అర్జెంటుగా అధ్య‌క్షులు ఎందుకు? కేసీఆర్‌లో భ‌యం జొచ్చిందా?

Publish Date:Jan 26, 2022

Advertisement

టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏండ్లు దాటింది. తెలంగాణ రాష్ట్రం సాకార‌మై ఏడేండ్లు గ‌డుస్తోంది. తెలంగాణ‌లో త‌మ‌దే తిరుగులేని పార్టీగా చెప్పుకునే కేసీఆర్‌.. స్వ‌రాష్ట్రం వ‌చ్చాక‌ ఇంత‌వ‌ర‌కూ టీఆర్ఎస్‌ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించింది లేదు. రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌మే కానీ.. కాంగ్రెస్‌లో మాదిరి జిల్లాల స్థాయిలో బ‌ల‌మైన వ్య‌వ‌స్థ మాత్రం లేదు. జిల్లా అధ్య‌క్షులు అవ‌స‌ర‌మేలేద‌ని గ‌తంలో ఓ సంద‌ర్భంలో కేసీఆర్ అన్నారు కూడా. అలాంటిది.. ఇప్పుడు స‌డెన్‌గా 33 జిల్లాల‌కు టీఆర్ఎస్ అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అదికూడా రిప‌బ్లిక్ డే రోజున‌.. అంత సీక్రెట్‌గా ఆ లిస్ట్ రిలీజ్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నేది మ‌రో అనుమానం.

ఓవైపు కాంగ్రెస్, బీజేపీలు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండయాత్ర చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై రంకెలేస్తున్నారు. బండి సంజ‌య్ గేరు మార్చి ఫుల్ రేజింగ్‌లో ఉన్నారు. స్టేట్ లెవెల్‌లో వీరిద్ద‌రూ కొట్లాడుతుంటే.. క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల కేడ‌ర్ దూకుడుగా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేస్తున్నాయి. అయితే, ప్ర‌తిప‌క్షాల దాడిని కాచుకోవ‌డంలో గులాబీ కేడ‌ర్ పూర్తిగా విఫ‌లం అవుతోంద‌నే చెప్పాలి. కేసీఆర్ ఒక్క‌డే ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోనో, తెలంగాణ భ‌వ‌న్‌లోనో ప్రెస్‌మీట్లు పెట్టి ఫైర్ అవుతున్నారు గానీ, జిల్లాల స్థాయిలో ఇటు ప్ర‌భుత్వం, అటు పార్టీ ప‌రంగా బ‌ల‌మైన వాయిస్ వినిపించే వారు క‌రువ‌వుతున్నారు. వ‌రిపై కేంద్రంతో యుద్ధాన్ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. తానొక్క‌డే ఫైట్ చేస్తున్నారు కానీ, ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌జ‌ల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేసేందుకు గానీ, రైతుల‌ను జ‌త‌క‌ట్టి కేంద్రం, బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు గానీ, కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌కు ధీటుగా బ‌దులిచ్చేందుకు గానీ.. గులాబీ కేడ‌ర్ ముందుకు రావ‌డం లేదు. ఆ.. మాకెందుకులే.. అంతా కేసీఆరే చూసుకుంటారులే.. అనే ఉదాసీన‌త టీఆర్ఎస్ శ్రేణుల్లో క‌నిపిస్తోంది. జిల్లా స్థాయిలో ప‌టిష్ట‌మైన పార్టీ నెట్‌వ‌ర్క్ లేక‌పోవ‌డం.. ఎవ‌రికీ జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని కేసీఆర్ చాలా ఆల‌స్యంగా గుర్తించినట్టున్నారు.

మ‌రో వాద‌నా వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ త్వ‌ర‌లోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తారంటూ గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజా ప‌రిణామం అందుకు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. జిల్లా అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించి.. క్షేత్ర స్థాయిలో పార్టీని ప‌టిష్టం చేసి.. అంతా ఓకే అనుకున్నాక‌.. ప్ర‌తిప‌క్షాల‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా.. స‌డెన్‌గా ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి గ‌తంలో మాదిరి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది కేసీఆర్ వ్యూహం అని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. లాస్ట్ ట‌ర్మ్ ఎల‌క్ష‌న్స్‌లో కాస్త ఫీల్ గుడ్ ఎన్విరాన్‌మెంట్ ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది. ఈసారి ప‌రిస్థితి దారుణంగా ఉంది. కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. వ‌రి వేస్తే ఉరి అన్నందుకు రైతులు.. ఉద్యోగాలు లేనందుకు నిరుద్యోగులు.. కొత్త పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు లేక పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు.. ద‌ళిత బంధు అంద‌రికీ ఇవ్వ‌క ద‌ళితులు.. గొర్రెల పంపిణీ లేక యాద‌వులు.. ఇలా దాదాపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే స‌మ‌యంలో.. దూకుడు మీదున్న కాంగ్రెస్‌, బీజేపీల వైపు ఆశ‌గా చూస్తున్నారు. 

స‌ర్వేల‌తో ఆ విష‌యం గుర్తించిన కేసీఆర్‌.. పార్టీ యంత్రాంగంతో ప్ర‌భుత్వ అనుకూల ప్ర‌చారం చేయించి.. ప్ర‌జావ్య‌తిరేక‌తను త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారు. ప్ర‌జ‌లు రేవంత్‌రెడ్డి వైపో, బండి సంజ‌య్ వైపో చూడ‌కుండా.. నిత్యం కాంట్ర‌వ‌ర్సీల‌తో పొలిటిక‌ల్ అటెన్ష‌న్ త‌న‌వైపున‌కే తిప్పుకుంటున్నారు. విప‌క్షాల‌కు క‌ట్ట‌డి చేసి.. ధీటుగా ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసేందుకే.. ఏడేళ్లుగా లేని జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను హ‌డావుడిగా ప్ర‌క‌టించార‌ని అంటున్నారు. 

తెలంగాణలోని 33 జిల్లాలకు టీఆర్ఎస్‌ అధ్యక్షులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. 19 మంది ఎమ్మెల్యేలకు.. ముగ్గురు ఎంపీలకు.. అలాగే ముగ్గురు జడ్పీ చైర్మన్లకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి. ఇందులోనూ జ‌న‌గామ‌, ఖ‌మ్మం, ములుగు లాంటి జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు, ఆశావ‌హుల‌కు షాకులు త‌ప్ప‌లేదు. 

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.
భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది.
చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది
హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.
రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్.
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.