దోచుకోవడం.. దాచుకోవడంలో వైసీపీ ఫస్ట్ ఆదుకోవడం.. అందుకు ఖర్చు చేయడంలో ‘దేశం’ బెస్ట్

Publish Date:May 28, 2022

Advertisement

దోచుకోవడం, దాచుకోవడం వైసీపీ నైజం. ఈ విషయం గణాంకాలతో  సహా మరోసారి రుజువు అయింది. వైసీపీకి  2020-2021 ఆర్థిక సంవత్సరంలో   107.99 కోట్ల రూపాయలు విరాళంగా, అందగా వాటిలో కేవలం ఎనిమిది కోట్ల ఏడు లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. అంటే విరాళంగా వచ్చిన మొత్తం నుంచి 99.25 శాతం నిధులు ఖర్చు చేయకుండా మిగుల్చు కుంది.    అదే ఆర్థిక సంవత్సరంలో  తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాలు 3 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే. కానీ.. తెలుగుదేశం ఖర్చు చేసింది మాత్రం  54 కోట్ల 76 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అంటే.. వచ్చిన విరాళాల ద్వారా అందిన ఆదాయం కన్నా తెలుగుదేశం 1,584 కోట్ల రూపాయలు అదనంగా వ్యయం చేసింది.    విరాళాల సొమ్మును మిగుల్చుకోవడంలో వైసీపీ ఏపీలోనే కాకుండా దేశంల మొత్తంలోనే ప్రథమ స్థానంలో నిలిస్తే, వచ్చిన సొమ్ము కన్నా అధికంగా ఖర్చుపెట్టడంలో తెలుగుదేశం పార్టీ దేశంలోనే  మొదటి ప్లేస్ లో ఉంది. ఈ గణాంకాలు  ఏడీఆర్  నివేదిక అధికారికంగా వెల్లడించిన వాస్తవాలు.  2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ వ్యయ లెక్కల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది.

ఈ గణాంకాలు చూస్తుంటే.. పార్టీ నిర్వహణ కోసం, కార్యకర్తల శ్రేయస్సు కోసం తెలుగుదేశం ఎంతగా పరితపిస్తుందో  అవగతమౌతుందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ శ్రేణులకు బీమా కల్పించడంలో, ఆరోగ్య పరంగా వారు ఇబ్బందులు పడుతుంటే  ఆదుకోవడంలో దేశంలోని పార్టీలన్నిటి కంటే తెలుగుదేశం పార్టీ ముందుంటుందనడంలో సందేహం లేదనడానికి ఈ గణాంకాలే తిరుగులేని రుజువు.   దేశం మొత్తంలో పార్టీ కార్యకర్తలకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం. పార్టీ కార్యకర్తలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, రక్తదానం చేయడంలో  తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి ఆ పార్టీ కార్యకలాపాలను గమనిస్తే ఇట్టే అవగతమౌతుంది.  ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ఉదారంగా ముందుకు వస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తెలుగుదేశం సేవా కార్యక్రమాలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి అని పరిశీలకులు గణాంకాలతో, ఉదాహరణలతో వివరిస్తున్నారు.

అయితే.. అందుకు భిన్నంగా అధికారంలో ఉన్న  వైసీపీ పార్టీ నిర్మాణం, కార్యకర్తల శ్రేయస్సు విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న విమర్శలకు ఏడీఆర్ నివేదిక వెల్లడించిన వాస్తవాలు బలం చేకూరుస్తున్నాయి.  రాష్ట్రంలో విపత్తులు  సంభవించిన సందర్బాలలో, భారీ ఎత్తున అందిన విరాళాల సొమ్ము అందినప్పటికీ బాధితులను మానవతా దృక్పథంతో  ఆదుకోవడానికైనా వాటిని ఉపయోగించకపోవడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో విపక్ష తెలుగుదేశం పార్టీకి పార్టీ పరంగా అందిన విరాళాలు స్వల్పమే అయినా, ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే విరాళాల ద్వారా వచ్చిన సొమ్ము కంటే అధిక మొత్తం వ్యయం చేసి వారిని ఆదుకోవడానికి ముందుకు సాగడం ఇరు పార్టీల మధ్యా ఉన్న స్పష్టమైన తేడా ఏమిటన్నది తేటతెల్లం చేస్తొందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతసేపూ ముఖ్యనేతలు, ముఖ్యులు, పార్టీలో పైనున్న వారే నిధులను, పదవులను అనుభవిస్తారు కానీ.. దిగువ స్థాని శ్రేణుల సంక్షేమం, శ్రేయస్సును వైసీపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వైసీపీ క్యాడర్ నుంచే వెల్లువెత్తుతున్నాయి. 

2020-21లో దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలకు 529 కోట్ల 41 లక్షలు విరాళంగా  ఆదాయం సమకూరింది. ఈ మొత్తం ఆదాయం 2019-20  సంవత్సరంలో వచ్చిన 800 కోట్ల 26 లక్షలతో  పోల్చితే  34.96 శాతం తక్కువే. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి 37 కోట్ల 65 లక్షలు ఆదాయం విరాళంగా వస్తే.. 22 కోట్ల 34 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనించాలి. అంటే.. 40.66 శాతం ఆదాయాన్ని టీఆర్ఎస్ కూడా ఖర్చు చేయకుండా మిగుల్చుకుందన్నమాట. మరో పార్టీ ఎంఐఎంకు అదే ఏడాది కోటీ 62 లక్షల రూపాయల ఆదాయం వస్తే.. కేవలం 19 లక్షల 4 వేల రూపాయలే వినియోగించింది. దేశం మొత్తంలో అందిన విరాళాల్లో అధిక మొత్తాన్ని మిగుల్చుకున్న పార్టీల్లో వైసీపీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. బీజేడీ అయితే.. 90.44 శాతంతో రెండో ప్లేస్ లో, ఎంఐఎం 88.02 శాతం విరాళాల ఆదాయాన్ని మిగుల్చుకుని మూడో స్థానంలో ఉంది.

దేశంలోని 31 ప్రాంతీయ పార్టీలకు 376 కోట్ల, 86 లక్షలు స్వచ్ఛంద విరాళాల రూపంలో అందాయి. వాటిలో 250 కోట్ల 60 లక్షలు పార్టీలు ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కూడగట్టుకున్నవే కావడం గమనార్హం. ఈ బాండ్ల మొత్తం కేవలం ఐదు పార్టీలకే వెళ్లిందని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఎలక్టొరల్ బాండ్ల ఆదాయంలో కూడా వైసీపీయే ముందుంది. వైసీపీకి మొత్తం 96 కోట్ల 25 లక్షల రూపాయలు బాండ్ల రూపంలో అందింది. ఎలక్టొరల్ బాండ్ల ఆదాయం 80 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో డీఎంకే నిలిచింది. బీజేడీ అయితే.. 67 కోట్ల రూపాయల బాండ్ల ఆదాయంతో మూడోస్థానంలో ఉంది.

అటు విరాళంగా.. ఇటు ఎలక్టొరల్ బాండ్ల రూపంలో భారీ ఎత్తున వచ్చిన ఆదాయం నుంచి అంతే భారీ మొత్తంలో మిగుల్చుకున్న వైసీపీ ఆ సొమ్మంతా ఏం చేసింది? ఎందుకోసం ఆ నిధుల్ని దాచుకుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. దాచుకున్న విరాళాల సొమ్మంతా వచ్చే ఎన్నికల్లో విస్తారంగా వెదజల్లి   ఓట్లు కొల్లగొట్టేందుకు పథకం వేసిందా? అన్న ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు ఔననే సమాధానం చెబుతున్నారు. తనకు వచ్చిన ఆదాయం కన్నా అధికంగా ఖర్చు పెట్టిన టీడీపీ ఎక్కడ? వచ్చిన నిధుల్ని వచ్చినట్లే దాచేసుకున్న వైసీపీ తీరు ఎక్కడ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.