లాక్‌డౌన్ టైమ్‌లో పీఎంవోలో పార్టీలు.. పార్ల‌మెంట్‌లో క్షమాపణలు చెప్పిన ప్ర‌ధాని..

Publish Date:Dec 9, 2021

Advertisement

ఏడాది కింద‌టి విష‌యం. దేశ‌మంతా లాక్‌డౌన్‌. ప్ర‌జ‌ల‌పై క‌ఠిన ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్నాయి. ఎలాంటి పండుగ‌లూ, వేడుక‌లూ జ‌ర‌ప‌వ‌ద్ద‌ని ఆదేశాలు ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే.. జ‌రిమానాలు వేస్తామ‌నే హెచ్చ‌రికలు జారీ అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా ఇంత‌టి క‌ఠిన నిబంధ‌న‌లు విధించిన దేశ ప్ర‌ధాని కొలువుదీరి ఉన్న పీఎంవో ఆఫీసులోనే లాక్‌డౌన్ స‌మ‌యంలో గ్రాండ్ పార్టీలు జ‌రిగితే..? విందు, వినోదం.. ఆట‌, పాట‌ల‌తో ప్ర‌ధాని కార్యాల‌య సిబ్బంది సంబ‌రాలు చేసుకుంటే..? అంత‌కంటే దారునం ఇంకేమైనా ఉంటుందా? ఆంక్ష‌లు విధించిన పాల‌కుల స‌న్నిధిలోనే అధికారులు అలా పార్టీలు చేసుకోవ‌డం ఏమ‌న్నా సమంజ‌స‌మా? అందుకు దేశ ప్ర‌ధాని జాతికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌ప్పు చేసిన అధికారుల‌పై వేటు వేశారు. ఈ విష‌యం బ్రిట‌న్‌లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌.

కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతా నిషేధాజ్ఞలు అమలు చేసిన బ్రిటన్‌లో ప్రధాని కార్యాలయ సిబ్బందే వాటిని ఉల్లంఘించి విందులు, వినోదాలు జరుపుకున్నారు. లాక్‌డౌన్‌పై జోకులు వేసుకున్నారు. దేశ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్న‌ సమయంలో వారు చేసిన నిర్వాకం ఏడాది తర్వాత తాజాగా వెలుగు చూసింది. ఆ వీడియో దృశ్యాలు లీకవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంటులో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పీఎంవో లో జ‌రిగిన పార్టీపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. 2020 డిసెంబరు 18న ప్రధాని కార్యాలయ సిబ్బంది లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా విస్మరించి క్రిస్మస్‌ పార్టీ జరుపుకున్నారు. విందుతో పాటు ఆటలు, పాటలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. క‌ట్ చేస్తే.. నాలుగు రోజుల త‌ర్వాత ప్రధాని కార్యాలయ సిబ్బంది తాము చేసుకున్న పార్టీని గుర్తు చేసుకుని జోకులు వేసుకున్నారు. తెగ న‌వ్వుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు లీక్ కావ‌డంతో ఏడాది త‌ర్వాత విష‌యం వెలుగు చూసింది.

ప్రభుత్వ ప్రెస్‌ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్‌ పరిహాసపు మాటలు వీడియోలో స్పష్టంగా రికార్డ‌య్యాయి. మరో అధికారి జ‌ర్న‌లిస్ట్‌లా యాక్ట్ చేస్తూ.. క్రిస్మస్‌ పార్టీ గురించి ప్రెస్ సెక్రెట‌రీని ప్రశ్నిస్తూ కామెడీ స్కిట్ చేసిన‌ట్టు ఆ వీడియోలో ఉంది. 

ఈ వ్యవహారంపై విపక్ష లేబర్‌ పార్టీ నేత స్టార్మర్‌.. ప్రధాని జాన్సన్‌ను నిలదీశారు. దీంతో పార్ల‌మెంట్‌లో బోరిస్‌ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత.. లీకైన వీడియోలో కనిపించిన ప్రెస్‌ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్‌ తన పదవికి రాజీనామా చేశారు.   

By
en-us Political News

  
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఖిల భారత సర్వీసులలో నియామకాల  కోసం ప్రతి  యేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యానికి రాకుండా..తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని...ఈ ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎక్క‌డా అభివృద్ది జ‌ర‌గ‌లేదు అంతా శూన్యమ‌ని టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ది కేశినేని శివ‌నాథ్ సోద‌రి కేశినేని శ్రీదేవి అన్నారు.
తెలంగాణలో ముక్కోడిని  ఇంటికి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్‌లో తిక్కోడు కూడా ఇంటికి పోతాడు
పదేళ్ల పాటు తెలంగాణలో  చక్రం తిప్పిన బిఆర్ఎస్  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ఇల్లు లేదా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. ఓటమి నుంచి తేరుకోకమునుపే కూతురు కవిత తీహార్ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెట్టడం కెసీఆర్ ను కలచివేసింది.
ఒక్క ఛాన్స్ అంటూ మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మాట త‌ప్పాడు. ఐదేళ్ల‌లో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో మ‌ధ్య‌పాన నిషేధం చేస్తాన్న జ‌గ‌న్ ఆ మాట మ‌ర్చిపోయాడు. ఇచ్చిన మాట‌ను తప్పిన జ‌గ‌న్ కి నైతికంగా ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే హ‌క్కులేద‌ని తెలుగుదేశం విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ అన్నారు.
గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన మాజీ సి ఎం  కెసీఆర్ కూతురు కవితకు బెయిల్ ఇప్పట్లో లభించేలా లేదు.
అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో
సికింద్రాబాబ్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.  ఈ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లింక్ ను ఓపెన్ చేయాలి.
వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కూడా జగన్ సర్కార్ విపక్ష నేతలపై ఉన్న కేసుల వివరాలను అందజేయకుండా వేధిస్తున్న నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించారు.
జనసేన పార్టీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ పార్టీకే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ సెక్యులర్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.