సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర
Publish Date:Aug 19, 2022
Advertisement
దేశంలో అన్ని వర్గాలవారిని ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తలపెట్టిం ది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న తన ప్రతిష్టాత్మకమైన భారత్ జోడో యాత్రలో పౌర సమాజాన్ని భాగ స్వామ్యం చేయాలని కోరుతూ, పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు, మేధావులు, రచయితలతో ఆగస్టు 22న కాంగ్రెస్ సమావేశం కానుంది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ కన్యాకుమారిలో సెప్టెంబరు 7న ఈ యాత్రను ప్రారంభిం చనున్నారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 3,571 కి.మీటర్ల మేర 68 లోక్ సభ నియో జక వర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. దేశ రాజధానిలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో దాదాపు 150 మంది పౌర సమాజ ప్రతినిధులతో కాంగ్రెస్ సమా వేశాన్ని నిర్వహించనుందని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు సెప్టెంబరు 23న, యాత్రకు అంకితమైన పార్టీ లోగో, నినాదం మరియు వెబ్సైట్ను ప్రారంభిస్తారు. పాదయాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. దాదాపు 3500 కి.మీ పొడవునా దాదాపు 150 రోజుల్లో పూర్త వుతుంది. రాహుల్తో సహా కాంగ్రెస్కు చెందిన దాదాపు 150 మంది నాయకులు పాదయాత్రలో పాల్గొం టారు. అలాగే రాష్ట్ర యూనిట్ నాయకులు కూడా చేరనున్నారు. కాగా, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో యాత్ర దాదాపు 15-20 రోజు ల పాటు కొనసాగు తుం దని అంచనా. ఇతర రాష్ట్రాలు మూడు నుంచి ఐదు రోజుల్లో యాత్ర ముగించ వచ్చు. అనారోగ్య కారణాల దృష్ట్యా సెప్టెంబర్ 7న జరగనున్న పాదయాత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదు. ఆమె కోవిడ్-19తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తు తం ఆమె ఐసొలేషన్లో ఉన్నారు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు, రైతులు, బలహీనపక్షాల తరఫున కొనసాగనున్న ఈ జోడోయాత్ర గురించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మీడియాకు వివరించారు. రాయపేటలోని టీఎన్సీసీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్లో జరిగిన ఈ సమావేశానికి కేఎస్ అళగిరి నేతృ త్వం వహించగా, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్లు దినేష్ గుండూరావు, సిరివళ్ల ప్రసాద్, సీనియర్ నేతలు కుమరి అనంతన్, ఈవీకే ఎస్ ఇళంగోవన్, తంగబాలు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ జయకుమార్, డాక్టర్ చెల్లకుమార్, తిరు నావుక్కరసు, జ్యోతిమణి, ఎమ్మెల్యేలు సెల్వం పెరుందగై, రూబీ మనోహరన్, రాజేష్కుమార్ విజయ తరణి, ప్రిన్స్, టీఎన్సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, ఎస్ఏ వాసు, జిల్లా అధ్యక్షులు జె.ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ అళగిరి, గుండూరావు మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో 4 రోజుల పాటు సాగే పాదయాత్రలో రాహుల్గాంధీ పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్రం లోని 76 కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సెప్టెం బరు 7వ తేదీ కన్యాకుమారిలో రాహుల్గాంధీ అక్కడున్న కామరాజర్ మండపంలో నివాళులర్పి స్తారని తెలిపారు. అక్కడి నుంచి 3 కి.మీటర్ల మేర పాదయాత్ర చేస్తారన్నారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగసభలోనూ ప్రసంగిస్తారని తెలిపారు. 8వ తేదీ ఉదయం కన్యాకుమారి నుంచి కల్యక్కావలై వరకు సుమారు 60 కి.మీ దూరాన్ని సుమారు 3 రోజుల్లో అధిగమిస్తారన్నారు. దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివ రించారు.
http://www.teluguone.com/news/content/congress-bharath-jodo-from-sept7-39-142216.html