చంద్రబాబు పని మొదలెట్టేశారు!

ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు. రాష్ట్రంలో పల్నాడు ప్రాంతం సహా కొన్ని ప్రాంతాలు ఎన్నికల అనంతరం కూడా హింసాకాండతో అట్టుడుకుతుంటే, తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఉంటే వాటి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోర్టు అనుమతి తీసుకుని మరీ విదేశాలకు చెక్కేశారు. అలా చెక్కేసే ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తాను చేయకూడని పని కూడా చేశారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందిగా సీఎస్ ను ఆదేశించేశారు. సీఎస్ పరమ వీర విధేయత ప్రదర్శించి ఆ పని చేయడానికి రెడీ అయిపోయారు. ఆ ఆదేశాల అమలు కోసం డీబీటీ నిధులను మళ్లించేయడానికీ సిద్ధమైపోయారు.  అయితే ఆపద్ధర్మ  ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యతను విస్మరించారు. కానీ విపక్ష నేత అయిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో నెలకొన్నఉద్రిక్త పరిస్థితులు, పల్నాడులో దాడులపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ  రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు డిమాండ్ మేరకు  ఈసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాలపాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను  కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ  చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖతో  అదే విధంగా  ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌  కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.    ఇక  అమిత్ షా చెప్పిన జోస్యం నిజమై చంద్రబాబు జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన తాను చేస్తానన్న తొలి సంతకం, రెండో సంతకం విషయాలను పక్కన పెడితే.. గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యవస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి మహాయజ్ణం లాంటిదే చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉంది.  నాడు రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఐదేళ్ల జగన్ పాలన తరువాత జీరోకన్నా దిగువ నుంచి అంటే మైనస్ నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ప్రభుత్వ ఖజానా ఖాళీ, రాష్ట్రానికి రాజధాని లేదు. ఇప్పుడూ అదే పరిస్థితి.  అప్పట్లో ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. రెవెన్యూలోటుతో  ఆరంభమైన విభజిత రాష్ట్రాన్ని తన విజనరీతో సర్ ప్లస్ స్టేట్ గా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్టేట్ గా మార్చారు చంద్రబాబు. అంతేనా ఐదేళ్లలో ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు కావడంతో రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ హయంలో అమరావతి నిర్వీర్యమైంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు.  ఇప్పుడు రాష్ట్రం కరెంటు కొరతతో దాదాపు అంధకారబంధురంగా మారింది. ఎప్పుడు వస్తుందో తెలియని విద్యుత్ సరఫరా చేస్తూ జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది.  పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం కుదేలయ్యాయి. నిర్మాణ రంగం పడకేసింది. విద్యా వ్యవస్థ కుప్పకూలింది.   అమిత్ షా జోస్యం నిజమై చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9న ప్రమాణస్వీకారం చేపడితే ఆయన ముందున్న సమస్యలివి. మళ్లీ తొలి అడుగు నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. జన సంక్షేమ శ్రామికుడిగా, సంపద సృష్టికర్తగా చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే జనం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారని భావించాల్సి ఉంటుంది. 
Publish Date: May 18, 2024 5:47PM

బుజ్జగింపులు.. బెదిరింపులు.. ఇదీ మోడీ స్టైల్!

వయసు దగ్గర దగ్గర 75 సంవత్సరాలకు చేరువ అవుతోంది. అంతేకాకుండా ప్రధానమంత్రి హోదాలో కూడా వున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మిగతా రాజకీయ నాయకులను విమర్శించినట్టు ఘాటుగా విమర్శించాలంటే కొంత ఇబ్బందిగానే వుంటుంది. అందుకే పెద్దమనిషి వయసుకి, హోదాకి గౌరవం ఇస్తూ చాలా వినయంగా అసలు విషయాన్ని తెలియజేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికలలో 4 వందల పార్లమెంటు స్థానాలు గెలిచి ప్రధానమంత్రి పీఠం మీద మూడోసారి కూర్చోవాలని ఆశిస్తున్నారు. ఆయన అలా ఆశించడంలో తప్పులేదు.. జనం ఆశీస్సులతో అనుకున్నట్టు జరిగినా బాధ లేదు. కానీ, ఆయన ఎన్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి.  నరేంద్ర మోడీ నాయకత్వంలో వున్న బీజేపీ నాయకులు ముస్లింల విషయంలో ఎలా వ్యవహరిస్తారో మళ్ళీ ఇక్కడ ఉదహరించాల్సిన అవసరం లేదు. ముస్లిం ఓట్లు బీజేపీకి ఎంతమాత్రం పడవన్న విషయం కూడా ఎవరూ విస్మరించలేనిది. కొన్ని రాష్ట్రాల్లో పేద ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. దాని విషయంలో మోడీ గారి సహచరుడు అమిత్ షా తన పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని చెబుతున్నారు. సరే, అధికారం మళ్ళీ వస్తే వీళ్ళకు ఎలా చేయాలని అనిపిస్తే అలా చేస్తారు. దేశం ఆ నిర్ణయాన్ని ఇష్టం లేకపోయినా భరించక తప్పదు. ముస్లింల విషయంలో అలా వ్యవహరిస్తూనే ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం నాడు మోడీ గారు అద్భుతమైన కొన్ని మాటలు జనం మీదకి వదిలారు. ‘‘హిందు, ముస్లిం అని నేను విడదీయను. చిన్నప్పుడు ఈద్ కూడా జరుపుకునేవాడిని. పక్కింటి ముస్లింలు మాకు ఆహారం పెట్టేవారు’’ అని ప్రేమతో కూడిన మాటలు చెబుతున్నారు. గోధ్రా దుర్ఘటన సందర్భంగా గానీ, కేంద్రంలో అధికారంలోకి రావడానికి గానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గానీ, ఆయన పార్టీ వారుగానీ ముస్లింల విషయంలో చేసిన వ్యాఖ్యానాలు వారికి గుర్తుండక పోవచ్చుగానీ ముస్లింలు మరచిపోరు కదా. సరే, ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేస్తూ మోడీ గారు ఒక దారుణమైన మాట అన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరాన్ని వాళ్ళు కూల్చేస్తారట. ఇంతకంటే దారుణమైన స్టేట్‌మెంట్ మరొకటి వుంటుందా? ఇది మతం పేరుతో రాజకీయాలు చేయడం కాదా? ‘మోడీ’ అనే పేరును తిట్టినందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్నే రద్దు చేయించారు. మరి మతం పేరుతో రాజకీయ విమర్శలు చేసినందుకు ఏం చేయాలి? 
Publish Date: May 18, 2024 5:42PM

పల్నాడు కలెక్టర్ గా శ్రీ బాలాజీ లట్కర్ 

పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఈ సాయంత్రం లోగా తిరుపతి, పల్నాడు, అనంతరం జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా ప్రకటించనుంది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలిస్తున్న ఈసీ కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం పల్నాడులో జరిగిన హింసపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎస్‌, డీజీపీలకు కమీషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరినీ ఆదేశించింది. ఈ క్రమంలోనే కమిషన్ వారి స్థాయిలో కేసులను సమీక్షించింది. చట్ట ప్రకారం, మోడల్ ప్రవర్తనా నియమావళి వ్యవధిలో, దోషులపై ఛార్జిషీట్‌ను సకాలంలో దాఖలు చేయడంపై తగిన నిర్ణయం తీసుకునేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు ఆ ఘటనల నేపథ్యంలో ఇటివల పల్నాడు జిల్లా కలెక్టర్ సహా పలువురిపై చర్యలు తీసుకుంది.
Publish Date: May 18, 2024 4:35PM

జూన్ 9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. అమిత్ షా

సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది. కూటమి 145 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధిస్తుంది. అలాగే 23 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగుర వేస్తుంది. ఈ మేరకు ఆయన శనివారం చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. వచ్చే నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితరిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారంటూ ఆయన పేర్కొన్నారు. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం విజయం ఖాయమని పరిశీలకుల విశ్లేషణలూ,  షెడ్యూల్ విడుదలకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలూ ఇదే విషయాన్ని చెప్పినా.. అమిత్ షా ఇప్పుడు స్వయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదంటూ చేసిన ప్రకటన ఎక్కడో ఏ మూలో మిణుక్కుమిణుక్కు మంటూ ఉన్న వైసీపీ గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందనే చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, ఎన్నికల సంఘం తెలుగుదేశం ఆదేశాల మేరకు పని చేసిందన్న ప్రకటనల ద్వారా పరోక్షంగానైనా వైసీపీ పరాజయాన్ని అంగీకరించేశారు. ఇప్పుడిక ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తెలుగుదేశం కూటమి విజయంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ మిగలలేదని చెప్పవచ్చు. కేంద్రానికి అందునా కేంద్ర హోంమంత్రికి ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలో రాజకీయ గాలి ఎటువైపు ఉంది, ఆయా రాష్ట్రాలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అందుతూ ఉంటుంది. అందుకే  అమిత్ షా ప్రకటనతో ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్న భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది. 
Publish Date: May 18, 2024 4:29PM

అంతా కేసీఆర్ ఆత్రమే తప్ప, అటు నుంచి ఏమీ లేదు!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలవాలని, ఏపీ ఇంకా సర్వనాశనం అయిపోవాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లస్ ఆయన కుటుంబం కోరుకుంటూ వుంటారు. ఆ దిక్కుమాలిన కోరికేదో తమ మనసులోనే ఉంచుకోకుండా, ఎవరు అడిగినా ఏపీలో జగన్ గెలుస్తాడు అని సంబరపడిపోతూ చెబుతూ వుంటారు. జగన్ గెలవాలని వీళ్ళు మురిసిపోతూ కోరుకోవడమే తప్ప జగన్ గానీ, ఆయన పార్టీ వర్గీయులు గానీ, జగన్ మీడియా గానీ కేసీఆర్ విషయంలో ఎలాంటి ప్రేమాభిమానాలూ ప్రదర్శించడంలేదు. సాధారణంగా ఎక్కడైనా జరిగేది ఏమిటంటే... నేను నిన్ను పొగుడుతా.. నువ్వు నన్ను పొగుడు అనే స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం ఏపీలో జగన్ గెలుస్తాడు అని కేసీఆర్ కుటుంబం పదేపదే చెబుతున్నప్పడు, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని వైసీపీ వాళ్ళు ఒక్కరైనా చెప్పి చెల్లుకు చెల్లు చేసుకోవాలి కదా. అలాంటిదేమీ వైసీపీ వాళ్ళవైపు నుంచి లేదు. నువ్వు మా చెక్క భజన చేసుకుంటే చేసుకో.. మేం నీ ముఖం కూడా చూడం నువ్వు ఎలా చస్తే మాకేంటి అన్నట్టుగానే వాళ్ళ ధోరణి వుంది. మొన్నామధ్య ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వన్ టైమ్ బెన్‌ఫిట్ లాగా జగన్ ప్రభుత్వం నాగార్జున సాగర్ మీదకి ఏపీ పోలీసులను పంపి, తెలంగాణ ప్రజలను కేసీఆర్‌కి అనుకూలంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ, అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ అదరగొట్టేస్తాడు అని వైపీపీ వాళ్ళెవరూ చెప్పిన పాపన పోలేదు. అలా చెప్పకపోతే పోయారు.. కనీసం నెగటివ్‌గా అయినా చెప్పకుండా వుండొచ్చు కదా.. కానీ, ఆ దారుణం జరిగిపోయింది. వైసీపీ ఆస్థాన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో కొంతసేపు తన సుత్తి కొడుతూ వుంటారు. ‘జగన్ సాక్షాత్తూ దేవుడు’ అనే మాట అనరు తప్ప, ఆయన చేసే జగన్ భజన ఆ రేంజ్‌లోనే వుంటుంది. అలాంటి ఆయన శనివారం నాడు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి మీద సుదీర్ఘ సుత్తి కొట్టారు. అటు తిప్పీ ఇటు తిప్పీ ఆయన తేల్చింది ఏమిటంటే, పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్‌కి అంత సీన్ లేదు. అసలు పోటీ అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్యలో వుంది. కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ఆటలో అరటిపండ్ల మాదిరిగా మిగిలిపోయారు. ఈ ఐదేళ్ళూ కేసీఆర్ జనంలో వుండి, జనం నమ్మకాన్ని గెలుచుకుంటే తప్ప వచ్చే ఎన్నికలకు మిగులతారు. లేకపోతే అడ్రస్ లేకుండా పోతారు. సర్వనాశనం అయిపోతారు... అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఖర్మరా బాబూ.... పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
Publish Date: May 18, 2024 3:56PM