దేశానికి చెదపు రుగులు అవినీతి, వారసత్వం

Publish Date:Aug 15, 2022

Advertisement

దేశాన్ని అవినీతి, వారసత్వం చెదపురుగుల్లా తొలిచేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయడం ప్రధానిగా మోడీకి ఇది తొమ్మదో సారి. ఈ సందర్భంగా ప్రధాని ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ప్రజలంతా ఏకమై దేశం నుంచి అవినీతినీ, వారసత్వ సమస్యనూ తరిమేయాలని పిలుపునిచ్చారు. అవీనీతిని నిర్మూలిస్తే సామాన్యుడి జీవితం మెరుగౌతుందన్నారు. అవినీతి పరులను క్షమిస్తే ప్రగతిని ప్రతిబంధకమన్నారు.  అమృత్ మహోత్సవాల సందర్భంగా కొత్త దశ, దిశను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ముందున్న మార్గం కఠినమై న‌ద‌ని, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్ స్వతం త్రంగా మనుగడ సాగించలేదని, ముక్కలు చెక్కలు అవుతుందన్న‌ వారి అభిప్రాయం తప్పని నిరూపించామన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి దన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలమని ప్రధాని మోదీ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, ఆజాదీకా అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ  స్వాతంత్ర్య దినో త్సవ శుభాకాంక్షలు చెప్పారు.  ఈ సందర్భంగా దేశ స్వాతం త్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవస రం ఉందన్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్‌లకు మనం రుణపడి ఉండాలన్నారు.  దేశంలోని ప్రతి ఒక్క పేద వారికీ సాయం అందేలా చూడటమే తన జీవిత లక్ష్యమన్నారు. 130 కోట్ల మంది ప్రజలు రాజకీయ సుస్థిరత ఫలాలను చూస్తు న్నా రన్న ప్రధాని.. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారన్నారు.
ఆత్మనిర్భర్‌ భారత్‌లో ప్రైవేటు రంగానిది కూడా కీలక పాత్రని, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ దశాబ్దం ఖచ్చితంగా టెక్నాలజీదేనని, దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. జైజవాన్‌, జైకిసాన్‌, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్‌ అన్నారు. రసాయన ఎరువులపై ఆధారపడడం తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు. వికసిత భారతం, బానిసత్వ నిర్మూలన, వారసత్వం, ఏకత్వం, పౌర బాధ్యత ఇవే మన పంచ ప్రాణాలని ప్రధాని మోదీ వ్యాఖ్యా నించారు. వచ్చే పాతికేళ్లు  పంచ ప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపిచ్చారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్‌లు మన ప్రతిభకు నిదర్శనమన్న ప్రధాని మోదీ..రెండు, మూడు స్థాయిల్లోని నగరాల నుంచి కూడా  ప్రతిభ వెలుగులోకి వస్తోంద న్నారు. మన సామర్థ్యాలపై మనం విశ్వాసం ఉంచాలన్నారు. మన దేశం ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించింద న్నారు. ప్రపంచ అవ సరాలను తీర్చే సత్తా భారత్‌కు ఉందన్నారు.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌మ ప్ర‌సంగానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనం తరం ఎర్ర కోటకు చేరుకున్న ప్రధాని మోదీకి.. త్రివర్ణ దళాల చీఫ్‌ల సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలికారు.

త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. గన్ సెల్యూట్ కోసం తొలిసారిగా దేశీయంగా రూపొందించిన హౌవిట్జర్ తుపాకులను ఉపయోంచారు. స్పెషల్ యూత్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌లో భాగంగా.. 14 దేశాలకు చెందిన 26 మంది ఆఫీసర్లు, 127 మంది క్యాడెట్లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా దేశ రాజ ధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పది వేల మందికిపైగా భద్రతా సిబ్బందితో ఎర్రకోట వద్ద బహుళ అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు.
ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది. ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని, ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది.
శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే.
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది.
ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.