రేడియేషన్‌ను రెడి చేస్తున్నారా??

Publish Date:Nov 9, 2021

Advertisement

మరో ప్రపంచం మరో ప్రపంచం అనే కవితా వాక్యాలు శ్రీశ్రీ గారు రాసిన కారణం వేరు కావచ్చు. దాని ఆంతర్యం వేరు కావచ్చు కానీ ప్రపంచం మొత్తం అభివృద్ధితో గత వందేళ్లకు ఇప్పటికి చెప్పలేనంత మార్పుకు లోనయ్యింది. నిజానికి అప్పటికి ఇప్పటికి తరచి చూస్తే నిజంగా ఇది మరో ప్రపంచంలాగే ఉంది. అయితే ఏంటంటా?? అని మీకు అనిపించవచ్చేమో.

ఈ మార్పులో సాంకేతికత ఎంతటి ప్రాధాన్యత సంతరించుకున్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గత దశాబ్దం ఉహించన్నత మార్పులకు లోనయ్యింది. ఈ మార్పులో ముఖ్యమైన పాత్ర స్మార్ట్ ఫోన్, లాప్టాప్ మొదలైన టెక్నాలజీ పరంపరదే మొదటి అడుగు అని ఒప్పేసుకోవచ్చు కూడా. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్, సిస్టం వంటివి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చేసాయి. అవి ఎలా అయితే అందెశ్రీ చేతుల్లోకి వచ్చేసాయో పర్యావరణం కూడా అంతే సులువుగా సర్వనాశనం అయిపోతోందన్నది ఒప్పుకోవలసిన వాస్తవం. 

రజినీకాంత్ గారు రోబో 2.0 అంటూ రేడియేషన్ గురించి, దాని ఫలితంగా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికే సినిమా పరంగా ప్రజలకు చెప్పేసారు. కానీ ఈరోజు అంటే నవంబర్ 8 ని ప్రపంచ రేడియోలజీ దినోత్సవంగా గుర్తించి రేడియాలజీ గురించి కాసింత అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం. 

మొబైల్ ఫోన్ వాడినంత సులువుగా ఈ పర్యావరణాన్ని తిరిగి నిర్మించుకోలేము. పుట్టగొడుగుల్లా లేస్తున్న సెల్ ఫోన్ టవర్లు, ఇరవై నాలుగు గంటలు ఇష్టానుసారం వాడేస్తున్న మొబైల్ ఫోన్ వల్ల విడుదల అయ్యే రేడియేషన్ వల్ల ఎన్నో పక్షి జాతులు అంతరించి పోతున్నాయేది వాస్తవం. ఒక మనిషికి స్కానింగ్ తీయడం వల్ల ఆ x-ray కిరణాలు శరీరం మీద  ఎంతో ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎక్కువ సార్లు స్కానింగ్ తీయించుకోకూడదు అని చెబుతుంటారు. ముఖ్యంగా గర్భిణీలకు స్కానింగ్ ఎక్కువ తీయకూడదు ఎందుకంటే కడుపులో శిశువు ఎంతో సున్నితం కాబట్టి ఆ కిరణాల ప్రభావం వల్ల  కూడా పుట్టుకలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. పక్షులు కూడా అలాంటి సున్నితమైన జీవాలే అనే విషయం పెద్దగా పట్టించుకొము. ఇన్ని కోట్ల మంది నిరంతరం సాంకేతికత పేరుతో ఉపయోగిస్తున్న మొబైల్ వల్ల విడుదల అయ్యే రేడియేషన్ ద్వారా పక్షులు ఎంత బాధ అనుభవిస్తాయో ఒక నిమిషం ఆలోచిస్తే అర్థమవుతుంది.

అందుకే ఈ ప్రపంచ రేడియాలజీ దినోత్సవ సందర్భంగా కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటే మనం కొన్ని ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము.

1● ఇప్పుడు అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నది మొబైల్ ఏ. కాబట్టి అవసరాన్ని ఆలోచించుకుని మొబైల్ ఫోన్ వినియోగించడం ఉత్తమం. వీలైనంత వరకు నేరుగా కలుసుకుని మాట్లాడుకోవడం మంచిది. దీనివల్ల ఈ రేడియేషన్ గోల తప్పడమే కాదు మనుషుల మధ్య బంధాలు ఎంతో గట్టిగా తయారవుతాయి.

2● వీడియో గేమ్ లు, నెట్ కాల్స్, టైం పాస్ చాటింగ్ వంటివి తగ్గించుకుంటే మీ సమయం ఆదా అవ్వడమే కాదు ఖర్చు కూడా తక్కువే అవుతుంది.

3● రాత్రిపూట పడుకునే ముందు నెట్ ఆఫ్ చేయడం, లేదా వీలున్నవాళ్ళు మొబైల్ ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల మొబైల్ ఛార్జింగ్ అయిపోదు, నెట్ వేస్ట్ కాదు, ఇంట్లో ఎలక్ట్రిక్ ఆదా చేసినట్టు. అన్నిటికి మించి ఎలాంటి డిస్టర్బ్ లేకుంటే హాయిగా నిద్రపోవచ్చు.

4● జీవితాన్ని మీరు చేసే పనులను కాసింత సీరియస్ గా తీసుకుంటే అర్థమవుతుంది సోషల్ మీడియా ద్వారా ఓనగూరే ప్రయోజనాలు ఏమిటో. నిజానికి సోషల్  మీడియా లో పనికొచ్చే వాటికంటే వ్యర్థమైన విషయాలే ఎక్కువ. మరొకరి జీవితాల్లోకి తొంగిచూసి వాటిని బేరీజు వేయడం, చర్చ చేయడం వంటివే ఎక్కువ. వీటివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అనేది ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది అనవసర వృథా ఎక్కడ చేస్తున్నారు అని. అది తెలిస్తే తప్పకుండా మొబైల్ వాడకం, సిస్టం వాడకం వంటివి అదుపులో ఉంచుకుంటారు.

కాబట్టి పైన చెప్పుకున్న విషయాల గురించి కాసింత ఆలోచన చేసి దేనికోసం ఎందుకోసం మనం ఈ టెక్నాలజీని ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకుంటే మనమే కాదు ఈ పర్యావరణం కూడా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఈ పర్యావరణం బాగుంటేనే మనం ఇంకా బాగుంటాం. అందుకె రేడియేషన్ కు రెస్ట్ ఇద్దాం.

◆ వెంకటేష్ పువ్వాడ
 

By
en-us Political News

  
భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా..
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా..
స్మార్ట్‌ఫోన్‌లు,  ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు  జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది.
పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం, బంధువులకు దూరంగా.. కొత్త జంట ఒకరినొకరు తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన సమయం పొందుతారు....
ఇంజనీర్, సామాజిక కార్యకర్త, రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి, సామాజిక సమస్యలపై మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు. భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి...
సినిమాల్లోని సూపర్‌హీరోల మాదిరిగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంతర్నిర్మితమై ఉంటుంది.
జీవితంలో బంధాలు చాలా అపురూపమైనవి.
మహాభారతంలో విదురుడు చాలా గొప్పవాడు.
పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం.
ఆత్మవిశ్వాసంతో కొండను పిండి చేయవచ్చుననడానికి   దశరథ్ మంజీ సజీవ సాక్ష్యం.
టెడ్డీ బేర్స్ చిన్నపిల్లల నుండి  అమ్మాయిల వరకు అందరూ ఇష్టపడతారు.
వాలెంటైన్స్ డే అంటే యువతకు చాలా ప్రత్యేకం. ఈ వారాంతం మొత్తం బోలెడు చాక్లెట్లు, గులాబీలు, గిఫ్టులు అమ్ముడుపోతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.