కేసీఆర్ నేషనల్ టూర్ నేటి నుంచి.. జాతీయ రాజకీయాల దిశగా తొలి అడుగు?

Publish Date:May 19, 2022

Advertisement

కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశం దిశగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం నుంజీ దేశ వ్యాప్త పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు  రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే రాజకీయ, అర్థిక,  మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం అవుతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర సైనిక కుటుంబాలకు,  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన   రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు.  

వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందుకోసం ఆయన శుక్రవారమే తన పర్యటన ప్రారంభిస్తున్నారు. ముందుగా ఢిల్లీ వెళ్లి అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతో సిఎం సమావేశం అవుతారు. అలాగే మరింత పదునుగా మోడీ ఆర్థిక విధానాలను ఎండగట్టేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీ కానున్నారు. ఆర్థిక రంగ నిపుణులతో భేటీ సందర్భంగా  దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. మోడీ లోపభూయిష్ట ఆర్థిక విధానాలపై దేశ ప్రజలకు వివరించేందుకు అవసరమైన ఇన్ పుట్స్ ఈ సందర్భంగా వారి నుంచి స్వీకరిస్తారు. అలాగే  ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సిఎం కెసిఆర్ సమావేశమౌతారు.  

శుక్రవారం నుంచి ఆదివారం అంటే మే 22 వరకూ ఆయన హస్తినలోనే మకాం వేస్తారు. మే 22 మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీనుంచి చంఢీఘర్  వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా  జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సిఎం కెసిఆర్ పరామర్శించి ఒక్కో కుటుంబానికీ మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు.   ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ సింగ్ లు కూడా పాల్గొననున్నారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన  పంజాబ్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు   కేసీఆర్ ఆర్థిక సహాయం అందిస్తారు. ఆ తరువాత మే 2న ఆయన బెంగళూరు చేరుకుంటారు.  మాజీ భారత ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు. 

బెంగుళూరు నుంచి మే 27 తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనను  చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సిఎం కెసిఆర్ భేటీ అవుతారు.  అటునుంచి  సాయిబాబా దర్శనం కోసం సిఎం కెసిఆర్ షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.   ఒకటి రెండు రోజుల విశ్రాంతి తరువాత  మే 29 లేదా 30 న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సిఎం కెసిఆర్ బయలుదేరుతారు.  

గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సిఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సిఎం కెసిఆర్ ఆదుకోనున్నారు. మొత్తం మీద జాతీయ రాజకీయాలలో తన ఎంట్రీ గ్రాండ్ గా ఉండేందుకు కేసీఆర్ ఒక ప్రణాళిక మేరకు ముందుకు నడుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ప్రతిపాదనతో హస్తిన వెళ్లినప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసీఆర్ తో భేటీకి కూడా సుముఖత చూపలేదు. అయితే ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక ఆందోళనలో అసువులు బాసిన రైతు కుటుంబాల పరామర్శ కార్యక్రమంలో కేజ్రీవాల్ కేసీఆర్ తో కలిసి పాల్గొనడం విశేషమని అంటున్నారు.

తన జాతీయ అజెండా కు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడమే కాకుండా, కేంద్రం నిధులు నేరుగా పంచాయతీలకే అంటూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా కూడా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే లక్ష్యంతోనే కేసీఆర్ నేషనల్ టూర్ తలపెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.