మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ

Publish Date:Aug 8, 2022

Advertisement

మత సామరస్యానికి ప్రతీక. ఈ పండగ నెల్లూరులో అత్యంత వైభవంగా జరుగుతోంది. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయి. అలాగే మరికొన్ని వేడుకలు కొంత మంది మాత్రమే జరుపుకొంటారు.  నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండుగకు నెల్లూరుకే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చింది. ఈ పండుగకు   దేశం నలుమూలల నుంచే కాదు.. ఇతర దేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. గతంలో ఈ పండగ  మూడ్రోజులు మాత్రమే జరిగేది.

  కోరిన కోర్కెలు తీర్చే.. సంబరాల రొట్టెల పండుగ ప్రతి ఏటా మొహర్రం నెల ప్రారంభమయిన తర్వాత వచ్చే పదకొండో రోజు నుంచి మూడ్రోజుల పాటు జరుగుతోంది. ఈ పండుగ వెనుక ఘనమైన చారిత్రక నేపథ్యమే ఉంది. ఈ పండగకు మూడొందల అరవై సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. 1651లో సౌదీలోని మక్కా  షరీఫ్ నుంచి పన్నెండు మంది వీరులు సంచరిస్తూ భారత దేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటక ప్రాంతాన్ని హైదర్ ఆలీ పరిపాలిస్తున్నారు. అదే సమయంలో నెల్లూరు ప్రాంతంలో నవాబుల పాలన ఉండేది. సరిగ్గా అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో మత విబేధాలు రాజుకున్నాయి. తమిళనాడులో వాలాజా రాజులపై దండెత్తేందుకు బీజాపూరు సైన్యం బయల్దేరింది. వారితోపాటే ప్రచారానికి వచ్చిన మక్కావీరుల బృందం సైతం వారితో అడుగులు కలిపింది. వాలాజాకు గుర్రాలపై నెల్లూరు మీదుగా వెళ్తుండగా.. కొడవలూరు మండలం గండవరం వద్ద తమిళనాడు సైన్యం ఎదురైంది. దీంతో రెండు వర్గాల మధ్య హోరాహోరీ యుద్దం జరిగింది.

ఈ కదనరంగంలో ఆ పన్నెండు మంది వీరుల తలలు గండ వరంలో నేలరాలాయి. మొండాలు మాత్రం గుర్రాలపైనే నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరినట్లు చరిత్ర చెబుతోంది. బారా అంటే పన్నెండు... షహీద్ అంటే అల్లా ధ్యాసలో సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసి అమరులైన వారని అర్థం. అయితే ఆ స్వర్ణాల చెరువు వద్ద నిత్యం దుస్తులు ఉతికే ఒక  రజక దంపతులకు ఓ రోజు రాత్రి కలలో ఈ మృత వీరులు కన్పించారట. అప్పటికి నెల్లూరును పాలిస్తున్న ఆర్కట్ రాజు భార్య అనారోగ్యంతో ఉందని... మా శవాలు కలిసిన ప్రాంతంలోని మట్టిని తీసుకెళ్లి ఆమెకు బొట్టు పెడితే రాజు భార్య అనారోగ్యం తగ్గుతుందని కలలో కనిపించి చెప్పారట. ఈ విషయాన్ని రాజభటుల ద్వారా రాజుకు వారు తెలియజేశారు.

దీనిపై రాజు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ కొద్ది రోజులకే ఆమె అనారోగ్యం తగ్గిపోయిందని సమాచారం. దీంతో రాజు, రాణి ఇద్దరూ ఈ చెరువు దగ్గరకొచ్చి మత ప్రచారకులు మట్టిలో కలిసిన చోట దర్గాలు కట్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలా పూజలు  చేసేందుకు వచ్చేటప్పుడు తమతోపాటు తెచ్చుకున్న రొట్టెలను అక్కడే తిని, మిగిలిన వాటిని అక్కడి వారికి పంచేవారట. అలా అలా.. చెరువు దగ్గర రొట్టెలు తినటం, పక్కవారికి ఇవ్వటం ద్వారా రొట్టెల పండుగ జరుగుతోంది.

అలాగే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే.. ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతం నుంచి ప్రయాణించే యాత్రికులు ఇక్కడ కాసేపు కూర్చుని సేద తీరేవారట. వారు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను చెరువు దగ్గర తిని, చెరువులోని నీళ్లు తాగి వెళ్లేవారట. అలా దర్గా దగ్గర రొట్టెలు తిని, చెరువులో నీళ్లు తాగితే శుభం జరిగేదని.. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత చేకూరేదని భక్తుల్లో ఓ విధమైన నమ్మకం కల్గింది. అలా దర్గాకు ప్రాచుర్యం జరిగిన కొన్నాళ్లకు నెల్లూరు జిల్లా ఆర్కాట్ నవాబుల పాలన కిందకు వచ్చింది. ఓసారి నవాబు తన భార్య బేగంతో కలిసి ఉదయగిరికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు బారా షహీద్ దర్గా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో నవాబు భార్య కాలు తట్టుకుని కింద పడ్డారు. తర్వాత అక్కడ్నుంచి తమ రాజధానికి వెళ్లారు.

కొన్నాళ్లకు నవాబు భార్యకు జబ్బు  చేసి మంచాన పడింది. ఎంతకీ నయం కాలేదు. బేగం కాలు తట్టుకుని కింద పడిన చోట పన్నెండు సమాధులున్నాయని, ఆ ప్రదేశాన్ని తవ్వించి అభివృద్ది చేస్తే జబ్బు తగ్గుతుందని ఓ దివ్యమూర్తి కలలోకి వచ్చి నవాబుకు చెప్పిందట. దీంతో వెంటనే ఆయన సమాధులను వెలికి తీసి, దర్గాను నిర్మించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు బేగం వ్యాధి పూర్తిగా నయమైపోయింది. దర్గా ప్రాశస్త్రం అనతి కాలంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. మొక్కులపై ఇక్కడకు వచ్చే వారి సంఖ్య ఎక్కువైంది. దర్గాలో అమర వీరుల సమాధులను దర్శించుకుని, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్ని భుజించి నెల్లూరు చెరువు (స్వర్ణాల చెరువు) లో నీళ్లు తాగేవారు. రొట్టెల రూపంలో ఎలాంటి కోర్కెలైనా నెరవేరుతున్నాయన్న ప్రచారం వ్యాపించింది. అలా రొట్టెల పండుగ రూపం సంతరించుకుంది.

రొట్టెలు పంచితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులకు గట్టి నమ్మకం ఏర్పడింది. అలా కోర్కెలు తీరిన వారు కొత్తవారికి రొట్టెలను పంపిణీ చేస్తారు. ఎంతో నమ్మకం ఉండబట్టే ప్రతిఏటా బారాషాహీద్ దర్గాకు వస్తుంటామని భక్తులు చెప్తున్నారు. భక్తులు తమ కోర్కెలు తీరినందుకు గుర్తుగా ఏటా గోధుమ రొట్టెలను మొక్కులుగా చెల్లిస్తారు.

కొత్తగా కోర్కెలు కోరుకునే వారు.. అప్పటికే ఆ కోరిక తీరిన వారి చేతుల మీదుగా రొట్టెలను అందుకుంటారు. కోర్కె తీరిన వారు స్వయంగా అయిదు రొట్టెలను తయారు చేస్తారు. ఒకదాన్ని ఇంట్లో ఉంచి, మిగిలిన నాలిగింటినీ దర్గా దగ్గరకు తీసుకువస్తారు. సమాధుల్ని దర్శించుకుని చెరువు వద్దకు తీసుకెళ్తారు. నీళ్లను తలపై చల్లుకుని, కోర్కెలు నెరవేరాలంటూ వాటిని అవి కావాల్సిన వారికి అందజేస్తారు. ఎన్ని కోర్కెలు కోరుకున్నా.. ఒక్కో కోరికకు ఐదు రొట్టెలు పంచాల్సి ఉంటుంది.

 కోర్కెల్లో కూడా రకరకాలుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీయానంతోపాటు సంతాన రొట్టెలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటితో పాటు వివిధ కోరికలను బట్టి రొట్టెలు పంచుతుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దర్గా అనగానే సహజంగా ఎవ్వరైనా సరే.. ఒక మతానికి సంబంధించిన అంశంగా భావిస్తారు. కానీ నెల్లూరు బారాషహీద్ దర్గా విషయంలో మాత్రం అదే మీలేదు. ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు అన్ని మతాలవారూ తరలివస్తారు. ప్రతి ఏటా తాము కోరిన కోర్కెలు తీరినందుకో లేక కొత్తగా కోర్కెలు కోరుకునేందుకో వస్తూనే ఉంటారు. దీంతో ఏటేటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది.

ఇక గంధ మహోత్సవం వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు తెల్లవార్లూ జాగారం చేస్తారు. మత పెద్దలు తెచ్చే గంధం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తారు. గంధం తీసుకురాగానే భక్తులు దాన్ని అందుకునేందుకు పోటీపడతారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద బారాషహీద్ దర్గాలోని రొట్టెల పండగలోని ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం. నెల్లూరు కోటమిట్టలోని అమినీయా మసీదులో కొంతమంది మైనార్టీ నేతలు మొత్తం పన్నెండు మంది సభ్యులు కలిసి పన్నెండు బిందెలలో గంధాన్ని కలుపుతారు. తర్వాత మేళతాలాల మధ్య ఉప్పొంగిన భక్త జనం మధ్య కోలాహలంగా గంధాన్ని దర్గా దగ్గరకు తీసుకొస్తారు. పూలతో అలంకరించిన గంధం బిందెలను ఊరేగింపుగా తెస్తుంటే ముందు భాగంలో మేళతాళాలు, ఫకీర్ల జరుబులు, విన్యాసాలు అందరినీ అలరిస్తుంటాయి. మొదటి బిందె గంధాన్ని పన్నెండు సమాధులకు లేపనం చేసి, మిగతా పదకొండు బిందెల గంధాన్ని భక్తులకు పంచిపెడతారు. ఈ గంధాన్ని తమ దగ్గరుంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

By
en-us Political News

  
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.