అవినీతి అధికారుల మధ్య లెక్క తేలని వాటాలు,వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు......

Publish Date:Oct 17, 2019

Advertisement

 

కష్టపడి పని చేసే శ్రామికుల వేతనాలు అధికారుల చేతి వాటం ప్రదర్శించారు. అందినకాడికి దోచుకున్నారు. చివరకు వాటాల్లో తేడా వచ్చే సరికి అక్రమార్కుల బండారం బైటపడింది. అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిన్న మొన్నటివరకు కేవలం టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మాత్రమే అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు పారిశుధ్య విభాగానికి కూడా పాకే రోజంతా శ్రమించి పని చేసే కార్మికుల జీతాలను కూడా స్వాహా చేయడం మొదలు పెట్టారు కొందరు అధికారులు.

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు వాటా పంపకాల్లో తేడా రావడంతో చివరకు అవినీతి పుట్ట కదిలింది. విజయవాడ నగర పాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు మూడు వేల మంది డ్వాక్రా సభ్యులు పనిచేస్తున్నారు. వీరికి ఇరవై నెలల క్రితం వరకూ పది వేల రూపాయల వేతనం చెల్లించేవారు. ఇరవై నెలల కిందట కార్మికుల జీతాన్ని పదకొండు వేల రూపాయలకు పెంచారు.

జీతమైతే పెంచారు కానీ వాటిని అమలు చేయకుండా కాగితాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక్కో కార్మికుడికి ఇరవై వేల వరకు వేతన బకాయిలు చెల్లించాల్సి వుంది. అందరికీ కలిపి ఇరవై నెలలకు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల క్రితం మొత్తం వేతన బకాయిలు యాభై శాతం అంటే మూడు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.

కొంత మంది అవినీతి అధికారులు కుమ్మక్కై ఈ నిధుల్లో ముప్పై లక్షల వరకు పక్కదారి పట్టించారు. వాస్తవంగా పని చేసే కార్మికుల కన్నా రికార్డుల్లో ఎక్కువ సంఖ్య ను చూపి నిధులను దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తూ వచ్చాయి.

దీనికి చెక్ పెట్టేందుకు కార్మికులకు ఐరిష్ హాజరును ప్రవేశపెట్టారు దీన్ని సైతం తప్పు దారి పట్టించేలా రికార్డు సృష్టించారని సమాచారం. కేవలం రికార్డుల్లో మాత్రమే ఉండి క్షేత్ర స్థాయిలో లేని కార్మికులకు ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జీతాలు డ్రా చేశారు.  ఇప్పుడు వారి వేతన బకాయిలను కూడా చడీచప్పుడూ లేకుండా స్వాహా చేసేందుకు పథకం వేసుకున్నారు. అదే సమయంలో అవినీతి అధికారుల మధ్య వాటాలు పంచుకోవడంలో విబేధాలు తలెత్తాయి.

ఇప్పటి వరకూ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం కాస్త కమిషనర్ దృష్టికి వెళ్లింది. కార్పోరేషన్ లో జరుగుతున్న అవినీతి భాగోతంపై కమిషనర్ రహస్యంగా విచారణ జరిపారు. నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణ లో వాస్తవం ఉందని నిర్థారించుకున్నారు. సంబంధిత విభాగం ఉన్నతాధికారి కి షోకాజ్ నోటీస్ తో పాటు విభాగం సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యను తీసుకోబోతోందో వేచి చూడాలి.

By
en-us Political News

  
చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కా ల్పుల్లో 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు.
​వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టి అప్పుల‌పాలు చేసి ప్ర‌జ‌ల నెత్తిమీద భారం మోపాడు. 
జగన్ పాలనలో ప్రజలకు జీఎస్టీతో పాటు జీ టాక్స్ భారం పడిందని విజయవాడ లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఖిల భారత సర్వీసులలో నియామకాల  కోసం ప్రతి  యేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యానికి రాకుండా..తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని...ఈ ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎక్క‌డా అభివృద్ది జ‌ర‌గ‌లేదు అంతా శూన్యమ‌ని టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ది కేశినేని శివ‌నాథ్ సోద‌రి కేశినేని శ్రీదేవి అన్నారు.
తెలంగాణలో ముక్కోడిని  ఇంటికి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్‌లో తిక్కోడు కూడా ఇంటికి పోతాడు
పదేళ్ల పాటు తెలంగాణలో  చక్రం తిప్పిన బిఆర్ఎస్  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ఇల్లు లేదా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. ఓటమి నుంచి తేరుకోకమునుపే కూతురు కవిత తీహార్ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెట్టడం కెసీఆర్ ను కలచివేసింది.
ఒక్క ఛాన్స్ అంటూ మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మాట త‌ప్పాడు. ఐదేళ్ల‌లో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో మ‌ధ్య‌పాన నిషేధం చేస్తాన్న జ‌గ‌న్ ఆ మాట మ‌ర్చిపోయాడు. ఇచ్చిన మాట‌ను తప్పిన జ‌గ‌న్ కి నైతికంగా ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే హ‌క్కులేద‌ని తెలుగుదేశం విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ అన్నారు.
గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన మాజీ సి ఎం  కెసీఆర్ కూతురు కవితకు బెయిల్ ఇప్పట్లో లభించేలా లేదు.
అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో
సికింద్రాబాబ్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.  ఈ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లింక్ ను ఓపెన్ చేయాలి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.