రేడియేషన్ను రెడి చేస్తున్నారా??
Publish Date:Nov 9, 2021
Advertisement
మరో ప్రపంచం మరో ప్రపంచం అనే కవితా వాక్యాలు శ్రీశ్రీ గారు రాసిన కారణం వేరు కావచ్చు. దాని ఆంతర్యం వేరు కావచ్చు కానీ ప్రపంచం మొత్తం అభివృద్ధితో గత వందేళ్లకు ఇప్పటికి చెప్పలేనంత మార్పుకు లోనయ్యింది. నిజానికి అప్పటికి ఇప్పటికి తరచి చూస్తే నిజంగా ఇది మరో ప్రపంచంలాగే ఉంది. అయితే ఏంటంటా?? అని మీకు అనిపించవచ్చేమో. ఈ మార్పులో సాంకేతికత ఎంతటి ప్రాధాన్యత సంతరించుకున్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గత దశాబ్దం ఉహించన్నత మార్పులకు లోనయ్యింది. ఈ మార్పులో ముఖ్యమైన పాత్ర స్మార్ట్ ఫోన్, లాప్టాప్ మొదలైన టెక్నాలజీ పరంపరదే మొదటి అడుగు అని ఒప్పేసుకోవచ్చు కూడా. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్, సిస్టం వంటివి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చేసాయి. అవి ఎలా అయితే అందెశ్రీ చేతుల్లోకి వచ్చేసాయో పర్యావరణం కూడా అంతే సులువుగా సర్వనాశనం అయిపోతోందన్నది ఒప్పుకోవలసిన వాస్తవం. రజినీకాంత్ గారు రోబో 2.0 అంటూ రేడియేషన్ గురించి, దాని ఫలితంగా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికే సినిమా పరంగా ప్రజలకు చెప్పేసారు. కానీ ఈరోజు అంటే నవంబర్ 8 ని ప్రపంచ రేడియోలజీ దినోత్సవంగా గుర్తించి రేడియాలజీ గురించి కాసింత అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం. మొబైల్ ఫోన్ వాడినంత సులువుగా ఈ పర్యావరణాన్ని తిరిగి నిర్మించుకోలేము. పుట్టగొడుగుల్లా లేస్తున్న సెల్ ఫోన్ టవర్లు, ఇరవై నాలుగు గంటలు ఇష్టానుసారం వాడేస్తున్న మొబైల్ ఫోన్ వల్ల విడుదల అయ్యే రేడియేషన్ వల్ల ఎన్నో పక్షి జాతులు అంతరించి పోతున్నాయేది వాస్తవం. ఒక మనిషికి స్కానింగ్ తీయడం వల్ల ఆ x-ray కిరణాలు శరీరం మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎక్కువ సార్లు స్కానింగ్ తీయించుకోకూడదు అని చెబుతుంటారు. ముఖ్యంగా గర్భిణీలకు స్కానింగ్ ఎక్కువ తీయకూడదు ఎందుకంటే కడుపులో శిశువు ఎంతో సున్నితం కాబట్టి ఆ కిరణాల ప్రభావం వల్ల కూడా పుట్టుకలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. పక్షులు కూడా అలాంటి సున్నితమైన జీవాలే అనే విషయం పెద్దగా పట్టించుకొము. ఇన్ని కోట్ల మంది నిరంతరం సాంకేతికత పేరుతో ఉపయోగిస్తున్న మొబైల్ వల్ల విడుదల అయ్యే రేడియేషన్ ద్వారా పక్షులు ఎంత బాధ అనుభవిస్తాయో ఒక నిమిషం ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే ఈ ప్రపంచ రేడియాలజీ దినోత్సవ సందర్భంగా కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటే మనం కొన్ని ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము. 1● ఇప్పుడు అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నది మొబైల్ ఏ. కాబట్టి అవసరాన్ని ఆలోచించుకుని మొబైల్ ఫోన్ వినియోగించడం ఉత్తమం. వీలైనంత వరకు నేరుగా కలుసుకుని మాట్లాడుకోవడం మంచిది. దీనివల్ల ఈ రేడియేషన్ గోల తప్పడమే కాదు మనుషుల మధ్య బంధాలు ఎంతో గట్టిగా తయారవుతాయి. 2● వీడియో గేమ్ లు, నెట్ కాల్స్, టైం పాస్ చాటింగ్ వంటివి తగ్గించుకుంటే మీ సమయం ఆదా అవ్వడమే కాదు ఖర్చు కూడా తక్కువే అవుతుంది. 3● రాత్రిపూట పడుకునే ముందు నెట్ ఆఫ్ చేయడం, లేదా వీలున్నవాళ్ళు మొబైల్ ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల మొబైల్ ఛార్జింగ్ అయిపోదు, నెట్ వేస్ట్ కాదు, ఇంట్లో ఎలక్ట్రిక్ ఆదా చేసినట్టు. అన్నిటికి మించి ఎలాంటి డిస్టర్బ్ లేకుంటే హాయిగా నిద్రపోవచ్చు. 4● జీవితాన్ని మీరు చేసే పనులను కాసింత సీరియస్ గా తీసుకుంటే అర్థమవుతుంది సోషల్ మీడియా ద్వారా ఓనగూరే ప్రయోజనాలు ఏమిటో. నిజానికి సోషల్ మీడియా లో పనికొచ్చే వాటికంటే వ్యర్థమైన విషయాలే ఎక్కువ. మరొకరి జీవితాల్లోకి తొంగిచూసి వాటిని బేరీజు వేయడం, చర్చ చేయడం వంటివే ఎక్కువ. వీటివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అనేది ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది అనవసర వృథా ఎక్కడ చేస్తున్నారు అని. అది తెలిస్తే తప్పకుండా మొబైల్ వాడకం, సిస్టం వాడకం వంటివి అదుపులో ఉంచుకుంటారు. కాబట్టి పైన చెప్పుకున్న విషయాల గురించి కాసింత ఆలోచన చేసి దేనికోసం ఎందుకోసం మనం ఈ టెక్నాలజీని ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకుంటే మనమే కాదు ఈ పర్యావరణం కూడా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఈ పర్యావరణం బాగుంటేనే మనం ఇంకా బాగుంటాం. అందుకె రేడియేషన్ కు రెస్ట్ ఇద్దాం. ◆ వెంకటేష్ పువ్వాడ
http://www.teluguone.com/news/content/radiation-from-towers-35-126052.html