రామోజీతో అమిత్ షా భేటీ.. ఆంతర్యం ఏమిటి?

Publish Date:Aug 19, 2022

Advertisement

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో బేటీ కానున్నారు. మునుగోడులో ఈ నెల 21న జరగనున్న సభకు అమిత్ షా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే సభకు ముందు లేదా తరువాత అమిత్ షా రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇందు కోసం ఆయన షెడ్యూల్ లో ప్రత్యేకంగా మార్పులు కూడా చేశారు.

దాదాపు గంట సేపు రామోజీ రావు, అమిత్ షాల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిరువురి భేటీ అజెండా ఎమిటన్నది ఇతమిద్థంగా తెలియరాలేదు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బీజేపీల మధ్య సత్సంబంధాలు నెలకొనే వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రామోజీరావు, అమిత్ షాలు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వీరిరువురి మధ్యా భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం బీజేపీ- టీడీపీ మధ్య సంబంధాలే అని అంటున్నారు. బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు పార్టీలకూ అవసరమన్నది విశ్లేషకులు మాట. బీజేపీ ముందున్న లక్ష్యం తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం అయితే.. తెలుగుదేశం ఏకైక లక్ష్యం ఏపీలో వైసీపీని  మట్టి కరిపించి అధికారంలోకి రావడం. ఇందుకు ఏపీలో బీజేపీ అవసరం తెలుగుదేశం పార్టీకీ, తెలంగాణలో తెలుగుదేశం అవసరం బీజేపీకి ఉందన్నది వారు బెబుతున్న  మాట. అది వాస్తవం కూడా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి లీడర్ కొరత ఉన్నా క్యాడర్ మాత్రం చాలా బలంగా ఉందన్నది అందరూ అంగీకరించే మాట.

చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే ఆ ప్రభావం తెలంగాణలోని కనీసం పాతిక నియోజకవర్గాలలో బలంగా ఉంటుంది. ఆ బలమే ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీకి అవసరం. అలాగే ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే.. జనసేన సహకారం అవసరమనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా ఉండేందుకు ఇది అనివార్యమనీ విశ్లేషకులు అంటున్నారు. జనసేన తెలుగుదేశంకు దగ్గర కావాలంటే.. బీజేపీ నుంచి అభ్యంతరాలు ఉండకూడని పరిస్థితి ఉంది. అందుకే బీజేపీ సహకారం ఏపీలో తెలుగుదేశం పార్టీకి అవసరం.

ఆ పరస్పర అవసరాలే అనివార్యంగా రెండు పార్టీలనూ దగ్గరకు చేరుస్తున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే రామోజీరావుతో అమిత్ షా భేటీ కానుండటం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా ఒకసారి అమిత్ షా రామోజీరావుతో భేటీ అయ్యారు. అప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా  ఉన్నారు. అప్పుడు కూడా అమిత్ షా తాను స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో భేటీ అయ్యారు. ఇప్పుడు కూడా అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీలోనే రామోజీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై .. రామోజీరావుతో అమిత్ షా ఈ బేటీలో  చర్చ జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.  

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.