బీహార్ సీఎంగా ఎనిమిదోసారి..నితీష్ ప్రమాణ స్వీకారం రేపే!
Publish Date:Aug 9, 2022
Advertisement
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బుధవారం (ఆగస్టు 10)న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా మంగళవారం (ఆగస్టు9) న రాజీనామా చేసిన ఆయన ఇప్పటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్నజేడీయూ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో బీహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీతో ఇలా తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్ అలా మహాఘటబంధన్ తో చేతులు కలిపి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయిపోయారు. బుధవారం మధ్యాహ్నం ఆయన బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది ఎనిమిదో సారి అవుతుంది. బీహార్ సీఎంగా ఇప్పటి వరకూ ఏడు సార్లు పని చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలో విజయం సాధించి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు. బుధవారం ఆయన 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భాజపాతో తెగదెంపులు చేసుకున్నామని.. ఆర్జేడీ సారథ్యంలో ఏడు పార్టీలతో కూడిన మహాఘటబంధన్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఇప్పటికే నితీశ్ గవర్నర్ను కోరిన విషయం తెలిసిందే. మహాఘటబంధన్లో స్వతంత్రులతో పాటు 164 మంది ఎమ్మెల్యేలు సహా 7 పార్టీలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ తో కలిసి మీడియా సమావేశంలో నితీష్ వెళ్లడించారు. 243 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ కలిసి మెజారిటీని కలిగి ఉన్నాయి. జేడీయూకి 45, ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి జితన్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలను కమలం పార్టీ నాశనం చేస్తుందని, ఈ విషయాన్ని చరిత్రే చెబుతోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. పంజాబ్, మహారాష్ట్రలలో జరిగిందేమిటో అందరికీ తెలుసునని అన్నారు బిహార్లోనూ జేడీయూని చీల్చి భాజపా సొంతంగా పాలించాలనుకుందన్నారు. అయితే సీఎం నితీష్ కుమార్ త్వరగా మేల్కొని బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారని చెప్పారు. బిహార్లో బీజేపీ అజెండా అమలు కాకూడదనే తామంతా కోరుకుంటున్నట్టు ఇలా ఉండగా ఎన్డీయే కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలగడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నితీష్ కుమార్ బీజేపీనే కాదు బిహార్ ప్రజలను కూడా మోసం చేశారని విమర్శిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/eigth-time-bihar-cm-nitish-sworn-in-tomorrow-39-141607.html