అమ్మో జ‌గ‌న‌న్నో!.. కొత్త జిల్లాల వెనుక ఇంత స్కెచ్ ఉందా?

Publish Date:Jan 26, 2022

Advertisement

అయ్యేది కాదు.. పొయ్యేది కాదు, అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనే తుట్టెను కదిల్చింది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయకపొతే కొంపలేవో మునిగి పోతునట్లు, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆగమేఘాల మీద  ‘ఆన్లైన్’ లో ఆమోదం తెలిపింది. అయితే, ఇది అయ్యేది కాదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా గణనకు 2020 జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్‌ (నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం జరీ చేసినప్రీజింగ్ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కూడా ‘ఫ్రీజింగ్’ మోమో జారీ చేసింది. దీంతోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రి య అధికారికంగా నిలిచిపోయింది. 

అంటే దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు  కొత్త జిల్లల ఏర్పాటు కుదిరే పని కాదు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన గారి 40 మంది సలహాదారులకు తెలియదా? ఈ మేరకు కేబినెట్‌ నోట్‌’ను ఆన్లైన్’లో  సర్క్యులేట్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు తెలియదా, ఆన్లైన్’లోనే ఆమోదం తెలిపిన మంత్రులకు తెలియదా అంటే అందరికీ తెలుసు. నిజానికి, ఇది కొత్త ట్రిక్ కాదు, గతంలోనూ ప్రయోగించి ఫెయిల్ అయిన పాత ట్రిక్కునే ప్రభుత్వం మళ్ళీ మరో మరో పైకి తీసింది. 

నిజానికి, గతంలోనూ అప్పటి చిక్కులోంచి బయటపడేందుకు, ప్రజలదృష్టిని రియల్ ఇష్యూస్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఇదే ట్రిక్ ప్లే చేసింది. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతలను వరదలు ముంచెత్తిన సమయంలో ముఖ్యమంత్రి ప్యాలెస్ గడప దాటలేదు. ప్రజలను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తీరును విపక్షాలు విమర్శించాయి. రోమ్ చక్రవర్తి ఫిడేలు రాగాలను గుర్తు చేసి దెప్పి పొడిచాయి. బాధిత ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు. ఆ సమయంలో అమరావతిలో జరిగిన ఎంపీల సమావేశంలో, ముఖ్యమంత్రి ‘కొత్తజిల్లాల అంశాన్ని ప్రస్తావించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. ఆ తర్వాత ఆ విషయం మరిచి పోయారు. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల సమయంలోనూ కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే, అప్పటి ఎన్నికల అధికారి రమేశ్‌ కుమార్‌ ‘సెన్సస్‌’ డైరెక్టర్‌ ఇచ్చిన ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు ఉండగా, ఎన్నికల సమయంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయడానికి వీల్లేదని అప్పటి సీఎ్‌సకు లేఖరాశారు. దీంతో ఆ ప్రక్రియను ఆపేశారు. ఫ్రీజింగ్‌ ఉత్తర్వులను ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు. కరోనా కారణంగా జన గణన పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇప్పట్లో అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

అయినా ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీదకు, తెచ్చింది? ఇదేమీ వెయ్యి డాలర్ల ప్రశ్న కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దిక్కు చూసినా అష్టమ దిక్కే కనిస్తోంది. ఓ వంక, ఉద్యోగులు,ఉపాధ్యాయులు రోడ్లెక్కేందుకు సిద్ధమయ్యారు. పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఆగ్రహంతో ఉన్నారు. సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా, ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, ఉద్యోగుల డిమాండ్స్ ఆమోదిస్తే, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పి, ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలను రెచ్చ గొట్టే ప్రయత్నం ప్రభుత్వం, అధికార పార్టీ చేశాయి. అయితే, తాతకు దగ్గులు నేర్పడం కుదిరే వ్యవహారం కాదని గుర్తు చేస్తూ ఉద్యోగులు, మాకసలు పీఆర్సీనే వద్దు,జీతం ఒక్క రూపాయి పెంచనూ వద్దు, పీఆర్సీ ఇస్తామంటున్న పది వేల కోట్ల రూపాయలను కూడా పేద ప్రజల సంక్షేమానికే ఖర్చు చేయండి, మాకు పాత జీతాలే ఇవ్వండి, అనే సరికి సర్కార్ పని కుడితిలో పడిన ఎలుకల మారింది. ఉద్యోగులను మోసం చేద్దామనుకుంటే అసలుకే మోసం వచ్చిందని అధికార పార్టీ అసంతృప్తులు అంటున్నారు.  

మరో వంక గుడివాడ కాసినో వివాదం ముదిరి పాకన పడుతోంది. మంత్రి కొడాలి నానీ, పూటకో అడుగు పక్కకు వేస్తున్నారు. ప్రభుత్వం మెడకు గుదిబండగా మారుతున్నారు, అనే మాట వినవస్తోంది. కాసినో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. నానీ, గత ‘చరిత్ర; చిట్టా  మొత్తం బయటకు వస్తోంది. ఇంత కాలం అంతగా వినిపించని ఆయన భూకబ్జాలు,అవినీతికి   సంబందించిన అనేక ఆరోపణలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవిగాక ఇంకా గా  నిగూడంగా ఉన్న చిక్కు ముళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని మరో మారు తెరమీదకు తెచ్చింది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ, మరొకరు కానీ, ‘చీటింగ్ ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై సక్సెస్’ అనుకుంటే అన్ని సందర్భాలో అది సాధ్యం కాదు. ఇప్పుడు, ఇది కూడా అంతే .. అంటున్నారు.

By
en-us Political News

  
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి, ప్రస్తుతం తిహార్ జైల్లో వున్నారు
మొన్నటి వరకు యువతరాన్ని పబ్జీ పిచ్చి పట్టి పిడించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న సీఎం. గత ఏడాది ఏప్రిల్ లో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదిక పేర్కొన్న మేరకు 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే సంపన్నుడిగా తేలారు.
చాలామంది దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నిస్తారు. దేశం నాకేమిస్తుందా అని ఆలోచిస్తారు.
పంచ్ డైలాగుల నుంచి పలాయనం దాకా వైసీపీ తిరోమన ప్రస్ధానం చేరుకుందా అంటే కడప జిల్లా రాజకీయాలలో జరుగుతున్న లేదా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తోంది. పులివెందుల పులి, సింహం సింగిల్ ఎంట్రీ వంటి డైలాగుల నుంచి తమపై ఎవరూ ఆరోపణలూ విమర్శలూ చేయకూడదంటూ కడప కోర్టు నుంచి తెచ్చుకునే వరకూ వైసీపీ వచ్చింది.
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి,
బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.