Top Stories

political-news-img

బోండా ఉమా కామెంట్స్‌పై రాజకీయ కాక.. కాపులకు క్లారిటీ ఉంది.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంపై వివాదం సృష్టించింది. గుంటూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో ముచ్చటించడం, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఓటింగ్ శైలి, పార్టీ అంతర్గత నిర్ణయాలపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు అమరావతి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధిష్టానం దీనిపై వివరణ కోరడంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాలపై ప్రముఖ అనలిస్ట్ విక్రమ్ పూలా తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగుదేశం విఫ్ గా ఉంటూనే బోండా ఉమా ఒకటిరెండు సార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాలను గుర్తు చేసిన విక్రమ్ పోలా.. బోండా ఉమా వ్యాఖ్యలకు, ఆయన వ్యవహార శైలికి పెద్ద ప్రాముఖ్యత నివ్వాల్సిన అవసరం లేదన్నారు. ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు. ఒకవైపు రాష్ట్రంలో అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి, భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి వంటి సంక్షేమ, ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉన్న వేళ బోండా ఉమా వైఖరి పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. అయినంత మాత్రాన బోండా ఉమా వ్యవహారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాపులకు క్లారిటీ ఉందన్న విక్రమ్ పోలా.. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన కాపు నాయకులు ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత అక్కడ ఎలాంటి ప్రాముఖ్యతా లేక, ఇమడ లేక తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన విక్రమ్ పోలా.. బోండా ఉమా విషయానికి అనవసర ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరమన్నారు. Bonda Uma controversy, TDP Kapu politics, Ambati Rambabu Bonda Uma, AP political developments, Tone News Telugu news

Publish Date: Jul 29, 2026 4:18PM

political-news-img

రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా... అసలు కారణం ఇదే!

రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? అర్థరాత్రి వరకు మేల్కొని ఉండాల్సి వస్తుందా? ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇన్సోమ్నియా (Insomnia) ఒకటి. ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆందోళన, మొబైల్ ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు వంటి అనేక కారణాల వల్ల నిద్ర సమస్యలు పెరుగుతున్నాయి. ఈ వీడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ డా. సి. మంజులా రావు నిద్ర ఎందుకు పట్టదో, ఇన్సోమ్నియా రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటో, నిద్రలేమి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో సులభంగా వివరించారు. అలాగే ఎలాంటి మందులు లేకుండానే మంచి నిద్ర కోసం పాటించాల్సిన రోజువారీ అలవాట్లు, పడుకునే ముందు చేయాల్సిన చిన్న చిన్న మార్పులు, మానసిక ప్రశాంతతను పెంచే సూచనలు మరియు గాఢమైన నిద్ర కోసం ఉపయోగపడే సులభమైన చిట్కాలను కూడా ఈ వీడియోలో వివరించారు. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నిద్ర సమస్య ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Jul 29, 2026 4:07PM

political-news-img

తెలంగాణకు భారీ వర్ష సూచన.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్.!

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే మంగళ, బుధ (జులై 28, 29) తేదీలలో తెలంగాణలోన పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. రానున్న రెండు మూడు రోజులలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమౌంది. ముఖ్యంగా పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజులలో కూడా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గురు, శుక్రవారాల్లో (జులై 30, 31) సైతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల పట్టణాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. Telangana Rains, IMD Yellow Alert, Telangana Weather Forecast, Hyderabad Rains Update, Depression Rain Alert

Publish Date: Jul 29, 2026 3:42PM

political-news-img

జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..!

జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో, పిల్లలను సరైన మార్గంలో నడిపించడం ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు. అయితే పిల్లలు చురుగ్గా ఉంటూ, చదువులో కూడా రాణిస్తూ, మంచి ప్రవర్తనతో ఉండటానికి జపనీస్ పెంపకం చాలా బాగా సహాయపడుతుందట. ఇంతకీ ఆ జపనీస్ పెంపకం చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. జపనీస్ పెంపకం.. జపనీస్ పెంపక విధానం బాధ్యతాయుతమైన, సున్నితమైన , స్వయం సమృద్ధిగల పిల్లలను తయారుచేయడంలో సహాయపడుతుందట. పిల్లల భవిష్యత్తును బలోపేతం చేయడానికి సహాయపడుతుందట. జపనీస్ పెంపకం చిట్కాలు.. బాధ్యతను నేర్పించడం.. జపాన్‌లో పిల్లలు చాలా చిన్న వయస్సు నుండే చిన్న పనులను స్వయంగా చేసుకోవడం నేర్చుకుంటారు. స్కూల్ బ్యాగులు సర్దుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం లేదా చిన్న చిన్న ఇంటి పనులలో సహాయం చేయడం వంటివన్నీ వారి దినచర్యలో భాగం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, బాధ్యతా ఉండటాన్ని అభివృద్ధి చేస్తుంది. క్రమశిక్షణ.. జపనీస్ పెంపకంలో క్రమశిక్షణను కఠినంగా కాకుండా ఒక అలవాటుగా నేర్పిస్తారు. పిల్లలకు సమయానికి విలువ ఇవ్వడం, నియమాలను పాటించడం , ఇతరులను గౌరవించడం నేర్పిస్తారు. పాఠశాలల్లో, పిల్లలు తమ తరగతి గదులను కూడా స్వయంగా శుభ్రం చేసుకుంటారు. ఇది వారిలో సామూహిక బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. జపనీస్ తల్లులు తమ పిల్లల బాల్యంలో వారితో గాఢమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంటారు. దీనిని 'అమాయే' అని పిలుస్తారు. దీనిలో పిల్లలు సురక్షితంగా , ప్రేమతో చుట్టుముట్టబడినట్లు భావిస్తారు. ఇది వారి మానసిక వికాసాన్ని మెరుగుపరుస్తుంది , వారు మరింత ఆత్మవిశ్వాసంగా మారడానికి సహాయపడుుతంది. టీమ్ వర్క్.. జపనీస్ సంస్కృతిలో పిల్లలకు టీమ్ వర్క్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ,అందరూ కలిసి ఆలోచన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి నేర్పిస్తారు. ఇది వారు సమాజంలో మరింత మెరుగ్గా కలిసిపోవడానికి సహాయపడుతుంది. స్క్రీన్ సమయం.. జపనీస్ తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లు , టెలివిజన్‌కు దూరంగా ఉంచి, సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. చదవడం, ఆరుబయట ఆడుకోవడం , కళలలో నిమగ్నమవడం వారి దినచర్యలో భాగం. ఇది వారి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుంది. తప్పుల నుండి నేర్చుకోవడం.. ప్రతి చిన్న తప్పుకు పిల్లలను తిట్టే బదులు, వారికి సలహా ఇచ్చి, వారి తప్పుల నుండి నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణానికే ప్రాధాన్యత.. అక్కడ కేవలం మార్కుల మీదనే కాకుండా, నిజాయితీ, వినయం, సానుభూతి వంటి గుణాలపై దృష్టి పెడతారు. అందుకే అక్కడ చదువు కన్నా, వ్యక్తిత్వ నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. *రూపశ్రీ.

Publish Date: Jul 29, 2026 3:39PM

political-news-img

టాక్సిక్ పాజిటివిటీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే యావలో చాలామంది ఎదుర్కునే అతిపెద్ద సమస్య..!

టాక్సిక్ పాజిటివిటీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండటం మంచిదేనా? జీవితం అన్నాక సంతోషాలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "అంతా సర్దుకుంటుంది," "ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించు!".. ఇలా చాలా మంది ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. ఈ మాటలు వినడానికి బానే ఉంటాయి. కానీ మనస్తత్వవేత్తలు మాత్రం ఇది సరికాదు అంటున్నారు. దీన్ని టాక్సిక్ పాజిటివిటీ అని పిలుస్తారట. ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. కష్టంలో ఉన్నప్పుడు పాజిటివిటీ మాటలను ఒక మెడిసిన్ లాగా ఉపయోగిస్తారు. కానీ ఇది కాలక్రమేణా మనిషిని ఒంటరిని చేస్తుందని మానసిక విశ్లేషణ నిపుణులు అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. టాక్సిక్ పాజిటివిటీ అంటే.. సులభంగా చెప్పాలంటే టాక్సిక్ పాజిటివీటి అంటే మనిషిలో ఉండే నిజమైన ఫీలింగ్స్ ను అంగీకరించకుండా వాటిని దాచడానికి ప్రయత్నించడం. ఈ రోజుల్లో, సోషల్ మీడియా కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా "బలంగా ఉండాలి" అనే మనస్తత్వం వల్ల ప్రజలు తమ దుఃఖాన్ని, భయాన్ని లేదా వైఫల్యాన్ని వ్యక్తపరచడానికి సంకోచిస్తున్నారు. అలా వ్యక్తం చేయడం ఒక పెద్ద బలహీనత అని అనుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా, బలంగా కనిపించాలనే తీవ్రమైన ఒత్తిడి వ్యక్తిలో అపరాధ భావాన్ని మాత్రమే పెంచుతుంది. ఎమోషన్స్ అణిచివేత ప్రమాదం.. మనిషిలో ఉండే నిజమైన , ప్రతికూల భావోద్వేగాలను దాచుకోవడం చాలా హానికరం అని మానసిక పరిశోధనలు కూడా స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. తమ ఎమోషన్స్ ను అణచిపెట్టుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు అకస్మాత్తుగా భయాందోళనలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మనిషి తన నెగిటివ్ ఎమోషన్స్ ను నిరంతరం అణచివేస్తే, వారి ఒత్తిడి వేగంగా పెరుగుతుందట. ఇది సంబంధాలపైనా, మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యక్షంగా, చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట. నిజమైన మానసిక బలం.. మనిషిలో ఉన్న ఎమోషన్స్ ను ఓపెన్ గా యాక్సెప్ట్ చేయడమే నిజమైన మానసిక బలం అని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. విచార భావనలు ఎప్పుడూ తప్పు కాదు. వాటిని అణచివేయకుండా అర్థం చేసుకుని స్వీకరించడమే మనిషిని మానసికంగా దృఢంగా చేస్తుంది. నిజమైన మానసిక బలం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కాదు, మనుషులుగా మనం కొన్నిసార్లు కుంగిపోవడం సహజమని అంగీకరించడమే. టాక్సిక్ పాజిటీవిటీ నుండి బయట పడటానికి సూచనలు.. విచారాన్ని బలహీనతగా భావించకూడదు.. ఎమోషన్స్ ను, అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరచాలి, విచారాన్ని ఓటమిగా పరిగణించకూడదు. నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం.. కష్ట సమయాల్లో ఆన్‌లైన్‌లో ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడానికి బదులుగా, మీరు బాగా నమ్మే వ్యక్తులతో సమస్యలను నిష్కపటంగా పంచుకోవాలి. దీని వల్ల ఊరట లభిస్తుంది, భారం తగ్గినట్టు అవుతుంది. సలహా ఇవ్వడానికి బదులుగా వినాలి.. మీ చుట్టూ ఎవరైనా విచారంగా ఉంటే, వారికి ఊరట ఇవ్వడానికి భరోసా మాటలు చెప్పడానికి బదులుగా వారి సమస్య ఏంటో మొదట ఓపికగా వినాలి. తమ భాదను వెంటే చాలామంది మానసికంగా కుదటపడతారు, తిరిగి ధైర్యం కూడా తెచ్చుకుంటారు. "సానుకూల ఆలోచన"తో అస్సలు మార్చలేని కొన్ని సంఘటనలు ఉంటాయి. అందువల్ల, విచారాన్ని పూర్తిగా కొట్టిపారేయడం పాజిటివ్ మార్గం కాదు, అది ఆత్మవంచన. కాబట్టి ఎప్పుడూ అన్నిటికీ పాజిటివ్ గా ఉండాలని, పాజిటివ్ జరగలేదని బాధపడకూడదు. *రూపశ్రీ.

Publish Date: Jul 29, 2026 3:28PM

political-news-img

వన్ ఆఫీసర్.. వన్ కార్.!

ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యతాయుతమైన పాలన అందించడం, ప్రజాధనం వృథాను అరికట్టడం లక్ష్యంగా కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే వ్యయ విభాగం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారుల వాహనాల వినియోగానికి సంబంధించి నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఉన్నతాధికారులందరికీ ఒక అధికారికి ఒకే కారు విధానం అమలౌతుంది. ఇంత కాలంగా ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అదనపు బాధ్యతలు స్వీకరించినప్పుడు లేదా వేర్వేరు ప్రాజెక్టుల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి పదవికి ఒక వాహనం చొప్పున బహుళ వాహనాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2022 నాటి పాత మార్గదర్శకాలకు అనుబంధంగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఆర్థిక శాఖ వ్యయ విభాగం అటువంటి సదుపాయాలకు చెక్ పెట్టాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఒక అధికారికి ఒకటికి మించిన అదనపు బాధ్యతలు లేదా శాఖలు అప్పగించినప్పటికీ, సదరు అధికారికి రెండో ప్రభుత్వ వాహనాన్ని కేటాయించడానికి వీలులేదు. అంతేకాకుండా, ప్రభుత్వం అధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ రకాల కేంద్ర బోర్డులు, స్వయంప్రతిపత్తి సంస్థలకు చెందిన వాహనాలను ఉన్నతాధికారులు తమ సొంత పనులకు లేదా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడటాన్ని పూర్తిగా నిషేధించింది. Central Government, , Ministry of Finance, Department of Expenditure, Government Vehicle Rules, Expenditure Guidelines

Publish Date: Jul 29, 2026 3:22PM

MOVIE NEWS