కుట్రదారులు కుట్రలతోనే నాశనం! కేసీఆర్ కు ఈటల శాపం..
Publish Date:Nov 3, 2021
Advertisement
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో ఎన్ని కుట్రలు చేసినా తనను ఓడించలేకపోయారని చెప్పారు. ప్రజలంతా ఏకోన్ముఖంగా కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు ఈటల. ప్రపంచ చరిత్రలో ఈ ఫలితం గొప్ప అధ్యాయమన్నారు. వందల కోట్ల రూపాయలు, మద్యం, పథకాలు పెట్టినా, ప్రతి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసినా ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మగౌరవం బావుటాను ఎగురవేసి విధంగా ధర్మం వైపు.. హుజరాబాద్ ప్రజలు నిలబడ్డారన్నాపు ఈటల రాజేందర్. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా.. వాళ్ల రుణం తీర్చుకోలేనేంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనపై కుట్రలు చేసి కేసీఆర్ బయటికి పంపిస్తే బీజేపీ అక్కున చేర్చుకుందని చెప్పారు ఈటల రాజేందర్. తనకు అన్ని రకాలుగా అండగా ఉంటానని అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి తనకు బాసటగా నిలిచారని చెప్పారు. 2018లో తనకు లక్షల 4 వేల ఓట్లు వస్తే ఇప్పుడు లక్ష 7 వేల ఓట్లు వచ్చాయన్నారు. తన జెండాతో, తన బొమ్మతో నేను గెలిచానని అహంకారంగా మాట్లాడారో.. దానికి విరుద్ధంగా ప్రజలు పిలుపునిచ్చారని రాజేందర్ వెల్లడించారు. కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయమన్నారు. 10 లక్షలు ఇచ్చినా అమ్ముడుపోబోమని దళిత బిడ్డలు ఎంతో గొప్పగా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని చెప్పారు. స్మశాన వాటికలకు పిలిపించుకొని మరీ డబ్బులు పంచారని ఆరోపించారు ఈటల రాజేందర్. ముందుగా 6000, తర్వాత నాలుగు వేల చొప్పున పంచారన్నారు. పోలీసుల అండతో ఎస్కార్ట్ వాహనంలో డబ్బులు తెచ్చి పంచారని చెప్పారు.చివరికి తెల్లబట్టలో పసుపు బియ్యం పెట్టి దేవుడు ముందు ప్రమాణం చేయించుకున్నారని తెలిపారు. పెన్షన్ పోతుందని వృద్ధులను బెదిరించారని ఆరోపించారు. దళిత బంధు కూడా ఆపేస్తామని భయపెట్టారని తెలిపారు. కుట్రదారులు ఎప్పుడు కుట్రలతోనే నాశనం అవుతారన్నారు ఈటల రాజేందర్. తనపై పోటీకి రావాలని కేసీఆర్, హరీష్ రావు కు సవాల్ చేస్తే.. రాకపోగా పొలగాన్ని నిలబెట్టారన్నారు. రెండు గుంటల వ్యక్తి ఇన్ని కోట్లు ఎలా ఖర్చు చేశాడని ఈటల ప్రశ్నించారు. కుట్రలతో దొంగ ఉత్తరాలతో తనను ఓడించాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటుందో అలాగే జరిగిందన్నారు. హుజురాబాద్ వచ్చి కుట్రలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానన్నారు. వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ఒత్తిడి తెస్తానని చెప్పారు ఈటల రాజేందర్.
http://www.teluguone.com/news/content/etela-rajender-hot-comments-on-cm-kcr-huzurabad-by-poll-25-125754.html