మండే నుంచి శీతాకాల మంటలు.. ఏపీ ఎంపీలు ఏం చేస్తారో?

Publish Date:Nov 27, 2021

Advertisement

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల (నవంబర్) 29 న ప్రారంభమవుతాయి. సుమారు పక్షం రోజులకు పైగా జరిగే సమావేశాలు, ఒక విధంగా ప్రభుత్వానికి చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోందని రాజీకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక అధికార ప్రతిపక్షలు రెండూ కూడా అస్త్ర శస్త్రాలతో యుద్దానికి సిద్ధమవుతున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గడచిన ఏడేళ్ళలో, తొలి సారిగా ప్రతిపక్షాల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కుంటున్న సమయంలో జరుగుతున్న శీతాకాల సమావేశాలు గతానికి భిన్నంగా, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా ఉంటాయని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత వరకు ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజాకర్షక శక్తి ముందు రాహుల్ గాంధీ సహ ప్రతిపక్ష నేతలు ఎవరు నిలవలేక పోయారు. అలాగే, ప్రజల మద్దతు దండిగా ఉందన్న భరోసాతో, విపక్షాలను  అధికార కూటమి పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా ప్రతిపక్షాన్ని అధికార కూటమి బేఖాతరు చేసింది. 

కానీ  ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కొవిడ్ నేపధ్యంగా తలెత్తిన సమస్యలు, ముఖ్యంగా  ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, వంటి సమస్యల కారణంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ గ్రాఫ్ కూడా నేల చూపులు చూస్తోంది. గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలన తగ్గించడం మొదలు కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. అయితే, గతంలో ఎప్పుడు లేని విధంగా, ధరల పెరుగుదల, వ్యవసాయ ఉత్పాతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)వంటి కీలక సమస్యల విషయంలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. మరో వంక  విపక్షాలు,ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సభ లోపలే కాకుండా, సభవెలుపల కూడా ఆందోళనకు సిద్దమవుతున్నాయి. 

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, విపక్ష కూటమి నాయకత్వం విషయంలో మమతా బెనర్జీ  తృణమూల్ కాంగ్రెస్ నుంచి వస్తున్న పోటీని ఎదుర్కునేందుకు, పెద్దన్న పాత్రను నిలుపుకునేందుకు, ప్రజాందోళనకు కూడా సిద్దమవుతోంది.ఇందులో భాగంగా     పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే, పెరుగుతున్న ధరలను నిరసిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు డిసెంబర్ 12న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.ఈ ర్యాలీలో భాగంగా ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట్లాడతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
అదలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున వివిధ పార్టీలకు చెందిన విపక్ష నేతలు దిల్లీలో సమావేశం కానున్నారు. పార్లమెంట్లో ఏకతాటిపై ఉండటం, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ, రాజ్యసభలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. లేఖ రాశారు. కీలకమైన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని సూచించారు. 

ఇదలా ఉంటే, మూడు సాగు చట్టాల రద్దుకు సంబంధించి కేంద్రం తదుపరి ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో.. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజున  బీజేపీ  ఎంపీలందరూ లోక్‌సభకు హాజరుకావాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. రాజ్యసభ ఎంపీలకు దీనిపై ఇప్పటికే విప్‌ జారీ అయ్యింది.
ఈసారి సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదానికి 26 బిల్లులు ఎదురుచూస్తున్నాయి. అందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఒకటి. దాంతో పాటు వివాదాస్పద క్రిప్టో కరెన్సీ బిల్లు, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం వాటాను 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.కేంద్రం గత ఏడాది వర్షాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. వాటిపై పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వారు చేపట్టిన నిరసనల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. కొద్ది రోజుల క్రితం సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, చట్టాల రద్దుతో సంతృప్తి చెందని సంఘాలు ఎం ఎస్ పీచట్టం, కేసుల ఉపసంహరణ వంటి కొత్త డిమాండ్లతో ఆందోళన కొనసాగించేందుకు నిరంయించాయి. సహజంగానే రైతుల కొత్త డిమాండ్స్’కు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలు వాటి అమలుకు పట్టు పట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దానికింద పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగమవుతారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా రైతులు నిరసనలు కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. వారంతా తమ ఆందోళనను విరమించుకొని ఇంటికి వెళ్లాలని కోరుతున్నానని తోమర్ మీడియాతో వెల్లడించారు. మరోపక్క నిరసనల్లో భాగంగా రైతులపై పెట్టిన కేసులు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని మంత్రి అన్నారు. వాటి ఉపసంహరణపై రాష్ట్రాలదే నిర్ణయమన్నారు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదటి రోజునుంచే సభలో ఉష్ణోగ్రతలు భాగ్గుమందం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయద జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.