రాష్ట్రానికి మోడీ ఢిల్లీ కి కేసీఆర్ మతలబు ఏమిటో ?

Publish Date:May 20, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రాజకీయం’ ఎవరికి ఒక పట్టాన అర్థం కాదు. ఆయన ఎప్పుడు ఏ అడుగు ఎందుకు వేస్తున్నారో, అయన సన్నిహితులకే కాదు, కొన్ని కొన్ని సందర్భాలలో ఆయనకు కూడా అర్థం కాదు. అందుకే అనేక సందర్భాలలో అయన నాలుక కరుచుకోవడం జరుగుతుందని అంటారు. అయితే, ఒకటి మాత్రం నిజం, ఆయన ఇంచుమించుగా ఓ పక్షం రోజులకు పైగా, ఫార్మ్ హౌస్’కే పరిమితం అయినా, ఇప్పుడు మరో పక్షం రోజులు ‘జాతీయ’ పర్యటనకు బయలుదేరి వెళుతున్నా అందుకు జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగానే భావించవలసి ఉంటుందని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

సరే, జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు. చేస్తున్న ప్రయత్నాలు  ఎంతవరకు ఫలిస్థాయి, కేసీఆర్ జాతీయ స్వప్నం ఏమవుతుంది అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ఇంకో ముఖ్య కారణం కూడా ఉందని తెరాస వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 26 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)ఎస్‌బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పటికే, ప్రధాని రాష్ట్ర పర్యటన విషయంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించక పోవడం ఒకసారి వివాదమైంది. గత ఫిబ్రవరిలో సమతా మూర్తి, రామానుజ ఆచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమమంతో పాటుగా, ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలాలో పాల్గొనేందుకు ప్రదాని హైదరాబాద్ వచ్చారు. అయితే, ఆ రెండు కార్యక్రమాలలో అధికార హోదాలో పాల్గొనవలసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలేదు. కనీసం,  విమానాశ్రయంలో ప్రధాన మంత్రిని రిసీవ్ చేసుకునేందుకు కూడా వెళ్ళలేదు. ఒక విధంగా, ప్రధాని పర్యటనను ముఖ్యమంత్రి బహిష్కరించారా అన్న సందేహం వచ్చే విధంగా వ్యవహరించారు. నిజంగానే అది రాజకీయంగానూ, అధికరికంగానూ కూడా వివాదం అయింది. 

దీనిపై రాష్ట్రంలోనే కాకుండా జాతీయా మీడియాలోనూ చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్న ముఖ్యమంత్రికి ఆ విధంగా కొంత మైలేజి వచ్చిందని, అప్పట్లో తెరాస నాయకులు చెప్పుకున్నారు. అయితే, ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ఎందుకు వెళ్ళలేదు అంటే, ముఖ్యమంత్రికి, జ్వరమని, ఆహ్వానం అందలేదని విభిన్న కథనాలు వినిపించినా, చివరకు కేంద్రపై యుద్ధం ప్రకటించిన నేపధ్యంలో రాజకీయ కారణాల కారణంగానే ప్రధానికి స్వాగతం పలకలేదనే అభిప్రయమే అందరిలో స్థిరపడింది.  

నిజానికి,అప్పటికంటే  ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం మరింతగా పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీపై దండయాత్రలు చేస్తుంటే, బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణపై రాజకీయ దండయాత్రలు సాగిస్తున్నారు. గత పదిహేను ఇరవై రోజుల్లోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత షా, రాష్ట్రంలో రాజకీయ పర్యటనలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత పాద  యాత్రలో పాల్గొన్నారు. జాతీయ నేతల పర్యటన సందర్భంగా ఏర్పాటు  చేసిన బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయి. ఆ రెండు పర్యటనలు విజయవంతం అవడం తెలంగాణ బీజేపీ నేతల్లో నూతనొత్తేజాన్ని నింపింది.

ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపే  విధంగా  విజయవంతం చేసేందుకు బీజేపి రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించే అన్ని మార్గాల్లో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచించినట్టు తెలుస్తోంది.

అదలా వుంటే, ప్రధాని పర్యటన అధికార పర్యటనే అయినా, నడ్డ్డా, అమిత్ షా పర్యటనల కొనసాగింపుగా జరుగుతున్న మోడీ పర్యటనను  రాజకీయ కోణంలోనూ చూడవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈనేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్’ స్వామి కార్యం స్వకార్యం కలిసి వచ్చేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా ప్రొటోకాల్  వివాదం నుంచి తప్పించుకునిందుకే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ..అక్కడి నుంచి పంజాబ్ టూర్ వెళుతున్నారని అంటున్నారు. ఏమైనా ప్రధాని, హైదరాబాద్ పర్యటన, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ రెండూ రాజకీయ యాత్రలు గానే చూడవలసి ఉంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.