'పుష్ప' అంటే పవర్ అనుకుంటివా...

Publish Date:Jan 26, 2022

Advertisement

ప్రజలు... నమ్మి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఏం చేయాలి.. వారి ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. అదే ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి ప్లస్ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వస్తే.. ఏం చేయాలి.. రాష్ట్రానికి ఏం చేసినా.. చేయకపోయినా... కనీసం నియోజకవర్గ ప్రజలకైనా అంతో... ఇంతో... ఎంతో కొంత చేయాలి... చేసి తీరాలి. ఇది కనీస ధర్మం. 

అయితే విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాత్రం ఈ కనీస ధర్మాన్ని సైతం విస్మరించారనే టాక్ వినిపిస్తోందీ. విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యేగా, గిరిజన శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి ఆమె బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయింది. కానీ ఈ సదరు ప్రజా ప్రతినిధి వల్ల గిరి పుత్రులకు ఏమైనా మంచి జరిగిందా?.. వారి సమస్యలు ఏమైనా పరిష్కరమైయాయా అంటే .. మాత్రం ఆలోచించాల్సిందేనంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సమస్యలు... నేటికి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని వారు వాపోతున్నారు. 

కురుపాం నియోజకవర్గంలో దాదాపు అన్ని రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని.. దశాబ్దాలుగా పూర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం ఇప్పటికీ నోచుకోలేదని... దీంతో 60 కిలోమీటర్ల మేర చుట్టు తిరిగి ప్రయాణించాల్సి వస్తుందంటున్నారు. దాదాపు 30 కొండ ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వీటి కోసం ఎన్నో సార్లు మంత్రి పుష్పకు అర్జీలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని వారు గుర్తు చేస్తున్నారు. ఓ వేళ రహదారులు వేసిన అవి నాసిరకంగా ఉండడంతో అవి కొద్ది రోజులకే కొట్టుకుపోతున్నాయని వారంటున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ ఉన్నా లేనట్లే అన్న చందంగా తయారైందనీ వారు పేర్కొంటున్నారు.    

ఇక కురుపాం నియోజకవర్గంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేశాయని.. అందుకు మెండింకల్, నీలకంఠపురం, రామభద్రపురంలోని ఆసుపత్రులే ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు అందక చాలా మంది గిరిపుత్రులు ప్రాణాలు విడుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక గర్బిణులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారంటున్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి సొంత ఊరు చినమేరంగిలో అయితే మద్యం ఏరులై పారుతోందని.. ఈ గ్రామంలో ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి నాటు సారా, బెల్లం ఊటను స్వాధీనం చేసుకోవడం నిత్యకృత్యమైపోయిందని.....ఒక్క నెలలోనే మంత్రిగారి స్వగ్రామంలో 70కిపైగా నాటు సారా కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని వారు చెబుతున్నారు.  

మరో వైపు గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ భూముల వ్యవహారంలో బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని.. ఇక ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యామ్‌లు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయని.. దీంతో పలు మండలాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. అయితే గత మూడేళ్లుగా ఏనుగుల గుంపు దాడితో.. వేలాది ఎకరాలకు పంట నష్టం వాటిల్లుతోందని.. డిప్యూటీ సీఎం పుష్పను ఎన్ని సార్లు కలిసి విన్నవించుకున్న పలితం లేకుండా పోయిందని తెలుస్తోందీ. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు ఆమె ఎంతో చేయవచ్చునని కురుపాం ప్రజలు పేర్కొంటున్నారు. అయినా మనస్సుంటే మార్గముంటుందీ.. కానీ మంత్రి పుష్ప శ్రీవాణికి మనస్సు లేదా?.. లేక ప్రజలకు మంచి చేయడానికి ఆమెకు మనస్సు రావడం లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. పుష్ప అంటే పవర్ అనుకుంటివా.. కాదు.. పేరుకే డిప్యూటీ సీఎం పుష్ప.. ఆమెకు పవర్ లేదని కురుపాం ప్రజలు పుష్ప సినిమాలో డైలాగ్‌లను సైటైరికల్‌గా పేలుస్తున్నారు.
 

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.
భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది.
చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది
హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.
రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్.
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.