రాష్ట్రానికి మోడీ ఢిల్లీ కి కేసీఆర్ మతలబు ఏమిటో ?

Publish Date:May 20, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రాజకీయం’ ఎవరికి ఒక పట్టాన అర్థం కాదు. ఆయన ఎప్పుడు ఏ అడుగు ఎందుకు వేస్తున్నారో, అయన సన్నిహితులకే కాదు, కొన్ని కొన్ని సందర్భాలలో ఆయనకు కూడా అర్థం కాదు. అందుకే అనేక సందర్భాలలో అయన నాలుక కరుచుకోవడం జరుగుతుందని అంటారు. అయితే, ఒకటి మాత్రం నిజం, ఆయన ఇంచుమించుగా ఓ పక్షం రోజులకు పైగా, ఫార్మ్ హౌస్’కే పరిమితం అయినా, ఇప్పుడు మరో పక్షం రోజులు ‘జాతీయ’ పర్యటనకు బయలుదేరి వెళుతున్నా అందుకు జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగానే భావించవలసి ఉంటుందని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

సరే, జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు. చేస్తున్న ప్రయత్నాలు  ఎంతవరకు ఫలిస్థాయి, కేసీఆర్ జాతీయ స్వప్నం ఏమవుతుంది అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ఇంకో ముఖ్య కారణం కూడా ఉందని తెరాస వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 26 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)ఎస్‌బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పటికే, ప్రధాని రాష్ట్ర పర్యటన విషయంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించక పోవడం ఒకసారి వివాదమైంది. గత ఫిబ్రవరిలో సమతా మూర్తి, రామానుజ ఆచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమమంతో పాటుగా, ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలాలో పాల్గొనేందుకు ప్రదాని హైదరాబాద్ వచ్చారు. అయితే, ఆ రెండు కార్యక్రమాలలో అధికార హోదాలో పాల్గొనవలసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలేదు. కనీసం,  విమానాశ్రయంలో ప్రధాన మంత్రిని రిసీవ్ చేసుకునేందుకు కూడా వెళ్ళలేదు. ఒక విధంగా, ప్రధాని పర్యటనను ముఖ్యమంత్రి బహిష్కరించారా అన్న సందేహం వచ్చే విధంగా వ్యవహరించారు. నిజంగానే అది రాజకీయంగానూ, అధికరికంగానూ కూడా వివాదం అయింది. 

దీనిపై రాష్ట్రంలోనే కాకుండా జాతీయా మీడియాలోనూ చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్న ముఖ్యమంత్రికి ఆ విధంగా కొంత మైలేజి వచ్చిందని, అప్పట్లో తెరాస నాయకులు చెప్పుకున్నారు. అయితే, ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ఎందుకు వెళ్ళలేదు అంటే, ముఖ్యమంత్రికి, జ్వరమని, ఆహ్వానం అందలేదని విభిన్న కథనాలు వినిపించినా, చివరకు కేంద్రపై యుద్ధం ప్రకటించిన నేపధ్యంలో రాజకీయ కారణాల కారణంగానే ప్రధానికి స్వాగతం పలకలేదనే అభిప్రయమే అందరిలో స్థిరపడింది.  

నిజానికి,అప్పటికంటే  ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం మరింతగా పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీపై దండయాత్రలు చేస్తుంటే, బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణపై రాజకీయ దండయాత్రలు సాగిస్తున్నారు. గత పదిహేను ఇరవై రోజుల్లోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత షా, రాష్ట్రంలో రాజకీయ పర్యటనలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత పాద  యాత్రలో పాల్గొన్నారు. జాతీయ నేతల పర్యటన సందర్భంగా ఏర్పాటు  చేసిన బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయి. ఆ రెండు పర్యటనలు విజయవంతం అవడం తెలంగాణ బీజేపీ నేతల్లో నూతనొత్తేజాన్ని నింపింది.

ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపే  విధంగా  విజయవంతం చేసేందుకు బీజేపి రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించే అన్ని మార్గాల్లో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచించినట్టు తెలుస్తోంది.

అదలా వుంటే, ప్రధాని పర్యటన అధికార పర్యటనే అయినా, నడ్డ్డా, అమిత్ షా పర్యటనల కొనసాగింపుగా జరుగుతున్న మోడీ పర్యటనను  రాజకీయ కోణంలోనూ చూడవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈనేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్’ స్వామి కార్యం స్వకార్యం కలిసి వచ్చేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా ప్రొటోకాల్  వివాదం నుంచి తప్పించుకునిందుకే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ..అక్కడి నుంచి పంజాబ్ టూర్ వెళుతున్నారని అంటున్నారు. ఏమైనా ప్రధాని, హైదరాబాద్ పర్యటన, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ రెండూ రాజకీయ యాత్రలు గానే చూడవలసి ఉంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయద జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.