ఎన్టీఅర్’కు జై .. కొడుతున్న కేసీఆర్

Publish Date:May 27, 2022

Advertisement

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరు తారక  రామ రావు,,జయంతి రేపు.(శనివారం) 1923 మే 23 న జన్మిచిన ఎన్టీఅర్, 1996 జనవరి 18 కన్ను మూశారు. అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ, హైదరాబాద్’లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రతి సంవత్సరం ఎన్టీఅర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా, తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. అయితే, ఈ సంవత్సరం వేడుకలకు ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంత్రి కేసీఆర్ జయంతి వేడుకలకు హాజరవుతున్నారు. 

అంతకు ముందు తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో ఏమో కానీ, తెరాస ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎప్పుడూ పాల్గొనని, తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా, ఎన్టీఅర్ నివాళులు అర్పించేందుకు, ఎన్టీఆర్ ఘాట్’ వెళుతున్నారు. నిజమే, మీరు విన్నది నిజమే. నిజంగానే ముఖ్యమంత్రి కేసేఆర్, రేపు ( మే 28 శనివారం) పార్టీ ముఖ్యులతో కలసి ఎన్టీఅర్ ఘాట్’కు వెళ్లి పెద్దాయనకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.

అయితే, గత 20 ఏళ్లలో  ఏనాడు లేని విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్’కు ఎన్టీఆర్ మీద ఇంత ప్రేమ, ఇంత భక్తి ఒక్క సారిగా ఎందుకు పుట్టుకొచ్చాయి? ఇప్పడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెరాస వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే, కేసేఆర్ ఏది చేసినా, ఉచితంగా చేయరు. ప్రయోజనం లేదనుకుంటే మహాత్ముల జయంతి వర్ధంతి వేడుకలనే స్కిప్ చేస్తారు. అలాగే, కేసీఆర్ అనూహ్యంగా ఒక అడుగు వేశారంటే దాని వెనక ఒక రాజకీయ వ్యూహం, ఎత్తుగడ ఉండి తీరతాయి, అనే విషయంలో ఎవరికీ అనుమానం లేదని, అదే విధంగా ఈ నిర్ణయం వెంక కూడా ఎదో వ్యూహం ఉండే ఉంటుందని, పరిశీలకు భావిస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్, అవసరం అయితే బొంత పురుగును అయినా ముద్దాడతానని ప్రకటించారు.ఇంకొక సందర్భంలో తెలంగాణలో స్థిరపడిన అంద్రోళ్ళ ఓట్ల కోసం, అంద్రోళ్ళ కాలిలో ముళ్ళు దిగితే, తన పంటితో తీస్తానని నమ్మ పలికారు. అంటే అవసరం అయితే, ఎవరిని అయినా సొంతం చేసుకునేదుకు, కేసీఆర్ ఎప్పుడు సిద్దంగా ఉంటారని వేరే చెప్ప నక్కరలేదని అంటారు. అలాగే, అవసరం తీరన తర్వాత అంతే, ‘ప్రేమ’ గా బయటకు గేన్తెస్తారని కూడా అంటారు అనుకోండి, అది వేరే విషయం. 

ఇక ఇప్పడు, ముందస్తు ఎన్నికలకువెళ్ళే ఆలోచనలో ఉన్న కేసీఆర్, అటు ఆంద్ర ఆరిజిన్ ఓటర్లను, ఇటు తెలుగు దేశం పార్టీ నాయకులు, క్యాడర్’ను బుట్టలో వేసుకునేందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పడు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారనే చర్చ రాజకీయ వర్గాలో జరుగుతోంది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అంత బలంగా లేక పోయినా, పార్టీకి సుశిక్షితులైన కార్యకర్తలు, బలమైన నాయకులు ఉన్నారు. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ మంత్రి వర్గంలో సగం మందికి పైగా మంత్రులు అంతా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు సిశిక్షణలో నాయకులుగా ఎదిగిన మాజే టీడీపీ నాయకులే ఉన్నారు.

అన్నిటినీ మించి బీసీల గుండెల్లో ఈనాటికీ ఎన్టీఅర్ బొమ్మ పదిలంగా వుంది, అందుకే, తెలుగు దేశం పార్టీ నాయకుల నుంచి క్యాడర్, ఓటర్ల వరకు అందరినీ తమ వైపుకు తిప్పుకునే ఎత్తుగడలోభాగంగానే కేసీఆర్, ఎన్టీఆర్ జయంతిని వినియోగించుకునే వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. అంతే కాదు, అవసరం అనిపిస్తే, రేపు ఎన్టీఅర్ ఘాట్’నుంచే కేసేఆర్, ఎన్టీఅర్ పేరున ఒక పథకమో మరొకటో ప్రకటించినా ప్రకటిస్తారని, అదే విధంగా, ఎన్టీఆర్’ కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినా  చేస్తారని అంటున్నారు.  
నిజానికి, పార్టీలతో సంబంధం లేకుండా పనికొచ్చే, ‘పెద్ద’ లను సొంతం చేసుకోవడం కేసీఆర్ ‘కు కొత్త కాదని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు శత జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించి పీవీ కుటుంబాన్ని, పీవీ సామాజిక వర్గాన్ని తమ  వైపుకు తిప్పుకున్న చరిత్రను గుర్తు చేస్తున్నారు. పేవీని సొంతంచేస్కోవడమే కాకుండా దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ వరస ఓటముల క్రమంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలో, పీవీ కుమార్తె, సురభి వాణీ దేవికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు.  సో.. ఇప్పడు ఎన్టీఅర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం కూడా పెద్దాయన మీద ఉన్న గౌరవంతోనో, భక్తితోనో కాదు, రాజకీయ అవసరం కోసమే అంటున్నారు.  

ఆయన అప్పుడు, పీవీని సొంతం చేసుకున్నారు. ఇప్పడు ఎన్టీఅర్’ను సొంతం చేసుకుంటున్నారు. అదే కేసీఆర్ జాతిపిత మహాత్మా గాంధీ, రాజకీయ నిర్మాత బీఆర్ అంబేద్కర్, జయంతి, వర్ధంతి వేడుకలకే ఈ నాడు హాజరు కాని, కేసీఆర్, ఎన్టీఅర్ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు.అంటే..ఆయన ఎంతటి రాజకీయ చతురుడో వేరే చెప్పనక్కరలేదు. అదే సమయంలో ఆయన్ని ఎన్నికల ఓటమి భయం ఎంతగా వెంతాడుతోందో కూడా .. తెలియచేస్తుందని, పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.