ప్రజారోగ్యంపై మామా అల్లుళ్ల దృష్టి! మంగళగిరి, హిందూపురంలో ఆరోగ్య రథాలు

Publish Date:Aug 19, 2022

Advertisement

ఒక వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల కోసం పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేస్తూ రాకెట్ వేగంతో దూసుకు పోతుంటే.. మరో వైపు పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి స్పీడును అందుకుంటూ.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పరుగులు తీస్తున్నారు. ఆయనకు పార్టీ బలోపేతంతో పాటు మంగళగిరిలో తన విజయానికి బాటలు వేసుకోవడమన్న అదనపు బాధ్యత కూడా ఉంది.

ఎక్కడైతే పరాజయం ఎదురైందో అక్కడే తన విజయాన్ని ఘనంగా చాటాలన్న పట్టుదలతో లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే  మంగళగిరిలో అన్నా క్యాంటిన్లు ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా అందరికీ ఆరోగ్యమస్తు.. ప్రతి ఇంటికీ శుభమస్తు  అనే నినాదంతో సంజీవనీ ఆరోగ్య రథాన్ని   ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి వచ్చిన స్పందనకు ఏ మాత్రం తీసిపోని విధంగా  ఆరోగ్య రథానికి సైతం ప్రజాస్పందన వెల్లువెత్తుతుండటంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తున్నాయి.  ఆరోగ్య రథానికి వచ్చిన స్పందన ఏ స్థాయిలో ఉందంటే.. లోకేష్ స్ఫూర్తితో హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆరోగ్య రథాన్ని తన నియోజకవర్గంలో ప్రారంభించారు. త్వరలో హిందూపురం నియోజకవర్గంలో మరిన్ని ఆరోగ్య రథాలను తీసుకురావాలని బాలకృష్ణ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్య రథాన్ని తన నియోజకవర్గంలో కూడా ప్రారింభించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్ణయించారట. ఆ క్రమంలో ఇప్పటికే ఒక ఆరోగ్య రథం.. హిందూపురం చేరుకుని.. ప్రజలకు సేవలందిస్తోందని తెలుస్తోంది. మరి కొన్ని వాహనాలు.. మరి కొద్ది రోజుల్లో హిందూపురం చేరుకుంటాయని తెలుస్తోంది. ముచ్చటగా మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు కోసం బాలయ్య  ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆ క్రమంలో మరిన్ని పథకాలు తీసుకు వచ్చేందుకు ఈ మామా అల్లుళ్లు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకర్గానికి  మొత్తం మీద మూడు లేదా నాలుగు ఆరోగ్య రథాలను కేటాయించాలని వీరు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తన అల్లుడు, తెలుగుదేశం జాతీయ కార్యదర్వి నారా లోకేష్ ప్రజా సేవా దృక్ఫథం తనను ముగ్ధుడ్ని చేసిందని బాలయ్య అంటున్నారు. హిందూపురంలో తాను ప్రారంభించిన ఆరోగ్య రథం ప్రతీ రోజు ఓ గ్రామానికి వెళ్తి.. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి.. మందులిస్తారు. అయితే ఆరోగ్య పరంగా పెద్ద సమస్య ఉంటే.. పెద్ద ఆసుపత్రులకు వెళ్లాలంటూ వారిని రిఫర్ చేసి.. తక్కువ ఖర్చుతో అక్కడ వైద్యం అందేలా చర్యలు సైతం తీసుకొంటారు. పల్లెటూళ్లులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగ్గా పని చేయడం లేదు. దీంతో టీడీపీ తీసుకు వచ్చిన ఆరోగ్య రథాలకు ప్రజల్లో భారీగా డిమాండ్ ఏర్పడుతోంది.

ప్రజల ఆకలిని తీర్చడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు  మామా అల్లుళ్లు నడుం కట్టారు.    గత ప్రభుత్వ హాయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సేవలు అందేవనీ, కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ వైద్యం సరిగా అందడం లేదనీ ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బాలయ్య,   లోకేశ్ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి ఆరోగ్య రథాలను జనంలోకి పంపించడం పట్ల జనంలో హర్షం వ్యక్తం అవుతోంది.  

మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో తాను మంగళగిరి నుంచి బరిలో దిగనున్నట్లు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు.  అలాగే హిందూపురం నుంచే బాలయ్య మరోమారు బరిలో దిగనున్నారు. దీంతో మామా అల్లుళ్లిద్దరూ తమ తమ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూనే.. ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేసే బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్నారు. 

 

 

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.