానికి తృణమూల్ హాజరు కాదని ఆ పార్టీ నాయకులు  స్పష్టం చేశారు. విపక్షాల సమావేశానికి రావాలని  రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తృణమూల్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే కాంగ్రెస్ సారధ్యంలో జరిగే విపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరవటం లేదని టీఎంసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.అంతే కాదు, కాంగ్రెస్ పార్టీని తృణమూల్ నేత అవహేళన చేశారు.కాంగ్రెస్ పార్టీలోనే సరైన సయోధ్యత లేదని,ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని ఎద్దేవా చేశారు .

మరో వంక కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విపక్ష్ల పార్టీల ఉమ్మడి సమావేశం జరుగతున్న సమయంలోనే,  మమతా బెనర్జీ ఢిల్లీ నివాసంలో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. కాగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న ఈ అదిపత్య పోరు, చివరకు బీజేపీకి మేలు చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని, అలాగే, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు మమతా బెనర్జీ సాగిస్తున్న ప్రయత్నం ఫలిస్తే, కాంగ్రెస్ కనుమరుగైపోయినా పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి,
బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.